Breaking News

LORRY

లారీ ఢీకొని యువకుడు మృతి

సారథి న్యూస్, హుస్నాబాద్: వేగంగా వస్తున్న లారీ ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో చోటుచేసుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కొండసముద్రంకు చెందిన తాటిపర్తి చంద్రమౌళి(37) శనివారం హస్నాబాద్​కు వచ్చాడు. కాగా పట్టణంలోని నాగారం వద్ద రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రమౌళి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు లారీ డ్రైవర్​ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Read More

లారీతో తొక్కించి చంపుతామంటున్నారు

సారథిన్యూస్​, అమరావతి: జగన్​ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు వైఎస్సార్​సీపీ గుండాలు తనను బెదిరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. వాళ్ల బెదిరింపులకు తాను బెదిరిపోయే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. తనకు రోజుకు 10 సార్లు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లారీతో తొక్కించి చంపుతామని బెదిరించినట్లు ఉమ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రోత్సాహంతోనే వైసీపీ మంత్రులు బెదిరిస్తున్నారని చెప్పారు. తనకు బెదిరింపు కాల్స్​ […]

Read More

రహదారి రక్తసిక్తం.. ఐదుగురు దుర్మరణం

సారథి న్యూస్​, వరంగల్​: వరంగల్​ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్​ రూరల్​ జిల్లా దామెర మండలం పసరగొండ వద్ద లారీ.. కారును ఓవర్​టేక్​ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా కారులో ఉన్న మేకల రాకేశ్​, మేడి చందు, రోహిత్​, సాబిర్​, పవన్​ మృతిచెందారు. మృతులంతా పోచం మైదాన్​కు చెందినవారని సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Read More

స్కూలుకు వెళ్తూ.. తొలిరోజే విషాదం

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: తొలి రోజు పాఠశాలకు వెళ్లిన ఒక ప్రభుత్వ టీచర్ కు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో శంకర్​నాయక్​ ఎస్జీటీగా పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులందరూ 27 నుంచి పాఠశాలలకు రావాలని ఆదేశించడంతో.. గురువారం ఉదయం స్కూలుకు బయలుదేరి వెళ్లాడు. ఈ క్రమంలో కాలినడకన పాఠశాలకు వెళ్తుండగా.. వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో శంకర్​నాయక్​ ఎడమకాలు ఛిద్రమైంది. తీవ్రంగా రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు ఆయనను 108 […]

Read More

లారీ డ్రైవర్​ సజీవదహనం

సారథిన్యూస్​, అనంతపురం: ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఓ లారీ డ్రైవర్​ సజీవదహనమయ్యాడు. ఈఘటన అనంతరం జిల్లా తాడిపత్రి సమీపంలోని కడప రహదారిపై చోటుచేసుకున్నది. తాడిపత్రి నుంచి ఓ లారీ వరిపొట్టు లోడుతో వస్తున్నది. ఈ లారీని ఎదురుగా వస్తున్న మరో లారీ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన లారీడ్రైవర్​ నిశార్​ సజీవదహనం అయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు

Read More
లారెక్కిన ప్రయాణికుడికి కరోనా

లారెక్కిన ప్రయాణికుడికి కరోనా

సారథి న్యూస్, రంగారెడ్డి: కరోనా లక్షణాలతో ఉన్న ఓ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరో 58 మంది హమాలీ కార్మికులను హోమ్ క్వారంటైన్​ కు పంపించారు. రాజస్థాన్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండకు గన్నీ బ్యాగ్స్ లోడ్ తో వచ్చిన లారీలో ఎక్కిన ఓ ప్రయణికుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతడు ప్రయాణించిన లారీ విషయమై పోలీసులు ఆరా తీయగా వలిగొండ లో ఉన్నట్లు గుర్తించి డ్రైవర్, క్లీనర్లను రంగారెడ్డి జిల్లా రావిరాల […]

Read More