సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వెంకటాపురం(నుగూరు) మండలంలోని సూరవీడు కాలనీ వద్ద బుధవారం మధ్యాహ్నం సమయంలో వెంకటాపురం నుంచి భద్రాచలం వెళ్లే రహదారిపై మావోయిస్టుల కరపత్రాలు వెలిశాయి. దీనితో వచ్చిపోయే ప్రయాణికులు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ‘కరోనాతో ప్రాణాపాయస్థితిలో ఉన్న వరవరరావు, వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు 12 మందిని ప్రభుత్వం బేషరతుగా విడుదల చేయాలని, ఉఫా, ఎన్ఐఏ కేసులను ఎత్తివేయాలని, అడవుల నుంచి గ్రేహౌండ్స్ బలగాలను ఉపసంహరించాలని, జులై 25న తెలంగాణ […]
సారథిన్యూస్, కొత్తగూడెం: మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులను, గిరిజనలకు తీరని అన్యాయం చేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ విమర్శించారు. జిల్లాలోని చర్ల మండలం బత్తినపల్లి, తిప్పాపురం గ్రామాల మధ్య ప్రభుత్వం రోడ్డును నిర్మిస్తుంటే మావోయిస్టులు రోడ్డు నిర్మాణం కోసం ఉపయోగిస్తున్న యంత్రాలను ధ్వంసం చేశారన్నారు. ఏజేన్సీ ప్రాంతంలో మావోయిస్టులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. మావోయిస్టులు ఇకనైనా ఈ విధ్వంసాన్ని ఆపాలని ఆయన సూచించారు.
సారథి న్యూస్, హైదరాబాద్: విరసం నేత వరవరరావు అక్రమ నిర్బంధానికి నిరసనగా ఈనెల 25వ తేదీన రాష్ట్ర ప్రజలు బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేసింది. అర్బన్ నక్సల్స్ పేరుతో అరెస్టు చేసిన వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాతో సహా 12 మందిని, 60 ఏళ్లు పైబడిన రాజకీయ ఖైదీలను ప్రభుత్వం బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ ఉపా, ఎన్ఐఏ కేసులను […]
సారథి న్యూస్, హైదరాబాద్: సీపీఐ(మావోయిస్ట్) పార్టీ తెలంగాణలో మళ్లీ పాగావేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా రాష్ట్రకమిటీతో పాటు ఏరియా కమిటీలను ప్రకటించి పోలీసులకు సవాల్ విసిరింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా హరిభూషణ్ అలియాస్ యాప నారాయణను ఎన్నుకున్నట్లు సమాచారం. ఏడుగురు సభ్యులతో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర కార్యదర్శిగా హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ బాధ్యతలు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. పుల్లూరి […]
దండకారణ్యంలో విస్తృతంగా తనిఖీలు భారీ సంఖ్యలో పోలీసు బలగాల మోహరింపు సారథి న్యూస్, వాజేడు: కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న దండకారణ్యంలో మళ్లీ అలజడి మొదలైంది. మావోయిస్టులు తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారన్న ఇంటలిజెన్స్సమాచారం మేరకు పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికుల్లో కలవరం నెలకొంది. ములుగు జిల్లా, చత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో కొద్దిరోజులుగా పెద్దసంఖ్యలో పోలీసు బలగాలు కుంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సీఐ శివప్రసాద్ నేతృత్వంలో సివిల్ […]
సారథిన్యూస్, ఆసిఫాబాద్: మావోయిస్టలు తెలంగాణలోకి ప్రవేశించారని కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తర్యాని మండలపరిధిలోని అడువుల్లో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టు పార్టీకి చెందిన ఓ అగ్రనేత, రాష్ట్రకమిటీ సభ్యుడు మైలవరకు అడెల్లు అలియాస్ భాస్కర్ త్రుటిలో తప్పించుకున్నట్టు సమాచారం. కాగా పోలీసులు, ప్రత్యేక బలగాలు ఈ అడవిని జల్లెడ పడుతున్నారు. పోలీసులకు విప్లవసాహిత్యం, మావోయిస్టుల యూనిఫాంలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, డిటోనేటర్లు, కార్దెక్స్ వైర్లు, పాలితిన్ […]
సారథిన్యూస్, ఖమ్మం : మావోయిస్టుల కదలికల నేఫథ్యంలో.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం లక్ష్మీపురంలో మంగళవారం భారీ బందోబస్తు నడుమ గ్రీన్ఫీల్డ్ సర్వే నిర్వహించారు. సుమారు 50 మంది పోలీసులు బందోబస్తులో పాల్గన్నారు. వైరా ఏసీపీ సత్యనారాయణ, కల్లూరు ఏసీపీ వెంకటేశ్, వైరా సీఐ వసంత కుమార్, తల్లాడ వైరా, కల్లూరు ఎస్సైలు తిరుపతిరెడ్డి, సురేశ్, రఫీ ఆధ్వర్యంలో సర్వే కొనసాగింది. తల్లాడ ఎస్సై తిరుపతిరెడ్డి, పోలీసు బలగాలతో పొలాల్లో చేల గట్లపై బురదలో నడుచుకుంటూ సర్వేకు […]
సారథిన్యూస్, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎదుట శనివారం ఐదుగురు మావోయిస్టు దళసభ్యులు లొంగిపోయారు. చింతూర్ సబ్డివిజన్ పరిధిలోని ఎటపాక పోలీస్స్టేషన్లో ఎస్పీ సమక్షంలో వీరు లొంగిపోయారు. మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ కోరారు. వారికి ప్రభుత్వం తగిన పరిహారం అందజేయటంతోపాటు ఉపాధి కూడా కల్పిస్తుందని చెప్పారు.