న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి కరోనా సోకి మరణించారు. లక్షణాలేమీ లేకున్నా (అసింప్టమేటిక్) కరోనాతో రెండువారాల క్రితం ఢిల్లీలోని ఏయిమ్స్లో చేరిన ఆయన.. బుధవారం తుదిశ్వాస విడిచారు. చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ఆయనకు శ్వాసకోస ఇబ్బందులు తలెత్తడంతో ఆరోగ్యం క్షీణించింది. కోవిడ్ వల్ల మరణించిన తొలి కేంద్ర మంత్రి ఆయనే. కర్నాటకకు చెందిన సురేశ్ అంగడి.. బెల్గావి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004 నుంచి వరుసగా నాలుగుసార్లు […]
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు మరో పవర్ఫుల్ వ్యాక్సిన్ రాబోతున్నది. ప్రస్తుతం చివరి అంటే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసుకున్న ఈ వ్యాక్సిన్ ఈ ఏడాది చివరినాటికే అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. ఈ వ్యాక్సిన్ను ప్రముఖ సంస్థ జాన్సన్ & జాన్సన్ తయారు చేస్తున్నది. అయితే ఈ వ్యాక్సిన్ కేవలం ఒక్కడోసు వేసుకుంటే సరిపోతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే అభివృద్ధి చేస్తున్న చాలా వ్యాక్సిన్లు రెండు డోసుల వేసుకోవాల్సి ఉన్నది. అయితే జాన్సన్ […]
తెలుగులో పలుచిత్రాల్లో హాస్యం పండించిన నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కోసురు వేణుగోపాల్.. మర్యాద రామన్న, విక్రమార్కుడు, భలేభలే మగాడివోయి వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఆయనకు కరోనా సోకడంతో గచ్చిబౌలిలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించి బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్ ఎఫ్సీఐలో మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. సినిమాల మీద ఆసక్తితో ఉద్యోగం చేస్తున్నప్పుడే సినిమాల్లో నటించేవారు. వేణుగోపాల్ […]
సారథి న్యూస్, కర్నూలు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై విజయం సాధించేందుకు అహర్నిశలు కృషిచేసిన వైద్యులు, స్టాఫ్నర్సు, సిబ్బందిని కోవిడ్ వారియర్స్గా అభివర్ణించడానికి సంతోషిస్తున్నానని కర్నూలు మెడికల్కాలేజీ ప్రిన్సిపల్, ఏడీఎంఈ డాక్టర్చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం అధ్యాపకులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ నివారణకు మెరుగైన వైద్యసేవలు అందించారని, అందుకే పాజిటివ్ వచ్చిన వ్యక్తులు త్వరగా కోలుకుని ఇంటికి వెళ్తున్నారని అన్నారు. కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో మరింత మెరుగైన […]
సారథిన్యూస్, హైదరాబాద్: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కార్యాలయంలో కరోనా కేసులు రావడం ఆందోళన కలిగిస్తున్నది. ఈటలకు చెందిన 7 గురు వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో మంత్రి ఈటల కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నట్టు సమాచారం. మంత్రికి చెందిన ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు పీఏలు, ముగ్గురు గన్మెన్లకు ప్రస్తుతం కరోనా సోకింది. వారంతా హోమ్ ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు […]
సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రంలో శుక్రవారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మీటింగ్ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కరోనా వ్యాధి నివారణకు ఇక్కడి వైద్యారోగ్య కేంద్రంలో మంచి వైద్యసేవలు అందుతున్నాయని సంతోషం వ్యక్తంచేశారు. ఆస్పత్రిలో ప్రసవాలు చేయించుకునేలా ప్రోత్సహించాలని కోరారు. చిన్నపిల్లల వైద్యుల సేవలను వినియోగించుకోవాలని కోరారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సాయినాథ్, స్థానిక డాక్టర్ రాజేష్ గౌడ్ ఆస్పత్రిలోని సమస్యలను నేరుగా చూపించారు. […]
సారథి న్యూస్, కర్నూలు: కరోనా బారినపడి చనిపోయిన వారిని అంబులెన్స్లో తరలించేందుకు వీలుగా సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో కర్నూలు నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ టోల్ఫ్రీ నంబర్ను శుక్రవారం ప్రారంభించారు. ఎవరైన చనిపోతే తరలించేందుకు 9440879791 నంబర్కు ఫోన్ చేసి ఉచిత సహాయం పొందవచ్చని కోరారు. ఇన్చార్జ్ మెహబూబ్ అందుబాటులో ఉంటారని ప్రకటించారు.
సారథి న్యూస్, కర్నూలు: ఎక్కడో పుట్టిన మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వయస్సుకు సంబంధం లేకుండా.. అందరిలోనూ భయం నింపింది. మనసారా ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడేలా చేసింది. కానీ ఇదంతా ‘కళంకం’ వల్లే చోటుచేసుకుందని, దాన్ని జయిస్తే.. కరోనాను అంతం చేయడం సాధ్యమవుతుందని అపోలో హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ జావెద్ సయ్యద్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఒక కుటుంబంలో ఒకరు కరోనా పాజిటివ్తో మృతి చెందితే.. మిగిలిన వారు డిప్రెషన్కు గురై గోదావరి నదిలోకి దూకి […]