Breaking News

‘మనసు మమత’ నటి సూసైడ్

‘మనసు మమత’, ‘మౌనరాగం’ తదితర సీరియల్స్​లో నటించిన టీవీ నటి శ్రావణి మంగళవారం రాత్రి తన ఫ్లాట్​లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. టిక్​టాక్​లో పరిచయమైన ఓ వ్యక్తి వేధింపులతోనే శ్రావణి బలవన్మరణానికి పాల్పడట్టు సమాచారం. శ్రావణి.. హైదరాబాద్​ ఎస్​ఆర్​నగర్​ పరిధిలోని మధురానగర్​లో ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఆమె బాత్​రూంలోకి వెళ్లింది.. ఎంతకూ తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యుల చూడగా.. బాత్​రూంలో ఉరివేసుకుని విగతజీవిగా పడిఉంది. వారు వెంటనే యశోద దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యుల ధ్రువీకరించారు.

శ్రావణికి కొంతకాలం క్రితం టిక్​టాక్​లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజురెడ్డి అలియాస్​ సన్నీ టిక్​టాక్​లో పరిచయమయ్యారు. తనకు తల్లిదండ్రులు ఎవరూ లేరని శ్రావణితో పరిచయం పెంచుకున్నాడు. అయితే ఇటీవల అతడు శ్రావణిని ప్రేమపేరుతో వేధించినట్టు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దేవరాజురెడ్డిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.