Breaking News

క్రైమ్

చికిత్స పొందుతూ మహిళ మృతి

చికిత్స పొందుతూ మహిళ మృతి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ ​జిల్లా పెద్దశంకరంపేటలోని ఓ ప్రైవేట్ ​ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. నారాయణఖేడ్ మండలం పిప్రితండాకు చెందిన మారోని బాయ్ (55)కి బీపీ ఎక్కువై అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆమె అర్ధరాత్రి సమయంలో చనిపోయింది. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు, బంధువులు […]

Read More
ఘోరరోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

ఘోరరోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

సారథి న్యూస్, చేవెళ్ల: చేవెళ్ల మండలంలోని కందవడా గేట్ సమీపంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌- బీజాపూర్‌ ప్రధాన రహదారిపై ఇన్నోవా కారు బోర్ వెల్ లారీని ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రగాయాలతో బయటపడ్డారు. హైదరాబాద్ లోని తాడ్ బండ్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. కారులో ఇరుక్కున్న శవాలు బయటికి తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More
క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్ షురూ

క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్ ప్రారంభం

హైదరాబాద్: గ‌చ్చిబౌలిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూత‌నంగా ఏర్పాటుచేసిన క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్‌ను రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, మ‌హ‌మూద్ అలీ, స‌బితా ఇంద్రారెడ్డి, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డితో కలిసి బుధ‌వారం ప్రారంభించారు. ‘సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌’లో భాగంగా ఈ డేటా సెంట‌ర్‌ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. కాగా, ఈ సెంట‌ర్‌లో భారీ తెర‌ను ఏర్పాటుచేశారు. దీని మీద ఒకేసారి ఐదువేల సీసీ కెమెరాల‌కు చెందిన లైవ్ దృశ్యాల‌ను వీక్షించొచ్చు. […]

Read More
సగం కాలిన డెడ్​బాడీ లభ్యం

సగం కాలిన డెడ్​బాడీ లభ్యం

సారథి న్యూస్, గజ్వేల్: సిద్దిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామశివారులో సగం కాలిపోయిన గుర్తుతెలియని డెడ్​బాడీని స్థానికులు బుధవారం గుర్తించారు. నాగిరెడ్డిపల్లిలోని పెద్దచెరువు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై రాజేంద్రప్రసాద్ తెలిపారు. గుర్తుతెలియని దుండగులు హత్యచేసి మృతదేహాన్ని కాల్చివేసినట్లు భావించి ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, ఆచూకీ తెలిసిన వారు ములుగు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. డెడ్​బాడీని గజ్వేల్​ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. […]

Read More
మావోయిస్టు మిలిషియా సభ్యుడి అరెస్ట్

మావోయిస్టు మిలిషియా సభ్యుడి అరెస్ట్

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకలో శనివారం మావోయిస్టు మిలిషియా సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన మిడియం చిన్నలక్ష్మయ్య అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పాడు. మూడేళ్లుగా మిలిషియా సభ్యుడిగా పనిచేస్తూ, ప్రభుత్వ నిషేధిత సీపీఐ మావోయిస్ట్ పార్టీకి నిత్యావసర వస్తువులు అందజేస్తూ.. వారు గ్రామానికి వచ్చినప్పుడల్లా వారికి భోజన వసతి ఏర్పాటు చేస్తూ.. పోలీస్ వారి కదలికలను ఎప్పటికప్పుడు […]

Read More
కిరోసిన్ పోసుకుని యువతి ఆత్మహత్య

కిరోసిన్ పోసుకుని యువతి ఆత్మహత్య

సారథి న్యూస్, రామాయంపేట: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతి కిరోసిన్​పోసుకుని నిప్పంటించుకుని సూసైడ్​చేసుకుంది. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నందిగామకు చెందిన దేవసాని రేవతి(19) రెండేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స చేయించినా నయం కాకపోవడం, అలాగే తన కుటుంబసభ్యులు తనకు పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. అనారోగ్యంతో ఉంటూనే ఇప్పుడే పెండ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనంతట తాను ఒంటిపై కిరోసిన్ పోసుకుని […]

Read More
కుంటలో పడి చిన్నారి మృతి

కుంటలో పడి చిన్నారి మృతి

సారథి న్యూస్, కంగ్టి: నీటి కుంటలో పడి చిన్నారి మృతిచెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ కంగ్టి మండలంలోని చాప్టా(కే)గ్రామంలో చోటు చేసుకుంది. కురుమ గాయత్రి(8) తల్లితో కలిసివెళ్లి శనివారం ఉదయం బట్టలు ఉతకడానికి గ్రామ శివారులోని నీటి కుంటలోకి దిగి బట్టలు ఉతుకుతున్న సమయంలో కాలు జారీ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. కూతురు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లి చూడగానే శ్వాస ఆడక కొట్టుమిట్టాడుతున్న బిడ్డను చూసి సృహకోల్పోయింది. నీటిలో మునిగిన బిడ్డను బయటికి […]

Read More
వరకట్నం వేధింపులకు మహిళ బలి

వరకట్నం వేధింపులకు మహిళ బలి

సారథి న్యూస్, అలంపూర్: వరకట్నం వేధింపులకు ఓ ఇల్లాలు బలైంది. అనుమానాస్పదస్థితి ఉరివేసుకుని చనిపోయింది. శుక్రవారం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అలంపూర్ ఎస్సై మధుసూదన్ రెడ్డి, మృతురాలి తల్లిదండ్రులు, బంధువుల వివరాల మేరకు.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం కోనేరు గ్రామానికి చెందిన ప్రసాద్ రెడ్డి, పద్మకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకూతురు సాహితీని అదే గ్రామానికి చెందిన హైదరాబాద్ లో సాఫ్ట్ వెర్ ఉద్యోగం చేసే జింకల కిరణ్ కుమార్ రెడ్డికి 50 […]

Read More