Breaking News

బిజినేపల్లి

బిజినేపల్లిలో విషపు రెడ్డి

బిజినేపల్లిలో విషపు రెడ్డి!

సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలానికి చెందిన ఓ కాంగ్రెస్ లీడర్ నిర్వాకం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడినంటూ ఆ లీడర్ చేస్తున్న అరాచకాలు అన్నీఇన్ని కావు. అధికార పార్టీ లీడర్ నంటూ బిజినేపల్లి మండలంలో ఏకంగా మూడు గ్రామాలపై పెత్తనం చెలాయిస్తుండటంపై స్థానిక కాంగ్రెస్ నాయకులు గుర్రుగా ఉన్నారు. ఆరంభంలోనే ఆ లీడర్ గలీజ్ దందాలకు అడ్డుకట్ట వేయకపోతే మూడు గ్రామాల కార్యకర్తలు, నాయకులు […]

Read More
ద్యావుడా.... ఏకంగా రూ.21.47 కోట్ల కరెంట్​ బిల్లు!

ద్యావుడా…. ఏకంగా రూ.21.47 కోట్ల కరెంట్​ బిల్లు!

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: అధికారుల తప్పిదాలు కొన్నిసార్లు సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. విద్యుత్​ శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా అచ్చంగా ఇలాంటిదే మరి. వివరాల్లోకెళ్తే.. ఓ ఇంటిలో సాధారణంగా నాలుగు లైట్లు. ఓ మూడు ఫ్యాన్లు, మొబైల్​ ఛార్జర్స్​.. ఎలక్ట్రికల్​ ఇస్త్రీ పెట్టే, కూలర్​, లేదంటే ఏసీ ఉంటుంది. వంటింట్లో కరెంట్​ హీటర్​, మిక్సింగ్​ గ్రౌండర్​ వాడుతుండటం మనందరికీ తెలిసిందే. అయితే వీటన్నింటికీ కలిపి ఎంత లేదన్నా రూ. వెయ్యి నుంచి రూ.2వేలకు కరెంట్​ బిల్లు దాటదు. […]

Read More
బీఈడీ ఫస్ట్ ర్యాంకర్ మనోడే

బీఈడీ ఫస్ట్ ర్యాంకర్ మనోడే

సామాజికసారథి, నాగర్ కర్నూల్: సాధారణ రైతు కుటుంబంలో పుట్టినబిడ్డ రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించాడు. మంగళవారం విడుదలైన బీఈడీ(టీజీ ఎడ్ సెట్) ఎంట్రెన్స్ లో నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన యువకుడు ఎం.నవీన్ కుమార్ స్టేట్ 1 ర్యాంక్ సాధించాడు. బీఈడీ ఎంట్రెన్స్​ (హాల్ టికెట్ నం.2415307073) 150 మార్కులకు 118 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన వెంకటస్వామి, విజయమ్మకు […]

Read More
వట్టెంలో త్రిపుర గవర్నర్ పూజలు

వట్టెంలో త్రిపుర గవర్నర్ పూజలు

సామాజికసారథి, బిజినేపల్లి: త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి మంగళవారం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వారికి మాజీఎంపీ పి.రాములు, సీనియర్ నాయకులు బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, జనుంపల్లి రాంచంద్రారెడ్డి, సేవికాసమితి విభాగ్ కార్యవాహిక బి.దేదీప్యశ్రీ, బుసిరెడ్డి శకుంతల, నాగర్ కర్నూల్ నియోజకవర్గం రెడ్డి సేవాసమితి అధ్యక్షుడు ద్యాసాని లింగారెడ్డి, క్యాడెట్ బి.సాయిసుధాంశురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More
ప్రాణం తీసిన వివాహేతర బంధం

ప్రాణం తీసిన వివాహేతర బంధం

సామాజికసారథి, బిజినేపల్లి: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్నాయి. పిల్లలు, ఫ్యామిలీ సంబంధాలను రోడ్డు పాలు చేస్తున్నాయి. ఈ అక్రమబంధానికి మరో వివాహిత బలైపోయింది. ఈ బంధంలో చిక్కుకున్న ఓ యువతి దారుణ హత్యకు గురైంది. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో వెలుగుచూసింది. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు.. వట్టెం పరిధిలోని కల్వకుంటతండాకు చెందిన గిరిజన యువతి చిట్టెమ్మ(28) తన భర్తతో విడాకులు తీసుకుంది. అనంతరం […]

Read More
విద్యార్థులను జామకాయలకు గుట్టల్లోకి పంపిన టీచర్​!

విద్యార్థులను జామకాయలకు గుట్టల్లోకి పంపిన టీచర్​!

సామాజికసారథి, బిజినేపల్లి: కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నా అందుకు క్షేత్రస్థాయిలో మాత్రం పర్యవేక్షణ లేదు. నాగర్ జిల్లాలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం, మొక్కుబడి పర్యవేక్షణతో సర్కారు స్కూళ్లలో కొందరు టీచర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, శుక్రవారం బిజినేపల్లి మండల పరిషత్​ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఓ టీచర్​ జామకాయలకు పంపించిన ఉదంతమే ఇందుకు ఉదాహరణ. విద్యార్థుల తల్లిదండ్రుల కథనం.. స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న […]

Read More
YSR సన్నిహితుడు కె.వెంకట్రామిరెడ్డి కన్నుమూత

YSR సన్నిహితుడు కె.వెంకట్రామిరెడ్డి కన్నుమూత

సామాజికసారథి, నాగర్​ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లికి చెందిన బ్లాక్​ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సీనియర్​ నేత కె.వెంకట్రామిరెడ్డి(82) శనివారం అర్ధరాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దివంగత వెంకట్రామిరెడ్డికి భార్య భాగ్యమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు. సతీమణి గతంలో జెడ్పీటీసీగా పనిచేశారు. కుమారులు వేర్వేరు రంగాల్లో స్థిరపడ్డారు. కాగా, కె.వెంకట్రామిరెడ్డి ఈ ప్రాంత […]

Read More
దళిత ప్రజాప్రతినిధులంటే చులకన!

దళిత ప్రజాప్రతినిధులంటే చులకన!

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామంలో కొందరు అగ్రవర్ణాల నాయకులకు దళిత ప్రజాప్రతినిధులంటే లెక్కలేకుండా పోయింది. గ్రామపంచాయతీ పరిధిలో ఏ చిన్న ఇష్యూ జరిగినా కొందరు అగ్రకుల లీడర్లు ఫొటోలు తీసి ప్రజాప్రతినిధులను అవమానపరిచేలా బూతుపదాలతో కామెంట్లు చేస్తున్నారు. వాటికి ఆ గ్రూపులోని అదే సామాజికవర్గానికి చెందిన మరికొందరు సపోర్ట్ చేస్తూ లైక్ లు , కామెంట్లు చేస్తూ అగ్నికిఆజ్యం పోస్తున్నారు. వెలుగొండ గ్రామపంచాయతీలో ఉన్న పలువురు దళితప్రజాప్రతినిధులపై […]

Read More