పాల్గొన్న పార్టీ చీఫ్ జేపీ నడ్డా సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు ర్యాలీ బండి సంజయ్ అరెస్ట్ ను ఖండించిన నేతలు సామాజికసారథి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు బీజేపీ నాయకులు మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నడ్డాతో పాటు కేంద్రమంత్రి కిషన్ […]
సామాజిక సారథి, వెల్దండ: పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించకుండా రాష్ర్ట ప్రభుత్వం అనుసరిస్తున్న మొండివైఖరిగా నిరసనగా శుక్రవారం బీజేపీ దళితమోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్విగ్రహం ఎదుట హెచ్పీ పెట్రోల్బంక్వద్ద దళితమోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కుర్మిద్ద యాదగిరి, మండలాధ్యక్షుడు కొమ్ము వెంకటయ్య, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ధ్యాప వెంకట్ రెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు యెన్నం విజేందర్ రెడ్డి, జూలూరి బాలస్వామి, జిల్లెళ్ల జంగయ్య, సింగిల్ విండో డైరెక్టర్ […]
సారథి న్యూస్, రామగుండం: హథ్రాస్లో జరిగిన ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని దళితసంఘాలు డిమాండ్ చేశాయి. బీజేపీ ప్రభుత్వం అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తూ దళితులను దగా చేస్తున్నదని దళితసంఘాల నేతలు ఆరోపించారు. యూపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? మానవహక్కులు ఉన్నాయా? ప్రజాస్వామ్యదేశంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం నిస్సుగ్గుగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఆదివారం గోదావరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత సంఘాల యాక్షన్ కమిటీ […]
లక్నో: దళిత యువతిపై లైంగికదాడి, హత్యతో యూపీలో హత్రాస్ ప్రాంతం అట్టుడుకుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా పలు చోట్ల దళితసంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. అయితే గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు హత్రాస్ వెళ్లన కాంగ్రెస్ యువనేత రాహుల్, ప్రియాంకా గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ అరెస్ట్తో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.శాంతియుతంగా హత్రాస్ వెళ్తున్న తమపట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారని […]
సారథిన్యూస్, బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో ఉన్న ఎస్సీ గురుకుల పాఠశాలను వనపర్తి జిల్లాకు తరలించడం సరికాదని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్ నేతలు బిజినేపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ అంజిరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. దాదాపు 540 మంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపాల్ రెడ్డి, ఈశ్వర్, పాషా, బలమాసయ్య, మిద్దె సూరి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
సారథి న్యూస్, వరంగల్: కరోనాను అరికట్టడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని టీడీపీ వరంగల్ పార్లమెంట్ అధ్యక్షుడు చిటూరి అశోక్ ఆరోపించారు. కరోనాను అరికట్డడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం హన్మకొండలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. కరోనా టెస్టులు చేయకుండా రాష్ట్రప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు మాడగాని మనోహర్, కుసుమ శ్యాంసుందర్, మార్గం సారంగం, బర్ల యాకూబ్, గొల్లపల్లి ఈశ్వరాచారి, చిలువేరు […]
సారథి న్యూస్, హుస్నాబాద్: పెట్రోల్, డిజిల్ ధరలను వెంటనే డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ.. కరోనాతో ఉపాధిలేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పెట్రోల్, డిజిల్ ధరలు పెంచడం సరికాదన్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతుంటే పెట్రో ధరలు పెంచడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు సత్యనారాయణ, మాజీ మార్కెట్ […]
సారథి న్యూస్, హుస్నాబాద్: అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో ఆర్డీవో జయచంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. హుస్నాబాద్ మండలం గాంధీనగర్, తోటపల్లి ఊర చెరువుల నుంచి కొంతమంది రాత్రుళ్లు జేసీబీలతో తవ్వుతూ ట్రాక్టర్లతో మట్టి తరలిస్తు సొమ్ముచేసుకుంటున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వనేశ్, […]