Breaking News

Day: January 13, 2021

సంక్రాంతి వేళ విషాదం

సంక్రాంతి వేళ విషాదం

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. సంక్రాంతి పండుగ పూట ఈ విషాదకర ఘటన బుధవారం సాయంత్రం చిన్నశంకరంపేట గ్రామశివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన నిమ్మతోట ఆంజనేయులు(38) చిన్నశంకరంపేటలో వీక్లీ మార్కెట్ ముగించుకుని ఇంటికి బయలుదేరి వెళ్తున్నాడు. చిన్నశంకరంపేట – అంబాజీపేట గ్రామాల సరిహద్దు కల్వర్టుపై మెదక్ నుంచి ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఎక్సెల్ పై వెళ్తున్న ఆంజనేయులు తలకు తీవ్ర […]

Read More
వాటర్ వర్కర్స్ యూనియన్ క్యాలెండర్​ఆవిష్కరణ

వాటర్ వర్కర్స్ యూనియన్ క్యాలెండర్​ ఆవిష్కరణ

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును బుధవారం హైదరాబాద్ వాటర్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కలిశారు. ఎస్సీ, ఎస్టీ వాటర్ వర్కర్స్ యూనియన్ క్యాలెండర్ ను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

Read More
ఘనంగా గోదాదేవి కల్యాణం

ఘనంగా గోదాదేవి కల్యాణం

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ ​జిల్లా రామాయంపేట మండలంలోని చల్మేడ గ్రామంలో తిరుమల స్వామి ఆలయంలో బుధవారం ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదాదేవి కల్యాణం వేదపండితులు వాసుదేవచారి, హర్షవర్ధన్ చారి, అర్చకుల సమక్షంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహిపాల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More
‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్’తో ఎంతో మేలు

‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్’తో ఎంతో మేలు

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.26 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనం(సీడీఎస్) వచ్చే అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిర్మాణ పనులను బుధవారం సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్​లు గువ్వల బాలరాజ్, బాల్క సుమన్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాలే యాదయ్య, గోపీనాథ్, గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబాపసియుద్దీన్ తదితరులు సందర్శించారు. దళితుల అభ్యున్నతి […]

Read More
రామగుండం ఐటీ పరిశ్రమలకు అనువైన ప్రాంతం

రామగుండం ఐటీ పరిశ్రమలకు అనువైన ప్రాంతం

సారథి న్యూస్, రామగుండం: రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు ఆదేశాల మేరకు ఐటీ సీఈవో(ప్రమోషన్స్) విజయ్ ​రంగనేనితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి ఐటీ పార్క్ వస్తే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు.మంత్రి నిరంజన్​రెడ్డిని కలిసిన కోరుకంటిఅంతకుముందు ఆయన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డిని కలిశారు. రైతు వేదికలు, వ్యవసాయ మార్కెట్​ ప్రారంభోత్సవానికి రావాలని […]

Read More