గంగా రం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు హరీశ్వర్ రెడ్డి. బిజినే పల్లి , సామాజిక సారథి : అందరి సహాయ సహకారాలతోని గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుండ్లపల్లి హరీశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం బిజినాపల్లి మండలం గంగారం గ్రామ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తన తండ్రి కీర్తిశేషులు గుండ్లపల్లి వెంకటరెడ్డి స్మారకార్థం విద్యార్థులకు క్రీడ సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా హరీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు శారీరక మానసిక ఎదుగుదలకు చదువులు […]
సామాజిక సారథి, ఆర్కేపురం: (మహేశ్వరం): రాష్ట్ర ప్రభుత్వం అభివృద్దిని చూసి బీజేపీ ఓర్వట్లేదని మహేశ్వరం నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ అన్నారు. గురువారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనగా విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి, ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ తెలంగాణ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలను చూసి ఓర్వలేక బీజేపీ పార్టీ తెలంగాణపై కుట్ర చేస్తుందని […]
సారథిన్యూస్, రామడుగు/ గంగాధర: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో రూ. 15 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. కాగా గంగాధర మండలం కొండయ్యపల్లిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గురువు చెట్టుపల్లి కొండయ్య అనారోగ్యంతో మృతిచెందారు. వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కల్గెటి […]
సారథిన్యూస్, రామడుగు: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి చిరునామా అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు సోమవారం MLA సుంకే రవిశంకర్ శంకుస్థపాన చేశారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మైదానంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, సర్పంచ్ జీవన్, ఎంపీపీ కవిత నాయకులు జితేందర్ రెడ్డి, కర్ణాకర్, కల్గెటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం: టీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 41, 43వ డివిజన్ మిర్చి మార్కెట్ రోడ్ లో రూ.కోటితో నిర్మించిన డబుల్ రోడ్, సెంట్రల్ లైటింగ్ పనులను మేయర్ పాపాలాల్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, కార్పొరేటర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామాయంపేట: గడపగడపకు బీజేపీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్నది. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో శనివారం బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ సందేశాన్ని ఇంటింటికీ వెళ్లి అందించారు. ఈ కార్యక్రమంలో నెంటురి రమేశ్ గౌడ్, నాతి రమేశ్ గౌడ్, శ్రీకాంత్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.