సామాజిక సారథి, నడికూడ : రాష్ర్ట ప్రభుత్వం పంట నష్టం జరిగితే రైతులను ఆదుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా నడికూడలో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరకాల మండలాల్లోని పలు గ్రామాలలో రైతులతో కలిసి దెబ్బతిన్న మిర్చి పంటలు మొక్కజొన్న పంటలను పరిశీలించారు. అనంతరం పరకాల మండలం మలక్కపేటలో రైతులను పరామర్శించి మాట్లాడారు. ప్రకృతి సృష్టించిన ఈ బీభత్సానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి రైతులను ఆదుకోవాలని, వెంటనే పంట […]
టీఆర్ఎస్ సర్కార్ కూలిపోవడం ఖాయం రైతు రవి కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందర్ రావు సామాజికసారథి, మెదక్: రాష్ట్రంలోని రైతుల ఉసురు తగిలి టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. జిల్లాలోని హవేళి ఘనపూర్ మండలం బోగడ భూపతిపూర్ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్రావు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్మాట్లాడుతూ.. రాష్ట్రంలో మోతబారి రైతునని చెప్పుకునే సీఎం కేసీఆర్ […]
సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం అధికార టీఆర్ఎస్కు ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టింది. సీఎం కె.చంద్రశేఖర్రావు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించారు. ట్రబుల్ షూటర్, మంత్రి టి.హరీశ్రావు దీన్ని ఒక సవాల్గా తీసుకుని పనిచేశారు. అయినా ఫలితం తారుమారు కావడంతో వారు కొంత నైరాశ్యానికి గురైనట్లు తెలిసింది. అందులోనూ 23వేల పైచిలుకు మెజారిటీతో ఈటల రాజేందర్ గెలవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఉపఎన్నిక ఫలితాలు వెలువడిన అనంతరం పార్టీకి […]
23,855వేల మెజారిటీ ఓట్లతో తిరుగులేని మెజార్టీ 7వ సారి ఎదురులేదని నిరూపించుకున్న ఈటల మరోసారి భారీమెజార్టీ కట్టబెట్టిన హుజూరాబాద్ ఓటర్లు ఉద్యమనేతగా అప్రతిహత విజయం ప్రజాభిమానం ముందు పారని తాయితాలు అధికార పార్టీకి కలిసిన రాని దళితబంధు ఆత్మాభిమానం ముందు తోకముడిచిన అహంకారం బీజేపీ కార్యాలయం వద్ద మిన్నంటిన సంబరాలు సీఎం కేసీఆర్పై ప్రజల్లో విశ్వాసం లేదన్న బండి సంజయ్ సామాజిక సారథి, హుజూరాబాద్: హుజూరాబాద్ లో రాజేంద్రుడే విజయేంద్రుడిగా నిలిచారు. ప్రజల అభిమానం ముందు డబ్బులు, […]
ప్రచారం చేయకుండానే ఓట్లు కారు గుర్తును పోలిన చపాతీ రోలర్ 11వ రౌండ్ ముగిసే సరికి 1015 ఓట్లు వార్తల్లోకెక్కిన ప్రజాఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ సామాజిక సారథి, హుజూరాబాద్: ప్రజాఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ హుజూరాబాద్ఎన్నికల నేపథ్యంలో హాట్ టాపిక్ గా నిలిచాడు. మూడేళ్లలో ఆరుఎన్నికల్లో పోటీచేసిన ఆయన ప్రచారం చేయకుండానే ఓట్లు సాధిస్తున్నారు. టీఆర్ఎస్ పాలిట ఇబ్బందికర అభ్యర్థిగా మారారు. కారు గుర్తును పోలిన ఏ గుర్తుతోనైతే టీఆర్ఎస్ దుబ్బాకలో ఓడిపోయిందో […]
సామాజిక సారథి, హుజూరాబాద్: రాష్ట్రమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 10వ రౌండ్లో బీజేపీ 506 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఈ రౌండ్ముగిసే సరికి 5,637 ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఉన్నారు. ఇప్పటివరకు 13 రౌండ్లు పూర్తయ్యాయి. 11వ రౌండ్లో బీజేపీ 3,941(48,588), టీఆర్ఎస్ 4,308 (43324) ఓట్లు సాధించింది. ఇక 13వ రౌండ్లో టీఆర్ఎస్ 2,971(49,945), బీజేపీ 4,836 (58,333 ) ఓట్లు సాధించింది. ఇప్పటివరకు బీజేపీ […]
సామాజిక సారథి, నల్లగొండ: హుజురాబాద్ ఫలితాలు ఉత్కంఠ లేపుతున్నాయి. రిజల్టుపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. ‘ఈటల రాజేందర్ 30వేల మెజార్టీతో గెలవబోతున్నాడు. హుజురాబాద్ ఉపఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ రూ.ఐదువేల కోట్లు ఖర్చు చేసింది. హుజురాబాద్ ఫలితాలు ఆ పార్టీకి చెంపపెట్టు. హుజురాబాద్ ప్రజలు అదిరిపోయే తీర్పు ఇవ్వబోతున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టలు ఈటల రాజేందర్ గెలుపును చూడకతప్పదు.’ అని వ్యాఖ్యానించారు.
సామాజిక సారథి, హుజూరాబాద్: రాష్ట్రమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. శనివారం ఉదయం 7 గంటలకు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందిరా నగర్ పోలింగ్ సెంటర్ ను కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్ పరిశీలించారు. బీజేపీ అభ్యర్థి, మాజీమంత్రి ఈటల రాజేందర్, జమున దంపతులు కమలాపూర్ 262 పోలింగ్ బూత్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. అనంతరం హుజురాబాద్ మండలం కందుగుల జడ్పీ హైస్కూలులో […]