సారథి న్యూస్, ఆసిఫాబాద్: తెలంగాణలోకి మావోయిస్టుల వచ్చారని, తమ కార్యకలాపాలు సాగించారని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ అడవుల్లో డీజీపీ మహేందర్రెడ్డి పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే తాజాగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కదంబా అడవుల్లో కాల్పుల మోత మోగింది. పోలీసులు, మావోయిస్టులు నేరుగా తలపడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు పోలీసులు తెలిపారు. ఆసిఫాబాద్ సమీపంలోని చీలేటిగూడకు రెండు రోజుల క్రితం మంచిర్యాల , కుమ్రంభీం జిల్లాల డివిజన్ కమిటీ కార్యదర్శి మైలారపు ఆడేళ్లు అలియాస్ భాస్కర్ వచ్చినట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ముమ్మరంగా గాలింపులు జరిపారు. అయితే భాస్కర్ పోలీసుల కంటపడకుండా తప్పించుకున్నట్టు సమాచారం. మరోవైపు ప్రస్తుతం పోలీసులు కడంబా అడవిని జల్లెడ పడుతున్నారు.