సారథి న్యూస్, మక్తల్: షేర్ మార్కెట్ బూచి చూపి జనాన్ని దోచుకున్న షేక్ మహబూబ్ సుభానీ తాను కూడా దోపిడీకి గురయ్యాడు. షేర్మార్కెట్ పేరుతో ప్రజల నుంచి రూ.100 కోట్లు వసూలు చేసి ఉడాయించినట్లు డిపాజిట్ దారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏజెంట్లుగా పోలీసులు, విలేకరులు, పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లను పెట్టుకున్నాడు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన షేక్ మహబూబ్ సుభానీ ఏడాది క్రితం మక్తల్కు వచ్చి స్థిరపడ్డాడు. ప్రజలను […]
సారథిన్యూస్, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎదుట శనివారం ఐదుగురు మావోయిస్టు దళసభ్యులు లొంగిపోయారు. చింతూర్ సబ్డివిజన్ పరిధిలోని ఎటపాక పోలీస్స్టేషన్లో ఎస్పీ సమక్షంలో వీరు లొంగిపోయారు. మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ కోరారు. వారికి ప్రభుత్వం తగిన పరిహారం అందజేయటంతోపాటు ఉపాధి కూడా కల్పిస్తుందని చెప్పారు.