సారథి న్యూస్, హైదరాబాద్: రానున్న రోజుల్లో రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలు, దేశాలకు చేపలను ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో ఒక్కొక్కటి చొప్పున చేపల విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటుచేసిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ(ఎంపీఈడీఏ) ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా […]
సారథి న్యూస్, రామాయంపేట: బీడీ యాజమాన్యాలు వేతన ఒప్పందాన్ని అమలు చేయాలనితెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈదారి మల్లేశం డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మెదక్ జిల్లా రామాయంపేటలో ప్యాకింగ్ కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేతన ఒప్పందం ముగిసి దాదాపు ఆరు మాసాలు గడుస్తున్నా బీడీ యాజమాన్యాలు వేతన ఒప్పందం చేయకుండా కార్మికులను దోపిడికి గురి చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బండారి కుమార్, లక్ష్మణ్, బి రాజు, […]
సారథిన్యూస్, సిద్దిపేట: దుబ్బాకలో ఉప ఎన్నికల జరుగుతున్న వేళ కాంగ్రెస్పార్టీకి షాక్ తగిలింది. దుబ్బాక నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ ఆ పార్టీ సీనియర్ నేతలు నరసింహారెడ్డి, మనోహర్రావు పార్టీకి గుడ్బై చెప్పారు. శుక్రవారం వారు మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. నియోజకవర్గంలో గట్టి పట్టున్న ఇద్దరు నేతలు పార్టీని వీడటంతో ఆ పార్టీకి పెద్ద దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించిన అక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. నవంబరు 3న […]
టాలీవుడ్ చందమామ కాజల్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. గౌతమ్ అనే వ్యాపారవేత్తను ఈ ముద్దుగమ్మ పెళ్లాడబోతున్నది. అయితే తమది ప్రేమ పెళ్లి అని ఇదివరకే ఈ జంట ప్రకటించింది. గౌతమ్తో కాజల్ దాదాపు ఏడేండ్ల పాటు అఫైర్ నడిపినట్టు సమాచారం. మీడియా కంటపడకుండా ఈ జంట చాలా రహస్యంగా ప్రేమవ్యవహారం నడిపిందట. మరోవైపు కాజల్ను పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరంటూ నెటిజన్లు గూగుల్లో తెగ వెతుకుతున్నారట. వాళ్లిద్దరూ చాలా క్లోజ్గా ఉన్న కూడా ఫొటోలు […]
కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో తీవ్ర అలజడి చెలరేగింది. కర్నూల్ జిల్లా నంద్యాలలో వైసీపీ నేత సుబ్బారాయుడు దారుణహత్యకు గురయ్యారు. ప్రస్తుతం నంద్యాలలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. శుక్రవారం ఉదయం వాకింగ్కు వెళ్లిన సుబ్బారాయుడిపై గుర్తు తెలియని దుండగులు కర్రలతో వచక్షణారహితంగా దాడి చేశారు. నంద్యాలలోని విజయ పాల డెయిరీ సమీపంలో ఈ హత్య జరిగింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నది. పాతకక్షలతోనే […]