ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స తీసుకుంటున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆస్పత్రిలో చేరినట్టు కుటుంబసభ్యలు తెలిపారు. ఎయిమ్స్ డైరెక్టర్ రన్దీప్ గులేరియా పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవలే ఆయన కరోనా నుంచి బయట పడిన విషయం తెలిసిందే. ఈ నెల 14న అమిత్షాకు కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో యధాప్రకారం తన కార్యకలాపాలను కొనసాగించారు. అయితే ఆయనకు మరోసారి స్వల్ప జ్వరం, […]
గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మౌలిక సదుపాయాలు వ్యవసాయంలో సార్ట్ అప్స్ కు మంచి అవకాశాలు రైతులకు వరాలు ప్రకటించిన ప్రధాని నరేంద్రమోడీ న్యూఢిల్లీ: రైతులకు మౌలిక సదుపాయలు కల్పించేందుకు రూ.లక్ష కోట్ల వ్యయంతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి(అగ్రి-ఇన్ఫ్రా ఫండ్)ని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. వ్యవసాయంలో ప్రధానమైన నాగలిని ఆయుధంగా కలిగి ఉండే బలరాముడి జయంతి సందర్భంగా ఆదివారం ఈ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పంట ఉత్పత్తి […]
తిరువనంతపురం: దుబాయ్ నుంచి కేరళ రాష్ట్రంలోని కోజికోడ్కు వస్తున్న ఓ ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. విమానం లోయలోపడి రెండు ముక్కలు కావడంతో పైలట్, ఐదుగురు సిబ్బందితో పాటు మరో 19 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఎయిర్ ఇండియాకు చెందిన డీఎక్స్ బీసీసీజే బోయింగ్ 737 విమానం రన్వే పై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 123 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో 15 మంది […]
న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారిన రాజకీయ ప్రముఖులు పడుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అమిత్ షా తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.
న్యూఢిల్లీ: నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వైద్యులు, ఇతర సిబ్బందికి విషెష్ చెప్పారు. కరోనాపై చేస్తున్న పోరాటంలో డాక్టర్లదే కీలక పాత్ర అని ఆయన కొనియాడారు. వారి జీవితాల్ని పణంగాపెట్టి మనల్ని కాపాడుతున్నారని చెప్పారు. ‘తల్లి బిడ్డకు జన్మనిస్తే..అదే బిడ్డకు వైద్యులు పునర్జన్మని ఇస్తారు” అని అన్నారు. అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్డే పురస్కరించుకుని దేశంలోని సీఏలందరికి మోడీ విషెస్ చెప్పారు. దేశ ఉజ్వల ఆర్థిక భవిష్యత్తు సీఏల చేతిలోనే ఉందంటూ వారి బాధ్యతను […]
న్యూఢిల్లీ: ఇండియా – చైనా బార్డర్లో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి కేంద్ర హోం మంత్రి అమిత్ షా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఓ జవాన్ తండ్రి రాహుల్ గాంధీకి సూచనలు చేస్తున్న వీడియోను ట్వీట్ చేసి రాహుల్కు సమాధానం చెప్పారు. ‘ధైర్యవంతుడైన ఆర్మీ జవాన్ తండ్రి రాహుల్కు క్లియర్ మేసేజ్ ఇస్తున్నారు. దేశమంతా ఒకటైన వేళ రాహుల్ గాంధీ కూడా చిల్లర రాజకీయాలు పక్కనపెట్టి దేశానికి రక్షణగా నిలవాలి’అని […]
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం భేటీ అయ్యారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఢిల్లీలో కరోనా వ్యాప్తి కోసం కేంద్రం ఢిల్లీ ప్రభుత్వానికి అన్ని విధాలా సాయపడుతుందని అమిత్ షా అన్నారు. ఈ మేరకు బెడ్ల కొరతను అదిగమిచేందుకు 500 రైల్వేకోచ్లను […]
న్యూఢిల్లీ : మన దేశంలో రాజకీయ హింసను ప్రమోట్ చేసే ఏకైక రాష్ట్రం పశ్చిమబెంగాల్ అని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. మంగళవారం పశ్చిమబెంగాల్లో వర్చువల్గా నిర్వహించిన ‘బంగ్లార్ జనసంబేశ్’ ర్యాలీలో పాల్గొన్న ఆయన దీదీపై విమర్శలు చేశారు. లోక్సభ ఎలక్షన్స్లో 303 స్థానాలు గెలిచిన దానికంటే.. బెంగాల్లో 18 సీట్లు గెలవడం చాలా గొప్ప అని అమిత్ షా అన్నారు. పొలిటికల్ గొడవల్లో 2014 నుంచి ఇప్పటి వరకు 100 మంది బీజేపీ వర్కర్లు ప్రాణాలు […]