కరోనా నుంచి పిల్లలకు విరుగుడు సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో అదర్ పునావాలా న్యూఢిల్లీ: భారత్లో కరోనాకు వ్యతిరేకంగా పిల్లలకు కోవోవాక్స్ టీకాలు వేయాల్సి ఉంటుందని, కోవిషీల్డ్ వ్యాక్సిన్ కాదని సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో అదర్ పునావాలా అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కోవోవాక్స్ టీకా ఆరు నెలల్లో అందుబాటులో ఉంటుందని, ప్రస్తుతం ట్రయల్స్ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు ఉత్పన్నం కాలేదని స్పష్టం చేశారు. కోవోవాక్స్తో రెండేళ్లలోపు పిల్లలకు టీకాలు వేయడం […]
జాక్ డోర్స్ స్థానంలో నియామకం పరాగ్కు అభినందనలు తెలిపిన కేటీఆర్ న్యూయార్క్: మొన్న మైక్రోసాప్ట్.. నిన్న గూగుల్.. నేడు ట్విట్టర్.. గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలు వరుసగా భారతీయుల సారథ్యంలోకి వస్తున్నాయి. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ పగ్గాలు భారత సంతతి టెక్కీ చేతికి వచ్చాయి. ట్విట్టర్ కొత్త సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. సీఈవోగా ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సోమవారం దిగిపోవడంతో ఆయన స్థానంలో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న పరాగ్ అగర్వాల్ను […]
– టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ సామాజిక సారథి, వరంగల్: యాసంగి వడ్లు కొనమని చెప్పిన సీఎం కేసీఆర్ రైతుల ఓట్లు కోసమస్తామరా అని టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశానికి తెలంగాణ సీడ్ బౌల్, కోటి ఎకరాల మాగాణి అంటూ చెప్పిన కేసీఆర్ మాటలు నేడు నీటి మూటలయ్యాని ఎద్దేవా చేశారు. అన్నదాతలను ఆదుకోలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే […]
సామాజిక సారధి తిమ్మాజిపేట: గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న గిద్ద రమ్య అగర్వాల్ విద్యార్థికి ఫైన్ ఆర్ట్స్లోసీటు దక్కించుకుంది. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం మరికల్ గ్రామానికి చెందిన విద్యార్థి, రమ్య సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల గోపాల్పేట స్కూల్లో 5వ తరగతి పూర్తి చేసి ఆరో తరగతి ఫైన్ ఆర్ట్స్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయగా సెలెక్ట్ అయింది. ఫైన్ ఆర్ట్స్ స్కూల్ మేడ్చల్ మల్కాజ్గిరి లొ జాయిన్ చేసినట్లు గిద్ద విజయ్ […]
నాగర్ కర్నూల్జిల్లాలో బీజేపీకి నాయకత్వ లోపం సరైన లీడర్లేక నిరుత్సాహంలో కేడర్ కల్వకుర్తిలో ఒంటరి పోరాటం చేస్తున్న టి.ఆచారి అచ్చంపేటలో ముందుకెళ్తున్న బంగారు శృతి రెండు పర్యాయాలు గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతాపార్టీ(బీజేపీ) వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోనూ అధికారంలోకి రావాలని ప్లాన్ చేసుకుంటోంది. క్షేత్రస్థాయిలో ఇప్పటినుంచే కార్యాచరణ ప్రారంభించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం లేకపోవడంతో కేడర్నిరుత్సాహంతో ఉంది. ఇదే పరిస్థితిని నాగర్ కర్నూల్జిల్లాలోనూ ఎదుర్కొంటోంది. సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: […]
కందనూలు గడ్డపై నీలిజెండా ఎగరవేస్తాం ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం.. సమస్యలపై నిలదీస్తాం బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ ‘సామాజిక సారథి’తో ‘చిట్చాట్’ సామాజిక సారథి, నాగర్కర్నూల్ప్రతినిధి: ఇంటింటికీ బహుజన్సమాజ్పార్టీని తీసుకెళ్లడంతో పాటు గడపగడపకు ఏనుగు గుర్తును మోసుకెళ్తామని ఆ పార్టీ నాగర్కర్నూల్జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్చెబుతున్నారు. ప్రజల పక్షాల నిలబడతామని భరోసా కల్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కందనూలు గడ్డపై నీలిజెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘ఓటు హమారా.. సీటు తుమ్హరా.. నలే ఛలేగా’ అంటున్నారు. […]
సామాజిక సారథి, చారకొండ: రెండోసారి ఎమ్మెల్సీ ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిలకు హైదరాబాద్లోని వారి వారి నివాసంలో నాగర్ కర్నూల్ జిల్లా వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్, టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నకినమోని వెంకటయ్య యాదవ్, చంద్రాయన పల్లి ఎంపీటీసీ గోపిడి శ్రీనివాస్ రెడ్డి వారికి పుచ్ఛగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, కడారి మల్లయ్య, మల్లికార్జున్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: పటాన్ చెరువు మండలం ముత్తంగి బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. గురుకుల పాఠశాలలో నిన్న కరోనా కలకలం రేగిన విషయం తెలిసిందే. పాఠశాలలోని ఉపాధ్యాయురాలు పాటు 43 మందికి కరోనా పాజిటివ్ రావడంతో పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పాఠశాల సిబ్బందితో మాట్లాడారు. భయం భయం వద్దని, అందరికీ అండగా జిల్లా యంత్రాంగం […]