సారథిన్యూస్, హైదరాబాద్: బట్టతల వస్తోందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన హైదరాబాద్ ఉప్పల్లోని సత్యానగర్లో మంగళవారం చోటుచేసుకున్నది. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన నితిన్ ఉప్పల్ ఉంటున్నాడు. క్యాటరింగ్ పనులు చేస్తే జీవనం సాగిస్తున్నాడు. క్యాటరింగ్తో వచ్చిన డబ్బులను కొన్ని ఇంటికి పంపిస్తూ.. మరికొన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం దాచుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల అతడి సోదరి పెళ్లి కోసం డబ్బు కావాలని ఇంటి నుంచి సమాచారం వచ్చింది. మరోవైపు కరోనాతో క్యాటరింగ్ పనులు నిలిచిపోయాయి. […]
కోల్కతా: బీజేపీ ఎమ్మెల్యే ఆత్మహత్యను ఆ పార్టీ నేతలు రాజకీయం చేయాలని చూస్తున్నారని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ విషయమై ఆమె రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు బుధవారం లేఖ రాశారు. బీజేపీ ప్రతినిధుల బృందం మిమ్మల్ని కలిసి వాస్తవాలను వక్రీకరించి చెప్పారని, ఆ విషయమై మీకు క్లారిటీ ఇచ్చేందుకే ఈ విషయంపై రాస్తున్నాను అని మమతా బెనర్జీ అన్నారు. ‘ఎమ్మెల్యే తరచూ ప్రజలను కలిసే మొబైల్ షాప్ దగ్గర ఉరి వేసుకుని కనిపించారు. పోస్ట్మార్టం […]
సారథిన్యూస్, రామడుగు: మోకాళ్ల నొప్పులు తట్టుకోలేక.. నడువలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంగనగర్ జిల్లా రామడుగు మండలం గండికి చెందిన జనగం రాజయ్య (80) కొంతకాలంగా నడవలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడికి ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు కమలాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అనూష తెలిపారు.
న్యూఢిల్లీ: చిన్న, చిన్న విషయాలకే టీనేజ్ పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటిగా మారింది. తల్లిదండ్రుల పిల్లలను చేరదీయకపోవడం, వారికి మానసిక స్థైర్యం కల్పించకపోవడంతో ఇటువంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ బాలిక.. తనకంటే స్నేహితురాలికి ఎక్కువ మార్కులు వచ్చాయన్న కారణంతో ప్రాణం తీసుకున్నది. కాన్పూర్లోని ధమిఖేడకు చెందిన శ్రావణ్ కుమార్ కుమార్తె అనిశా ఓ ప్రైవేట్ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నది. ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ ఫలితాల్లో 82 శాతం మార్కులు వచ్చాయి. కాగా తన […]
సారథిన్యూస్, జనగామ: సెల్ఫోన్ కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం రాఘవాపురంలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన శ్రీకాంత్(20) కొంతకాలంగా సెల్ ఫోన్ కొనివ్వాలంటూ తల్లిదండ్రులు అడుతున్నాడు. ఆర్థికపరిస్థితి బాగా లేకపోవడంతో వారు కొనివ్వలేకపోయారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్ పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడిని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
చెన్నై: దుర్మార్గుడైన ఓ వృద్ధుడు భార్య గొంతుకోసి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో వెలుగుచూసింది. పెరుంగలాథూర్ ప్రాంతంలోని డేవిడ్ నగర్లోని ఓ ఫ్లాటులో జగన్నాథన్ (72), అతడి భార్య సులోచన (62)లు నివాసముండేవారు. అపార్టుమెంట్ పై జగన్నాథన్ మృతదేహాన్ని చూసిన అపార్టుమెంటు వాసులు విషయాన్ని ఆమె భార్యకు చెప్పేందుకు వారి ఫ్లాటుకు వెళ్లి చూడగా రక్తపు మడుగులో సులోచన కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఇద్దరి […]
సారథిన్యూస్, ఖమ్మం: ఇద్దరు పిల్లలతో కలిసి ఓ విలేకరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యానాంకు చెందిన ముమ్మిడి శ్రీనివాస్(36) ప్రజాశక్తి దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. కాగా శనివారం అతడు తన ఇద్దరు పిల్లలతో కలిసి యానాంలోని గోదావరి నదిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
ముంబై : మహారాష్ట్రలో సెలూన్లు ఓపెన్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. కరోనా కారణంగా మూడు నెలల నుంచి సెలూన్లను మూసివేశారు. దీంతో సెలూన్ నిర్వాహకులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికే 12 మంది బార్బర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో జూన్ 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్షౌరశాలలు తెరిచేందుకు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గురువారం జరిగిన సమీక్షలో కేబినెట్ దీనికి ఆమోదముద్ర తెలిపిందని మంత్రి విజయ్ తివార్ తెలిపారు. […]