సామాజికసారథి, నాగర్ కర్నూల్: అధికారుల తప్పిదాలు కొన్నిసార్లు సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా అచ్చంగా ఇలాంటిదే మరి. వివరాల్లోకెళ్తే.. ఓ ఇంటిలో సాధారణంగా నాలుగు లైట్లు. ఓ మూడు ఫ్యాన్లు, మొబైల్ ఛార్జర్స్.. ఎలక్ట్రికల్ ఇస్త్రీ పెట్టే, కూలర్, లేదంటే ఏసీ ఉంటుంది. వంటింట్లో కరెంట్ హీటర్, మిక్సింగ్ గ్రౌండర్ వాడుతుండటం మనందరికీ తెలిసిందే. అయితే వీటన్నింటికీ కలిపి ఎంత లేదన్నా రూ. వెయ్యి నుంచి రూ.2వేలకు కరెంట్ బిల్లు దాటదు. మహా అయితే ఓ రూ.4వేలో.. రూ.5వేలో వస్తుంటుంది. కానీ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో నవీన్ రెడ్డి(గీతారెడ్డి) అనే వ్యక్తి ఇంటికి ఏకంగా అక్షరాల రూ.21 కోట్లా 47 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. విద్యుత్ సిబ్బంది వచ్చి బిల్లు కాగితం కొట్టి చేతికి ఇవ్వగానే ఆయన నివ్వెరపోయాడు. కొద్దిసేపు ఆయనకు నోటివెంట మాట రాలేదు. ఇదేమిటని పరేషాన్ అయ్యాడు. విద్యుత్ శాఖ అధికారుల తప్పిదం కారణంగా ఇలా జరిగిందని గుర్తించాడు. వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. బిల్లు కట్టాలని చెబుతారా..? లేదంటే తమదే తప్ప జరిగిందని ఒప్పుకుంటారా?.. అధికారులు ఏం చెబుతారో చూడాలి. మొత్తంగా కరెంట్ బిల్లు అందరినీ షాక్ కు గురిచేసింది.
- June 13, 2024
- Top News
- A current bill of Rs. 21.47 crore!ngkl
- BIJINEPALLY
- current bill
- కరెంట్ బిల్లు
- నాగర్ కర్నూల్
- బిజినేపల్లి
- Comments Off on ద్యావుడా…. ఏకంగా రూ.21.47 కోట్ల కరెంట్ బిల్లు!