పేదలకు 45 లక్షల గృహాలను నిర్మించాం లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ సంక్రాంతి సందర్భంగా శుక్రవారం ఓ దళితుడి ఇంట్లో భోజనం చేశారు. అమృత్లాల్ భారతి కుటుంబం ఆయనకు ఆతిథ్యమిచ్చింది. ఆయన మంత్రివర్గం నుంచి వైదొలగిన మంత్రులు సమాజ్వాదీ పార్టీలో చేరుతూ, ఓబీసీలు, దళితులను యోగి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. అమృత్లాల్ ఇంట్లో భోజనం చేసిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ విలేకర్లతో మాట్లాడుతూ సమాజ్వాదీ పార్టీ […]
వారు అధికారంలోకొస్తే ఉగ్రవాదులతో దోస్తీ ఎస్పీ నేతలపై ప్రధాని నరేంద్రమోడీ విమర్శలు గోరఖ్పూర్లో పలు కార్యక్రమాలకు శ్రీకారం లక్నో: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఉత్తరప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అన్ని ప్రధాన పార్టీలతో పాటు పలు చిన్నాచితకా పార్టీలు కూడా వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. యూపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ.. గోరఖ్పూర్లో మంగళవారం ఏర్పాటుచేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వేదికపై నుంచే ప్రతిపక్ష సమాజ్వాది పార్టీపై ప్రధాని […]
కరోనా రోగుల అంత్యక్రియల కోసం బంధువుల ఎదురుచూపులు వారణాసి, భోపాల్, ఇండోర్, ఘజియాబాద్, రాంచీల్లో కిక్కిరిసిన శ్మశానాలు న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మృత్యువిలయాన్ని సృష్టిస్తోంది. తొలిసారి లక్ష కేసులను దాటి పదిరోజుల్లోనే రెండో లక్షను అధిగమించిన మహమ్మారి ఇప్పుడు మృత్యుపంజా విసురుతోంది. ఒకవైపు కరోనా పేషెంట్లతో అంబులెన్సులు హాస్పిటళ్ల ముందు లైన్ కడుతున్నాయి. మరోవైపు శ్మశానవాటికల ముందు శవాల లైన్లు దర్శనమిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్, వారణాసి, లక్నోతో […]
లక్నో: కరోనా మహమ్మారి సామాన్యులను, ప్రముఖులను సైతం బలితీసుకుంటున్నది. ఆదివారం ఉత్తర్ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కమలా రాణి కరోనాతో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ఆమె సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కరోనాపై పోరులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ ఆమె ముందున్నారు. ఈ క్రమంలోనే జులై 18న అనారోగ్యం పాలైయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్గా తేలింది. అప్పటి నుంచి లక్నోలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. […]
నోయిడా: కరోనా బారినపడ్డ ఓ యువతిని వైద్యుడు లైంగికంగా వేధించాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా జైపీ దవాఖానలో చోటుచేసుకున్నది. ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న ఓ యువతికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆమె జైపీ దవాఖానలో చేరింది. కాగా జైపీ దవాఖానలో పనిచేస్తున్న ఓ యువ వైద్యుడికి కూడా కరోనా సోకింది. కాగా దవాఖాన సిబ్బంది.. వీరిద్దరికీ ఒకే గదిని( ట్విన్బెడ్ షేరింగ్రూమ్) కేటాయించారు. దీంతో యువతితో సదరు వైద్యుడు అసభ్యంగా […]
లక్నో: ఉత్తరప్రదేశ్లో నడిరోడ్డులో ఒక జర్నలిస్ట్పై దుండగులు కాల్పులు జరిపారు. కొద్దిరోజుల క్రితం తన మేనకోడలిని వేధించారని సదరు జర్నలిస్టు ఫిర్యాదు చేశాడు. దీంతో కక్ష పెంచుకున్న ఆకతాయిలు కాల్పులు జరిపిఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో విక్రమ్ జోషి ఓ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి విక్రమ్ తన కూతురుతో కలిసి ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఆకస్మికంగా కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధిన దృశ్యాలు దగ్గరలో ఉన్న సీసీ […]
కాన్పూర్: కరడుగట్టిన గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్పై ప్రస్తుతం సోషల్మీడియాలో ప్రశ్నల వర్షం మొదలైంది. శుక్రవారం ఉదయం కాన్పూర్ సమీపంలో పోలీసుల ఎన్కౌంటర్లో వికాస్దూబే మరణించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం పలు నాటకీయపరిణామాల మధ్య ఉజ్జయినిలో వికాస్దూబే అరెస్టయ్యారు. అరెస్ట్కు కొద్దిగంటల ముందే వికాస్దూబేకు సన్నిహితులైన ఇద్దరు అనుచరులను పోలీసులు ఎన్కౌంటర్లో కాల్చిచంపారు పోలీసులు. కాగా వికాస్దూబే ఎన్కౌంటర్పై చాలా మంది ప్రశంసిస్తూ సోషల్మీడియాలో పోస్టులు పెడుతుండగా.. మరికొందరు మాత్రం ఎన్కౌంటర్పై పోలీసులు చెబుతున్న వివరణ […]
లక్నో: యూపీలో ఎనిమిది మంది పోలీసులను దారుణంగా హత్యచేసిన గ్యాంగ్స్టర్ వికాస్దూబే ప్రధాన అనుచరుడు అమర్దూబేను పోలీసులు కాల్చిచంపారు. ఉత్తర్ప్రదేశ్ హమీర్పూర్ జిల్లాలోని ఓ ప్రాంతంలో అతడు తలదాచుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అతడిని అదుపులోకి తీసుకొనేందుకు వెళ్లారు. దీంతో అతడు పోలీసులపై కాల్పులు జరిపారు. అనంతరం పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో అమర్ హతమయ్యాడని ఆరాష్ట్ర అదనపు డీజీపీ ప్రశాంత్కుమార్ వెల్లడించాడు. అమర్దూబేపై రూ.25 వేల రివార్డు ఉంది. […]