సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి చేపట్టిన రాత పరీక్షలు తొలిరోజు విజయవంతంగా ముగిశాయిని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం కర్నూలు నగరంలోని విద్యానగర్ మాంటిస్సోరి హైస్కూలు, ఎన్ఆర్ పేట సెయింట్ జోసఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూలు ఎగ్జామ్ సెంటర్ను కలెక్టర్ జి.వీరపాండియన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 127 పరీక్ష కేంద్రాల్లో మొదటి రోజు ఉదయం జరిగిన పరీక్షకు 76.77 శాతం మంది హాజరయ్యారని తెలిపారు. ఈ పరీక్షకు […]
సినిమాల్లో క్యారెక్టర్ల కోసం హీరో హీరోయిన్లు ఫుల్లుగా మేకోవర్ అయిపోవడం ఎక్కువైపోయింది. ఇంకా లుక్ మార్చడం లేదేంటా అని ఎదురుచూస్తున్న అభిమానులకు కొత్త లుక్ షాకిచ్చాడు విశ్వక్సేన్. ‘ఫలక్ నుమా దాస్’ మూవీతో ప్రేక్షక అభిమానం సంపాదించుకున్న విశ్వక్ నేచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ లో ‘హిట్’ సినిమా లీడ్ రోల్ తో హిట్ దక్కించుకున్నాడు. ఆ కిక్ దిగకుండా వెంటనే విశ్వక్ నరేష్ కొప్పలి కొత్త దర్శకుడితో ‘పాగల్’ మూవీకి కమిట్మెంట్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని […]
సారథిన్యూస్ రామగుండం: ‘ప్రపంచం మొత్తం గాలించి చూసినా కేసీఆర్ లాంటి రాజకీయనేత మనకు కనిపించరు. ఆయన పనితీరు నెవ్వర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్! అన్నట్టుగా కొనసాగుతున్నది. తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా’ అంటూ రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందన పల్లి వద్ద జిల్లా గొర్రెల, మేకల మార్కెట్ కు భూమి పూజ చేశారు. అనంతరం గోదావరిఖనిలోని సమ్మక్క సారక్క గద్దెల సమీపంలో […]
సారథి న్యూస్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో తుంగతుర్తి నియోజకవర్గ నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకులతో ఆదివారం సమీక్ష సమావేశం ఏర్పాటుచేశారు. ముఖ్యఅతిథులుగా విద్యుత్శాఖ మంత్రి జి.జగదీశ్వర్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి కృషిచేయాలని కోరారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికీ అందేలా చూడాలని కోరారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా రైతు కమిటీ అధ్యక్షుడు కోఆర్డినేటర్ […]
సారథి న్యూస్, పెద్దపల్లి: రామగుండం సమీపంలోని గోదావరి నదిలో చేప పిల్లలను ఆదివారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్యాదవ్మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులకు పెద్దపీట వేస్తుందన్నారు. రామగుండంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, స్థానిక కోరుకంటి చందర్, మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు పాల్గొన్నారు.
గోదావరిఖని: కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులే కాక మత్స్యకారులు కూడా బాగుపడుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. గోదావరి దిశ మార్చిన అపరభగీరథుడు కేసీఆర్ అని కొనియాడారు. అదివారం ఆయన కుందనపల్లి, గోదావరినది వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అన్ని కులవృత్తులకు న్యాయం చేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: కుండపోత వర్షాలకు తెలంగాణ తడిసి ముద్దవుతోంది. భారీవర్షాలు, వరదలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. వాగులు వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. అయితే మరో రెండు మూడు రోజులపాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీఎం కె.చంద్రశేఖర్ రావుతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కుమార్ భేటీ అయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్, […]
సారథి న్యూస్, ఆసిఫాబాద్: తెలంగాణలోకి మావోయిస్టుల వచ్చారని, తమ కార్యకలాపాలు సాగించారని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ అడవుల్లో డీజీపీ మహేందర్రెడ్డి పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే తాజాగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కదంబా అడవుల్లో కాల్పుల మోత మోగింది. పోలీసులు, మావోయిస్టులు నేరుగా తలపడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు పోలీసులు తెలిపారు. ఆసిఫాబాద్ సమీపంలోని చీలేటిగూడకు రెండు రోజుల క్రితం మంచిర్యాల , కుమ్రంభీం జిల్లాల డివిజన్ కమిటీ కార్యదర్శి మైలారపు […]