సామాజిక సారథి, కౌడిపల్లి: అప్పుల బాధతో ఓ రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కంచన్ పల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంచన్ పల్లి గ్రామానికి చెందిన దుంపల మల్లేశం(40) తనకున్న 30 గుంటల వ్యవసాయ పొలంలో వరి సాగుచేస్తున్నాడు. కాగా, వ్యావసాయానికి, తన కుమార్తె వివాహంకోసం రూ.4లక్షల వరకూ అప్పు చేశాడు. అప్పలు ఎలా తీర్చాలో తెలియక మల్లేశం తీవ్ర […]
సారథి న్యూస్, రామాయంపేట: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంటలో చోటుచేసుకున్నది. కల్వకుంటకు చెందిన బుర్రని బాలమల్లు (45) రెండెకరాలు కౌలుకు తీసుకొని వరిసాగు చేశాడు. ఇందుకోసం కొంత అప్పుచేశాడు. అయితే ఇటీవల కరిసిన భారీ వర్షాలకు పంట మునిగిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెంది శనివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాలమల్లుకు భార్య ఇందిర తీవ్రంగా విలపిస్తున్నది. ఈ ఘటనపై కేసు […]
‘మనసు మమత’, ‘మౌనరాగం’ తదితర సీరియల్స్లో నటించిన టీవీ నటి శ్రావణి మంగళవారం రాత్రి తన ఫ్లాట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. టిక్టాక్లో పరిచయమైన ఓ వ్యక్తి వేధింపులతోనే శ్రావణి బలవన్మరణానికి పాల్పడట్టు సమాచారం. శ్రావణి.. హైదరాబాద్ ఎస్ఆర్నగర్ పరిధిలోని మధురానగర్లో ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఆమె బాత్రూంలోకి వెళ్లింది.. ఎంతకూ తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యుల చూడగా.. బాత్రూంలో ఉరివేసుకుని విగతజీవిగా పడిఉంది. వారు వెంటనే యశోద దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యుల ధ్రువీకరించారు. శ్రావణికి కొంతకాలం […]
పుణే: సైకో భర్త నీచమైన లైంగికకోరికలు తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. మద్యం, డ్రగ్స్కు బానిసైన ఈ నీచుడు ఫోర్న్ సినిమా తరహాలో సెక్స్ కావాలంటూ భార్యను వేధించేవాడు. ఆమెను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేసేవాడు. దీంతో శాడిస్ట్ మొగుడి టార్చర్ తట్టుకోలేక.. పుట్టింటికి వచ్చిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు.. మహారాష్ట్రలోని పూణెకు చెందిన రతన్ లాల్కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్న కూతురును 2019లో లండన్లో ఉద్యోగం చేస్తున్న […]
సారథి న్యూస్, రామగుండం: బాలిక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్లో శనివారం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
సారథి న్యూస్, వనపర్తి: వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. నాగపూర్కు చెందిన అజీరాం బీ(63), ఆమె కూతురు ఆస్మా బేగం (35), అల్లుడు ఖాజా పాషా (42), మనవరాలు హసీనా నస్రీన్ (10) శుక్రవారం తమ ఇంట్లో మృతిచెందారు. ఇంట్లో ఈ నలుగురు విగతజీవులుగా పడిఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వంట గదిలో అజీరాం బీ, హాల్లో హాసీనా, డైనింగ్ హాల్లో […]
సారథిన్యూస్, హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లా.. ఖమ్మం రూరల్ మండలం… మంగళగూడెం గ్రామానికి చెందిన గోపీకృష్ణ (26)కు 2018లో భద్రాచలం సమీపంలోని చోడవరం గ్రామానికి చెందిన నందిని(26)తో వివాహమైంది. వీరిద్దరూ కొడైకెనాల్లోని ఓ ఐటీకంపెనీలో పనిచేస్తున్నారు. సంవత్సరం నుంచి అన్నయ్ థెరిస్సా యూనివర్సిటీ దగ్గర్లోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి దంపతులు తమ ఇంట్లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీళ్లకు కిరాణా సరుకులు తెచ్చిచ్చే […]
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య బాలీవుడ్లో తీవ్ర దుమారం సృష్టిస్తున్నది. ఇప్పటికే బాలీవుడ్లోని నెపోటిజంపై పలువురు సీనీ నటులు, ప్రముఖులు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ అందాల భామ తనూశ్రీ దత్తా సుశాంత్ కేసుపై స్పందించారు. ముంబై పోలీసులు సుశాంత్ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారేమోనని తనకు అనుమానంగా ఉన్నదని ఆమె పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించడమే ఉత్తమమని ఆమె వ్యాఖ్యానించారు. ముంబై పోలీసులను పూర్తిగా నమ్మలేమని ఆమె వ్యాఖ్యానించారు. వారు రాజకీయనాయకుల […]