Breaking News

తల్లిదండ్రులు మందలించారని..

తల్లిదండ్రులు మందలించారని..

సారథి న్యూస్​, గద్వాల: తల్లిదండ్రులు మందలించారని ఓ బాలుడు(16) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గద్వాల పట్టణ‌ ఎస్సై రమాదేవి కథనం మేరకు.. గద్వాల పట్టణం హాట్కర్ వీధిలో నివసించే ఓ బాలుడు‌ రెండు రోజులుగా సెల్ ఫోన్ లో ఆన్​లైన్​ క్లాసులు వినకుండా గేమ్స్ ఆడుతుండడంతో ఇది గమనించిన తల్లిదండ్రులు మందలించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ బాలుడు ఇంట్లోని ఫ్యాన్​కు ఉరివేసుకుని సూసైడ్​ చేసుకున్నాడని గద్వాల టౌన్ ఎస్సై రమాదేవి తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.