టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం చిత్తూరు: కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రభుత్వ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. ఇటీవల కాలంలో కరోనాతో బాధపడుతున్నవారు ఆక్సిజన్ లేక తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో కుప్పం నియోజకవర్గానికి ఆక్సిజన్ కొరత ఉండకూడదని భవిష్యత్ కార్యాచరణతో ఈ ప్లాంట్ ను ప్రారంభించినట్లు తెలిపారు. పలమనేరు మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి, కుప్పం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో […]
చెన్నై: ప్రముఖగాయకుడు, గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉన్నదని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తాజాగా హెల్త్బులెటిన్ను విడుదల చేశాయి. దీంతో ప్రస్తుతం ఎంజీఎం వద్ద తీవ్ర ఉద్విగ్న వాతావరణం నెలకొని ఉన్నది. గురువారం సాయంత్రం నుంచి ఎస్పీ బాలూ ఆరోగ్యం తీవ్రంగా విషమించిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తెలుగు ప్రజలు, బాలూ అభిమానులు తీవ్ర ఆందోళనగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎంజీఎం దవాఖాన పరిసరాలు మాత్రం కోలాహలంగా మారాయి. ఎంజీఎంకు వెళ్లే దారులన్నీ బాలూ […]
ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి క్షేత్రంలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కొడాలి నాని ప్రకటించడం.. దాన్ని బీజేపీ, టీడీపీ, వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చేందుకు బుధవారం తిరుమలకు చేరుకున్నారు. దీంతో తిరుపతిలో టీడీపీ, బీజేపీ, హిందూసంఘాలు తిరుపతిలో మోహరించాయి. ఓ వైపున పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. ఇప్పటికే పలువురు నేతలను అరెస్ట్ చేశారు. […]
అమరావతి: వరుస ఎదురుదెబ్బలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చంద్రబాబు, యువనేత లోకేశ్ మీద నమ్మకం లేక పలువురు కీలకనేతలు ఆ పార్టీని వీడుతున్నారు. మరికొందరు పార్టీలోనే ఉన్నా అధికారిక కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. ఈ క్రమంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సీఎం జగన్మోహన్రెడ్డి రమేష్బాబుకు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ […]
విజయవాడ: పది మందికి చావుకు కారకుడైన రమేశ్ ఆస్పత్రి యజమాని, పోతినేని రమేశ్బాబు ఏ బొక్కలో దాక్కున్నా ఏపీ పోలీసులు వదిలిపెట్టరని.. ఆయనను అరెస్ట్ చేసి తీరుతారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో దాక్కొని కుట్రలు పన్నుతున్నారని.. దమ్ముంటే ఆంధ్రప్రదేశ్కు రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు, పచ్చమీడియా కుట్రలను తిప్పికొడతామన్నారు. పరిహారం విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి .. అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. […]
సారథిన్యూస్, హైదరాబాద్: కృష్ణా నదిపై చేపట్టనున్న ప్రాజెక్టులపై కొంతకాలంగా ఏపీ, తెలంగాణ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఆపాలని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేస్తున్నది. ఈ విషయంపై సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేసింది టీ సర్కారు. అయితే శ్రీశైలం ఎడమగట్టు వద్ద తెలంగాణ జలవిద్యుత్ ఉత్పత్తి చేయడంపై ఏపీ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కాగా ఈ వివాదంపై తాజాగా కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకున్నది. అపెక్స్ కౌన్సిల్ […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మండలి రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ శాసనమండలిలో టీడీపీకి మెజార్జీ ఉండడంతో ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను మండలి అడ్డకుంటున్నది. దీంతో తీవ్ర అసహనానికి లోనైన సీఎం జగన్ ఏకంగా మండలినే రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. మండలి రద్దు అంశం ఇప్పుడు కేంద్రం చేతుల్లో ఉంది. ఇదే సమయంలో మండలిని రద్దు చేయాలని అసెంబ్లీ చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా దాఖలైన […]
అమరావతి: కేంద్రప్రభుత్వం తాజా నిర్ణయంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంలో తమకు ఎటువంటి సంబంధం లేదని కేంద్రప్రభుత్వం హైకోర్టుకు తేల్చిచెప్పింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని భావించిన టీడీపీకి ప్రస్తుత బీజేపీ నిర్ణయంతో ఆశలు అడుగంటాయి. రాజధాని ఏర్పాటు కేంద్రం పరిధిలోని అంశమని పీవీ కృష్ణయ్య అనే వ్యక్తి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన […]