సామాజిక సారథి, ఆమనగల్లు: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని డీసీసీబీ డైరెక్టర్, పీఎసీఎస్ చైర్మన్ గంప వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 10 రోజుల్లో ఆమనగల్లు, కడ్తాల్ మండలాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మద్దతు ధర పొందాలన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అదేవిధంగా రైతులకు కావలసిన ఋణ సదుపాయాన్ని వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ […]
ఈనెల 31లోగా ఆధార్ అనుసంధానం దళిత బంధు ధరణిపై ప్రత్యేక శ్రద్ధ కలెక్టర్ శరత్ సామాజిక సారథి సంగారెడ్డి ప్రతినిధి: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించినట్లు సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయం నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రాలు, పోడు భూములు, ఆధార్ అనుసంధానం, ధరణి తదితర విషయాలపై ప్రత్యేక […]
ఐకేపీలో ఇప్పటికీ పేరుకుపోయిన ధాన్యం నిల్వలు మద్దతు ధర కోసం పడిగాపులు నిండా ముంచుతున్న మిల్లర్లు సామాజిక సారథి, హాలియా: ఈ ఖరీఫ్ సీజన్ కర్షకులకు కష్టాలనే మిగిల్చింది. వానకాలం పంటలు చేతికి వచ్చిన దగ్గరనుంచి రైతులు ఆ పంటను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. గతనెల నవంబర్ నుంచి వరికోతలు ప్రారంభించిన రైతులకు అడుగడుగునా అకాల వర్షాలు పలకరిస్తూ రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సాగర్ ఆయకట్టులో వరికోతలు ముమ్మరంగా సాగుతున్న సమయంలో వర్షాలు […]
సామాజిక సారథి ,కౌడిపల్లి: కౌడిపల్లి మండలం వెంకట్రావు పేట లోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో గోనె సంచులు చినిగిపోయి ఉండడంతో వరి ధాన్యం తూకం వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన గోనె సంచులలో రైతులు వెతుకుతూ సంచులను దొరికిన కాడికి తూకం వేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐకెపీ సిబ్బంది కొనుగోలు కేంద్రం వైపు కన్నెత్తి చూడకపోవడంతో రైతులు ఎవరికి చెప్పుకోవాలో తెలియకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు […]
– టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ సామాజిక సారథి, వరంగల్: యాసంగి వడ్లు కొనమని చెప్పిన సీఎం కేసీఆర్ రైతుల ఓట్లు కోసమస్తామరా అని టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశానికి తెలంగాణ సీడ్ బౌల్, కోటి ఎకరాల మాగాణి అంటూ చెప్పిన కేసీఆర్ మాటలు నేడు నీటి మూటలయ్యాని ఎద్దేవా చేశారు. అన్నదాతలను ఆదుకోలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే […]
సామాజిక సారథి ఎఫెక్ట్.. సామాజిక సారథి, చిలప్ చెడ్: మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంతారం ధాన్యం కొనుగోలు సెంటర్లో రైతులను దోపిడీ చేస్తున్న విధానంపై ఈనెల 26న ‘సామాజికసారథి’లో ‘వడ్ల తూకవేస్తున్నారు’ శీర్షికన కథనం వచ్చింది. నెలరోజులుగా రైతుల పడిగాపులు, సంచికి రూ.పది చొప్పున వసూలు చేస్తున్నారనే విషయాలు వెలుగుచూశాయి. దీనికి స్పందించిన ఐకేపీ అధికారులు లారీలను సక్రమంగా వచ్చేలా ఏర్పాట్లు చేశారు. రైతుల వడ్ల కుప్పలను సోమవారం సంచుల్లో […]
సామాజిక సారథి, వెల్దండ: మండలంలోని ఆయా గ్రామాల్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు తెలిపారు. శుక్రవారం సింగిల్విండో కార్యాలయంలో కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో డైరెక్టర్లతో కలిసి ప్రారంభించారు. మండలంలో ఐదువేల ఎకరాల్లో వరి సాగు చేశారని, సుమారు ఒక లక్ష 30 వేల బస్తాలు వరి ధాన్యం రావొచ్చని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. మండలంలో వెల్దండతో పాటు కొట్ర, రాచూరు, కుప్పగండ్ల, బొల్లంపల్లి, […]
సామాజిక సారథి డిండి: మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్లవెల్లి రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రాజెక్టు క్రింద రైతులు పండించిన వరిధాన్యం కొనుగోలు చేయాలన్నారు. అకాల వర్షాల నష్టాపోయిన పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని తహసీల్ధార్ కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ్యనాయక్, మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షుడు ముడావత్ లక్పతి నాయక్, దినేష్, మల్లేష్ నాయక్, సతీష్, సాయి, వల్లపు రమేష్, జంతుక వెంకటయ్య, ప్రసన్నకుమార్, వంకేశ్వరం, […]