సారథి న్యూస్, శ్రీకాకుళం: ఇంటింటి ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలని శ్రీకాకుళం మున్సిపల్ అర్బన్ ప్రత్యేక అధికారి టీవీఎస్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన నగరంలోని బాకర్ సాహెబ్ పేట, పుణ్యపు వీధి రైతు బజార్,.. సచివాలయ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది నుంచి ఫీవర్ సర్వే రిపోర్టులు అడిగి తెలుసుకున్నారు. సర్వే చేసేటప్పుడు ఏ ఇంటిని మర్చిపోవద్దని సూచించారు.
సారథిన్యూస్, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జలకళ పథకం పేదరైతులకు వరం లాంటిదని సీఎం వైస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో 2 లక్షల వ్యవసాయ బోర్లు వేస్తున్నట్టు చెప్పారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చే నాలుగు సంవత్సరాలలో రూ.2,340 కోట్లతో 2 లక్షల బోర్లు ఉచితంగా వేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ పథకం కోసం […]
సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టిపెట్టింది. పేద రైతులను ఆదుకునేందుకు వీలుగా ‘వైఎస్సార్ జలకళ’ పథకాన్ని సెప్టెంబర్ 28న ప్రారంభించనుంది. చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం ద్వారా ఫ్రీగా బోర్లు తవ్వించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ నిధులుతో ఒక్కో రిగ్ వేయనుంది. ఐదెకరాల ఎకరాల పొలం ఉన్న చిన్న, సన్నకారు ఈ పథకానికి అర్హులు. తమ భూముల్లో ఓపెన్ వెల్, బోర్ వెల్, […]
ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి క్షేత్రంలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కొడాలి నాని ప్రకటించడం.. దాన్ని బీజేపీ, టీడీపీ, వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చేందుకు బుధవారం తిరుమలకు చేరుకున్నారు. దీంతో తిరుపతిలో టీడీపీ, బీజేపీ, హిందూసంఘాలు తిరుపతిలో మోహరించాయి. ఓ వైపున పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. ఇప్పటికే పలువురు నేతలను అరెస్ట్ చేశారు. […]
సారథి న్యూస్, కర్నూలు: ‘ఏపీ పోలీస్సేవ మొబైల్యాప్’ను సోమవారం తాడేపల్లి క్యాంపు ఆఫీసు నుంచి సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. టెక్నాలజీని ఉపయోగించుకుని పోలీసులంటే సేవకులని, పోలీసులంటే భయపడాల్సిన పనిలేదన్నారు. రాష్ట్రంలో పోలీసులను కుటుంబసభ్యులుగా భావించి మనం పోలీసులను ఆశ్రయించవచ్చన్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచే కార్యక్రమం దిశగా ‘ఏపీ పోలీసు సేవ మొబైల్ యాప్’ ఉపయోగపడుతుందన్నారు. కర్నూలు నుంచి […]
సారథిన్యూస్ రామగుండం: ‘ప్రపంచం మొత్తం గాలించి చూసినా కేసీఆర్ లాంటి రాజకీయనేత మనకు కనిపించరు. ఆయన పనితీరు నెవ్వర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్! అన్నట్టుగా కొనసాగుతున్నది. తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా’ అంటూ రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందన పల్లి వద్ద జిల్లా గొర్రెల, మేకల మార్కెట్ కు భూమి పూజ చేశారు. అనంతరం గోదావరిఖనిలోని సమ్మక్క సారక్క గద్దెల సమీపంలో […]
సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘వైఎస్సార్ చేయూత’ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.18,750 ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే గురువారం పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు అర్బన్ 19వ వార్డ్, పోర్త్క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో ‘వైఎస్సార్ చేయూత’ ద్వారా వచ్చిన డబ్బుతో ఏర్పాటు చేసుకున్న కిరాణ షాపును నగరపాలక సంస్థ కమిషనర్ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, డీకే బాలాజీ ప్రారంభించారు. మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు వైఎస్సార్చేయూత పథకాన్ని […]
సారథి న్యూస్, కర్నూలు: ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు జరిగే గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్షలు రాసేందుకు జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్ ఆరు క్లస్టర్ పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వివరించారు. కర్నూలు జిల్లాలో మొత్తం 19 రకాల సచివాలయ ఉద్యోగ పరీక్షలకు 1,276 పోస్టులకు గాను […]