Breaking News

POLICE

తనూశ్రీ దత్తా హాట్​ కామెంట్స్​

సుశాంత్​ కేసు.. బాలీవుడ్​ బ్యూటీ ఫైర్​

ముంబై: సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య బాలీవుడ్​లో తీవ్ర దుమారం సృష్టిస్తున్నది. ఇప్పటికే బాలీవుడ్​లోని నెపోటిజంపై పలువురు సీనీ నటులు, ప్రముఖులు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్​ అందాల భామ తనూశ్రీ దత్తా సుశాంత్​ కేసుపై స్పందించారు. ముంబై పోలీసులు సుశాంత్​ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారేమోనని తనకు అనుమానంగా ఉన్నదని ఆమె పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించడమే ఉత్తమమని ఆమె వ్యాఖ్యానించారు. ముంబై పోలీసులను పూర్తిగా నమ్మలేమని ఆమె వ్యాఖ్యానించారు. వారు రాజకీయనాయకుల […]

Read More
86కు చేరిన మృతుల సంఖ్య

86కు చేరిన కల్తీ మద్యం మృతులు

చండీగఢ్: పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి మరణించిన వారిసంఖ్య 86కు చేరింది. ఇప్పటికే తరన్​ ‌తరన్‌ జిల్లాలో 19, అమృత్‌సర్‌లో 11, బాటాల జిల్లాలో 9 మంది చనిపోయారు. తాజాగా శనివారం తరన్​ ‌తరన్‌లో మరో 44 మంది, అమృత్‌సర్‌లో ఒకరు, బాటాల జిల్లాలో ఇద్దరు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 86కు చేరుకుంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 10 మందిని అరెస్ట్​చేశారు. ఏడుగురు ఎక్సైజ్‌ అధికారులు, ఆరుగురు పోలీసులను పంజాబ్​ ప్రభుత్వం సస్పెండ్​ చేసింది. […]

Read More
పోలీసులకు గురిపెట్టాడు

పోలీసులకే గురిపెట్టాడు

ఢిల్లీ: పోలీసుల మీదకు రివాల్వర్​ గురిపెట్టిన ఓ దోపిడీ దొంగను గురువారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని అండ్రూస్​ గంజ్​కు చెందిన ఓవ్యక్తి ప్రజలను బెదిరిస్తూ డబ్బు, నగలు దోపిడీ చేస్తున్నాడు. స్థానికులు ఫిర్యాదుతో సదరు నిందితుడిని అదుపులోకి తీసుకొనేందుకు పోలీసులు అక్కడికి వెళ్లారు. దీంతో ఆ క్రిమినల్​ ఓ పోలీస్​ను రివాల్వర్​తో కాల్చబోయాడు. అప్రమత్తమైన మరో కానిస్టేబుల్​ చాకచక్యంగా అతడిని వెనుకనుంచి పట్టుకొన్నాడు. అనంతరం అతడిని పోలీసులు రిమాండ్​కు తరలించారు.

Read More
శాంతియుతంగా బక్రీద్​

బక్రీద్​ శాంతియుతంగా జరుపుకోండి

సారథి న్యూస్, బెజ్జంకి: ముస్లిం సోదరులు బక్రీద్​ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని చేర్యాల సీఐ శ్రీనివాసరెడ్డి సూచించారు. బుధవారం ఆయన కరీంనగర్​ జిల్లా చేర్యాలలో ముస్లిం మత పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గోవులను అక్రమంగా రవాణాచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం ప్రత్యేకంగా చెక్​పోస్టులు ఏర్పాటుచేశామన్నారు. మత ఘర్షణలు ప్రేరేపించేలా ఎవరైనా సోషల్​మీడియాలో పోస్టులు పెడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో చేర్యాల ఎస్సై మోహన్ బాబు, చేర్యాల తాజుమ్ ప్రెసిడెంట్ అబ్దుల్ […]

Read More
సారు మీకిది న్యాయమా..?

సారు మీకిది న్యాయమా..?

సారథి న్యూస్​ : కొందరు పోలీసులు ప్రజలపట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న చిన్న తప్పులకే వారిపై దాడులకు దిగుతున్నారు. తాజాగా హెల్మెట్ ధరించలేదని ఓ యువకుడిపై తాళం చెవితో దాడి చేశారు పెట్రోలింగ్ పోలీసులు. యువకుడి నుదుటిపై తాళం చెవితో పోడిచారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రాపుర్‌ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన స్థానికులు పోలీసు స్టేషన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ చార్జీ చేశారు. ఈ ఘటనపై మండిపడ్డ జిల్లా పోలీసు […]

Read More
మహారాష్ట్రలో పోలీసులకు కరోనా

138 మంది పోలీసులకు కరోనా

ముంబై: మహారాష్ట్రలో గత 24 గంటల్లో 138 మంది పోలీసులకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో పోలీస్​శాఖలో 8,722 మందికి కరోనా సోకింది. ఇందులో 6,670 మంది పోలీసులు కోలుకోగా మరో 1,955 యాక్టివ్​ కేసులున్నాయి. ఇప్పటివరకు 97 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీస్​శాఖ అధికారులు చెప్పారు.

Read More

అనుమానమే పెనుభూతమై..

సారథి న్యూస్​, చిత్తూరు : చిత్తూరు జిల్లా వి కోట మండలం పాముగానిపల్లిలో అనుమానం పెనుభూతమై పచ్చని కాపురంలో చిచ్చు రగిలింది. తాగుడుకు బానిసైన భర్త ప్రభాకర్​ రెడ్డి (32)  భార్య రేణుక (22)పై అనుమానం పెంచుకుని సోమవారం ఉదయం భార్యభర్తలిద్దరూ గొడవ పడ్డారు. పాముగానిపల్లె సమీపంలోని పొలం వద్ద ఇరువురు ఘర్షణ పడి కోపంతో వెంట తెచ్చుకున్న కత్తితో భార్య మెడపై నరికాడు. ఆమె స్పాట్​లోనే చనిపోయింది. అనంతరం అతను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. […]

Read More
వీడోరకం దొంగ

వీడోరకం దొంగ

భోపాల్‌: దొంగల్లోను చాలా రకాలుంటారు. వాళ్ల అభిరుచులు కూడా భిన్నమే. తాజాగా మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో పోలీసులకు చిక్కిన ఓ దొంగ మాత్రం చాలా విచిత్రమైన దొంగ. ఈ దొంగ కేవలం బాలికలు, యువతుల లోదుస్తులను మాత్రమే కాజేస్తాడు. అనంతరం వాటిని చింపి పీలికలు చేసి పడేసి పైశాచిక ఆనందం పొందుతాడు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌లో లేడిస్​ హాస్టల్స్​, యువతులు అద్దెకుండే నివాసాల్లో కొంతకాలంగా రాత్రివేళల్లో లోదుస్తులు మాయం అవుతున్నాయి. దీంతో బాధిత మహిళలు విజయ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు […]

Read More