సారథి న్యూస్, హుస్నాబాద్/ బిజినేపల్లి: మొక్కలే జీవకోటికి ప్రాణాధారమని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం వెంకటేశ్వర దేవాలయం ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా చెట్లను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటిన చెట్లను పరిరక్షించాలని కోరారు. కాగా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 5,7,17 వ వార్డుల్లో మున్సిపల్ చైర్పర్యన్ ఆకుల రజిత మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో హుస్నాబాద్ వైస్ చైర్మన్ అనిత, కౌన్సిలర్లు […]
సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం లక్ష్యం నీరుగారుతున్నదని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేశ్ ఆరోపించారు. హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి అమరుల భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో 4000 వేలకు పైగా హరితహారం మొక్కలు పెంటకుప్పలపై వేశారని ఆరోపించారు. మండల ప్రజాపరిషత్ అధికారులు, మున్సిపల్ కమిషనర్కు ఆ మొక్కలు చూపించగా ఆ మొక్కలు ప్రభుత్వానికి కావంటూ బుకాయిస్తున్నారని ఆరోపించారు. రూ.5లక్షలకు […]
సారథిన్యూస్, గంగాధర/రామడుగు/రామగుండం: భావితరాలు బాగుండాన్న ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా మంగపేట గ్రామంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. రామడుగు మండలం గోపాల్రావుపేటలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయము ఆవరణలో పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ అధికారులు, సిబ్బందితో కల్సి పండ్ల మొక్కలను నాటారు. ఆయా కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కర్ర […]
సారథి న్యూస్, నల్లగొండ: నల్లగొండ జిల్లా అన్నెపర్తి శివారులోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ పాటిల్ మొక్కలు నాటారు. వాతావరణంలో సమతుల్యం లోపించడంతోనే వర్షాలు కురవడం లేదని మంత్రి జగదీశ్వర్రెడ్డి అన్నారు.
సారథి న్యూస్, మెదక్: రాష్ట్రంలో పచ్చదనం పెంచి భావితరాలకు బంగారు భవిష్యత్ను అందించేందుకే ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా హవేళి ఘనపూర్ మండలం పాతూరు, సుల్తాన్ పూర్ గ్రామాలతో పాటు జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని జిల్లా గ్రంథాలయం, వెంకట్రావునగర్ కాలనీ, పిల్లికొట్టాల్ వద్ద గల డబుల్ బెడ్ రూమ్ కాలనీ వద్ద కలెక్టర్ ధర్మారెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి హరితహారం కార్యక్రమంలో […]
సారథి న్యూస్,ములుగు: చెట్లే మానవజాతికి ప్రాణాధారమని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఆరోవిడుత హరితహారంలో భాగంగా శుక్రవారం ఆమె ములుగు జిల్లా అటవీశాఖ కార్యాలయంలో మొక్కలు నాటారు. ములుగు మండలం జాకారం, బండారుపల్లి, వెంకటాపూర్ మండలంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లడుతూ.. అటవీ సంపదను పెంచేందుకే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని తలపెట్టారని చెప్పారు. కార్యక్రమంలో ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎమ్మెల్యే […]
సారథిన్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఊరూరా జోరుగా సాగుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సారపాక ఫారెస్ట్ రేంజ్ కు చెందిన 30 ఎకరాల్లో మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, విప్ రేగా కాంతారావు తదితరులు మొక్కలు నాటారు. కొత్తగూడెంలోని పోలీస్ హెడ్ కార్టర్స్లో ఎస్పీ సునీల్ దత్ హరితహారంలో పాల్గొన్నారు. బూర్గంపాడులోని సారపాక పుష్కర వనం వద్ద మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి కె.తారక రామారావు సనత్ నగర్ నియోజవర్గం బల్కంపేట శ్మశానవాటికలో గురువారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ లక్ష్మి బాల్ రెడ్డి పాల్గొన్నారు. ‘ఈచ్ వన్ ప్లాంట్ వన్’ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి కేటీఆర్పిలుపునిచ్చారు. ఆరో విడత హరితహారంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజవర్గంలోని దుండిగల్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ […]