Breaking News

Day: June 13, 2020

రికార్డు స్థాయిలో కరోనా కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో శనివారం 253 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. 24 గంటల్లో 8 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 182 మంది చనిపోయారు. జీహెచ్​ఎంసీ పరిధిలో 179 కేసులు, సంగారెడ్డి జిల్లా నుంచి 24 పాజిటివ్​ కేసులు, మేడ్చల్​ జిల్లా నుంచి 14 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 11, మహబూబ్​ నగర్​లో నాలుగు, వరంగల్​ రూరల్​ జిల్లాలో రెండు, వరంగల్​ అర్బన్​ జిల్లాలో రెండు, కరీంనగర్​ రెండు, నల్లగొండ రెండు, ములుగు రెండు, […]

Read More

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

సారథి న్యూస్​, హుస్నాబాద్: ప్రమాదవశాత్తు మృతిచెందిన ఓ వ్యక్తి కుటుంబానికి చౌటపల్లి గ్రామ​అభివృద్ధి కమిటీ రూ.5000 ఆర్థికసాయం అందించింది. కరీంనగర్​ జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన గుడిపాటి రాజయ్య హఠాత్తుగా మృతిచెందడంతో అతడి కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. దీంతో శనివారం సర్పంచ్ గద్దల రమేశ్ బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పోశెట్టి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఐలయ్య, వెంకటయ్య, మల్లేశం, రమేష్, త్రిమూర్తి, శంకర్, సురేందర్, రాజ్ కుమార్, బాలయ్య, […]

Read More

తెలంగాణలో బంగారం పండిచొచ్చు

సారథి న్యూస్​, సూర్యాపేట: తెలంగాణ భూముల్లో బంగారు పండుతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ప్రపంచ దేశాలకు కావలసిన ఆహార ఉత్పత్తులను పండించగల సామర్థ్యం ఇక్కడి భూములకు ఉందన్నారు. ఇక మిగిలింది పంటకు గిట్టుబాటు ధర కల్పించడమేనని ఆయన​న్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో రుణమేళా సదస్సులో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్​ రూపొందించిన నియంత్రిత సాగులో రైతులను సంఘటితం చేయడమేనని అన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్. […]

Read More
పోలీసులు స్వాధీనం చేసుకున్న రేషన్​ బియ్యం

రేషన్​ బియ్యం పట్టివేత

సారథి న్యూస్​, హుస్నాబాద్: పేదల కోసం పంపిణీ చేయాల్సిన 10 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని అక్రమంగా నిలువ ఉంచుకున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక ఎల్లమ్మ బజార్ కాలనీలో గౌరిశెట్టి నర్సయ్య అనే వ్యక్తి తన ఇంట్లో రేషన్​బియ్యం నిలువచేశాడు. సమాచారమందుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులతో కలిసి నర్సయ్య ఇంట్లో తనిఖీ చేసి బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై […]

Read More
BJP

మోదీ పాలన ఆదర్శనీయం

సారథి న్యూస్, రామడుగు: రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని పంది కుంట గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల సందేశాత్మకలేఖను బీజేపీ నేతలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మోదీ పాలన దేశం ఎంతో పురోభివృద్ధి చెందిందని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పురం శెట్టి చంద్రమౌళి కార్య కర్తలు పాల్గొన్నారు.

Read More
జలదీక్షలో పాల్గొన్న కాంగ్రెస్​ నేతలను అరెస్ట్​ చేస్తున్న పోలీసులు

కమీషన్ల కోసమే ప్రాజెక్టులు

సారథి న్యూస్​, హుస్నాబాద్ : టీఆర్​ఎస్​ ప్రభుత్వం కమీషన్ల కోసమే సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్​ పేర్కొన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జలదీక్షలో భాగంగా సిద్దిపేట్ జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంపత్​కుమార్​ మాట్లాడుతూ.. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల భూమిపూజ […]

Read More

మహారాష్ట్రలో వారికే కరోనా

ముంబై: మన దేశంలోనే అత్యధిక కేసుల నమోదైన మహారాష్ట్రలో కరోనా బారినపడిన వారు ఎక్కువగా 31 – 40 ఏళ్ల మధ్య వయసు వారేనని ప్రభుత్వం రిలీజ్‌ చేసిన డేటా ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 1,01,141 కేసులు నమోదు కాగా.. వారిలో 97,407 మందిపై స్టడీ చేసింది. వారిలో 19,523 (20.04%) మంది 31 – 40 ఏళ్ల మధ్య వయసు వారే అని, వాళ్లంతా శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారే అని చెప్పింది. […]

Read More

చైనాలో మళ్లీ కరోనా

బీజింగ్‌: చైనాలో కరోనా మరోసారి వ్యాప్తి చెందుతోంది. 24 గంటల్లో 18 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఆరు కేసులు బీజింగ్‌లో నమోదయ్యాయి. అన్ని కేసులు జిన్​ఫాడీ మీట్‌ మార్కెట్‌లో ఈ కేసులు నమోదయ్యాయి. బీజింగ్‌లో ఇదే అతిపెద్ద హోల్‌సేల్‌ మార్కెట్‌ కావడంతో అధికారులు బీజింగ్‌లోని చాలా చోట్ల లాక్‌డౌన్‌ విధించారు. ఈ మార్కెట్‌లో మొత్తం ఏడు కేసుల నమోదు కాగా.. శనివారం ఒక్కరోజే ఆరు కేసులు నమోదయ్యాయి. సీఫుడ్‌ ప్రాడెక్ట్స్‌, మీట్‌ ప్రోడక్ట్స్‌పై పర్యవేక్షణ మొదలు పెట్టామని […]

Read More