సామాజికసారథి, అచ్చంపేట: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సమాజాన్ని చక్కదిద్దాల్సిన గురువులు పక్కదారిపడుతున్నారు. పాఠాలు చెప్పాల్సిన వారు పాడు పనులను పాల్పడుతున్నారు. అచ్చంపేటకు చెందిన సిధార్థ మహాదేవ్ అలియాస్ పర్వతాలు మున్ననూర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. విద్యార్థినులతో చనువుగా ఉంటూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. వారిని చేతులతో తడుముతూ చిల్లర పనులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఓ విద్యార్థినికి సెల్ ఫోన్ ఇప్పించి మరీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. సదరు విద్యార్థిని అసలు విషయాన్ని తన కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సమాజాన్ని చక్కదిద్దాల్సిన ఉపాధ్యాయులే దారితప్పారు. విలువలను మరిచి కామకేళిలో మునిగిపోయారు. పవిత్రమైన వృత్తికే కళంకం తెచ్చారు. సదరు ఉపాధ్యాయిని భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదడం జిల్లాలో సంచలనంగా మారింది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సాతాపూర్ ప్రభుత్వ ప్రైమరీ స్కూలులో పనిచేస్తున్న ఓ మహిళా టీచర్, ఉపాధ్యాయుడి మధ్య స్నేహం చిగురించింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అది కూడా హద్దులు దాటింది. […]
సామాజిక సారథి ఎఫెక్ట్:-సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం లొట్టలోని పల్లి తాండా ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ టీచర్ సాయి రెడ్డిపై సోమవారం డీఈఓ డాక్టర్ గోవిందరాజులు సస్పెన్షన్ వేటు వేశారు. ఎస్జీటీ టీచర్ సాయిరెడ్డి ఓ టీచర్ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా చలామణి కావడంతో పాటు డ్యూటీకు వెళ్లకుండా ఇంటినుంచి వివిధ ప్రాంతాల నుంచి బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ వేస్తున్న విషయంపై సామాజిక సారథిలో మూడు రోజుల క్రితం నాడ్యూటీ… […]
సామాజిక సారథి, రామకృష్ణాపూర్: మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు అంగన్ వాడీ కేంద్రంలో టీచర్ గా విధులు నిర్వహిస్తున్న గడ్డం లక్ష్మి (55) అంగన్వాడి కేంద్రంలో ఆకస్మికంగా కిందపడి శుక్రవారం మృతి చెందింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతి చెందిన లక్ష్మికి ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు […]
సామాజికసారథి, హైదరాబాద్: టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. బుధవారం 30వేల ఉద్యోగాలకు ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. గురువారం టెట్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టనుంది. ఏప్రిల్ 12ను దరఖాస్తులకు చివరితేదీగా గడువు విధించింది. జూన్ 12న పరీక్ష నిర్వహించనుంది.
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: తొలి రోజు పాఠశాలకు వెళ్లిన ఒక ప్రభుత్వ టీచర్ కు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మెదక్జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో శంకర్నాయక్ ఎస్జీటీగా పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులందరూ 27 నుంచి పాఠశాలలకు రావాలని ఆదేశించడంతో.. గురువారం ఉదయం స్కూలుకు బయలుదేరి వెళ్లాడు. ఈ క్రమంలో కాలినడకన పాఠశాలకు వెళ్తుండగా.. వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో శంకర్నాయక్ ఎడమకాలు ఛిద్రమైంది. తీవ్రంగా రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు ఆయనను 108 […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి విద్యావ్యవస్థను అల్లకల్లోలం చేసింది. విద్యాసంస్థలు తెరిచే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఇప్పటికే అనేక ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థలు కూడా అదేవిధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే, అందరిలో ఉదయిస్తున్న ప్రశ్న ఒక్కటే. ఈ ఆన్లైన్ క్లాసుల వల్ల విద్యార్థులకు ఏమైనా ప్రయోజనం కలుగుతుందా? అని.. వాస్తవానికి విద్యార్థి తరగతి గదిలో విన్న పాఠానికి, ఆన్లైన్లో విన్నదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. తరగతి గదిలో […]