ధాన్యం అమ్ముకోలేక నానాఇబ్బందులు డిండి ముంపు రైతులను ఆదుకోవాలి ‘ధరణి’లో తప్పులు ప్రభుత్వ వైఫల్యమే బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నల్లమలలో కొనసాగుతున్న బహుజన రాజ్యాధికార యాత్ర సామాజికసారథి, అచ్చంపేట/చారకొండ: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పురుగుమందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడంలేదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ధరణి పోర్టల్ లో భూమి తప్పుగా నమోదైందని, భువనగిరి కలెక్టరేట్ […]
సామాజికసారథి, హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది. పోటీచేసిన అన్ని చోట్లా ఘన విజయం సాధించింది. నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అన్ని చోట్లా గులాబీ జోరు కొనసాగించింది. ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. నల్లగొండలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి 691 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 1233 ఓట్లు పోలవగా… 1,183 […]
వైద్యారోగ్య రంగంలో రాష్ట్రం ముందంజ గాంధీ, ఉస్మానియా, నిలోఫర్లో పారిశుద్ధ్యం మెరుగు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు వెల్లడి సామాజిక సారథి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన 15 మందికి పాజిటివ్ రాగా.. అందరికీ ఒమిక్రాన్ నెగెటివ్ వచ్చిందని, వాక్సినేషన్పై ప్రజలకు మరింత అవగాహన పెంచేలా మీడియా వార్తాకథనాలు పెంచాలని సూచించారు. మొదటి డోస్ 97శాతం, రెండో […]
మిస్ యూనివర్స్గా పంజాబ్ సుందరి 21ఏళ్ల తర్వాత భారత యువతికి కిరీటం సుస్మితా సేన్, లారాదత్తా తర్వాత ఆమెకే న్యూఢిల్లీ: మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించిన 21 ఏళ్ల పంజాబ్ సుందరి హర్నాజ్ కౌర్ సంధు విజేతగా నిలిచారు. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్కు విశ్వసుందరి కిరీటం వరించింది. ఈ ఏడాది ‘లివా మిస్ దివా యూనివర్స్’ కిరీటాన్ని సొంతం చేసుకోవడంతో హర్నాజ్కు ‘మిస్ యూనివర్స్ 2021’లో భారత్ తరఫున […]
నాటి విధ్వంసం నుంచి ఆలయానికి ముక్తి ఆలయ పునర్నిర్మాణంతో కొత్త అందాలు రూ.399 కోట్లతో కారిడార్ పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోడీ గంగానదిలో పుణ్యస్నానం.. ప్రత్యేక జలంతో అభిషేకం వారణాసి: ప్రతిష్టాత్మక ‘కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు’తో నవచరిత్ర సృష్టించామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కాశీ విశ్వనాథ్ ప్రాజెక్టు కారిడార్ నిర్మాణంతో వృద్ధులు, దివ్యాంగులు సైతం జెట్టీలు, ఎస్కలేటర్లలో ప్రయాణించి ఆలయ దర్శనం చేసుకోవడానికి మార్గం సుగమమైందని పేర్కొన్నారు. కొవిడ్ మహ్మరి వెంటాడినా నిర్దేశిత సమయంలో ప్రాజెక్టు పూర్తి […]
భువనగిరి కలెక్టరేట్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం వారించిన సిబ్బంది సామాజికసారథి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం.. బుడిగే మహేశ్ తండ్రి ఉప్పలయ్య ఆలేరు మండలం కొలనుపాకలో 20ఏళ్ల క్రితం నాలుగు ఎకరాల భూమిని రూ.ఆరువేలకు కొన్నాడు. ఇప్పటి వరకు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వకపోవడంతో లోన్లు, ఇతర సౌకర్యాలు రావడం లేదు. దీంతో మహేశ్ మనస్తాపం చెందాడు. […]
ప్రజల ప్రాణాలు పోతుంటే ఏం సాధించారు తిరుగుబాటును అరికట్టడానికి వేరే విధానాలు ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల న్యూఢిల్లీ: ఈశాన్య భారతంలో సైన్యానికి ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(ఏఎఫ్ఎస్పీఏ) రద్దు చేయాలని ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల కోరారు. ఇదే అంశంపై ఆమె 16 ఏళ్ల పాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టారు. తాజాగా నాగాలాండ్లో సాధారణ పౌరులపై పోలీసుల కాల్పుల నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనతోనైనా […]
సామాజిక సారథి, హైదరాబాద్: దివ్యాంగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో దివ్యాంగుల సంక్షేమంపై అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. వికలాంగులు అనే పదాన్ని నిషేధించి దివ్యాంగులు అని గౌరవంగా పిలుస్తున్నామని, వారిలో ఆత్మగౌరవాన్ని మరింత పెంచుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో సుమారు ఐదులక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. ఇందుకు ఏటా రూ.1,800 కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు. మావేశంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వయో […]