Breaking News

రామగుండం

గల్లీగల్లీలో బైక్ పెట్రోలింగ్

గల్లీగల్లీలో బైక్ పెట్రోలింగ్

సారథి ప్రతినిధి, రామగుండం: కరోనా విజృంభిస్తున్న వేళ గోదావరిఖనిలోని గల్లీగల్లీల్లో పోలీసులు సోమవారం సాయంత్రం పెట్రోలింగ్ నిర్వహించారు. గాంధీచౌరస్తా నుంచి సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. పనీపాట లేకుండా తిరుగుతున్న 20 మంది వాహనాలను సీజ్ చేసి, వారిని ఐసొలేషన్ వ్యాన్ లో ఎక్కించి పోలీస్ స్టేషన్ కి తరలించారు. వారికి కౌన్సిలింగ్ చేసి కరోనా వ్యాప్తిపై అవగాహన కల్పించారు. పెట్రోలింగ్ లో వన్ టౌన్ 2వ సీఐ రాజ్ కుమార్ గౌడ్, ఎస్సైలు ఉమాసాగర్, […]

Read More
అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం

సారథి ప్రతినిధి, రామగుండం: సింగరేణి ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను తొలిగించేందుకు యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. కాలనీలో కొందరు కార్మికులు ఆక్రమ కట్టడాలు చేపట్టడంతో డ్రైనేజీ, విద్యుత్ సరఫరాపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ మేరకు యాజమాన్యం ఒక కమిటీని నియమించి సింగరరేణి ప్రాంతాల్లోని ఆక్రమ కట్టడాలను గుర్తించి తొలగించేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగాంగా ఆదివారం స్థానిక, పవర్ హౌస్ కాలనీలోని టీ2 123, 124 క్వార్టర్ల వెనక భాగంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు.

Read More
అనవసరంగా బయటికొస్తే అంతే..

అనవసరంగా బయటికొస్తే అంతే..

సారథి ప్రతినిధి, రామగుండం: లాక్ డౌన్ సమయంలో అనవసరంగా బయటికి వచ్చిన వారిని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని పోలీసులు ఐసొలేషన్ సెంటర్ కు తరలించారు. ఏసీపీ ఉమెందర్ ఆధ్వర్యంలో సీఐలు రమేష్ బాబు, రాజ్ కుమార్, ఎస్సైలు ప్రవీణ్ కుమార్, ఉమాసాగర్, సతీష్, రమేష్ లాక్ డౌన్ ను పర్యవేక్షించారు. బయట తిరిగిన 20 వెహికిల్స్ ను సీజ్ చేశామని ఏసీపీ తెలిపారు. ప్రతి గల్లీల్లో పెట్రోలింగ్ నిర్వహించగా, కారణం లేకుండా బయట తిరుగుతున్న […]

Read More
మైనార్టీల అభ్యున్నతికి కృషి

మైనార్టీల అభ్యున్నతికి కృషి

సారథి ప్రతినిధి, రామగుండం: రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్​ కృషి చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం రంజాన్ పండగను పురస్కరించుకుని మసీద్ ఇమామ్ లు, సదర్లు, మతపెద్దలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. పండుగ వేళ ముస్లింలకు కానుకలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్​కే దక్కిందన్నారు. రెసిడెన్షియల్​ స్కూళ్లను ఏర్పాటుచేసి ఉచితంగా చదువులు అందిస్తున్నారని కొనియాడారు.కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, జడ్పీటీసీ […]

Read More
ఘనంగా బాబు జగ్జీవన్ రాం జయంతి

ఘనంగా బాబు జగ్జీవన్ రాం జయంతి

సారథి, రామాయంపేట/పెద్దశంకరంపేట/రామగుండం: జనం కోసమే జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రాం అని నిజంపేట మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు కొమ్మట బాబు కొనియాడారు. సోమవారం బాబు జగ్జీవన్ రాం 114వ జయంతిని పురస్కరించుకుని మండలకేంద్రంలో కొత్త బస్టాండ్ ఆవరణలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గెరిగంటి లక్ష్మీ నర్సింలు, చల్మేడ ఎంపీటీసీ నంద్యాల బాల్ రెడ్డి, నందిగామ మాజీ […]

Read More
లేబర్ కోడ్ పత్రాలు దగ్ధం

లేబర్ కోడ్ పత్రాలు దగ్ధం

సారథి, రామగుండం ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ బిల్లులను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఎన్టీపీసీ ప్లాంట్ గేట్నం.2 వద్ద సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఏఐటీయూసీ, టీఎన్టీయూసీ తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లేబర్ కోడ్ ప్రతులను దగ్ధం చేశారు. కార్మిక సంఘాల నేతలు మేరుగు రాజయ్య, ఎం.సారయ్య, మెండె శ్రీనివాస్, సీహెచ్​ వేణుగోపాల్ రెడ్డి, అసరి మహేశ్, కారం సత్తయ్య, వంగల రామన్న, కె.కృష్ణ, సీహెచ్​లక్ష్మణ్, నంది […]

Read More
ఎన్ఎస్​యూఐ జిల్లా కార్యదర్శిగా ఉదయ్ రాజ్

ఎన్ఎస్​యూఐ జిల్లా కార్యదర్శిగా ఉదయ్ రాజ్

సారథి, రామగుండం: పెద్దపెల్లి జిల్లా ఎన్ఎస్​యూఐ జిల్లా కార్యదర్శిగా మెంటు ఉదయ్ రాజ్ ను రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ నియమించారు. కాంగ్రెస్ పార్టీ నిర్మాణానికి కృషి చేస్తూ, విద్యార్థుల సమస్యలపై రాజీ పోరాటం చేస్తానని ఆయన పేర్కొన్నారు. నియామకానికి కృషి చేసిన మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ ఇన్​చార్జ్ రాజ్ ఠాకూర్, జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమరయ్య, కాంగ్రెస్ ఫార్వర్డ్ బ్లాక్ అధ్యక్షుడు మారబోయిన రవికుమార్, బొంతల రాజేష్, […]

Read More
ఆర్ఎఫ్​సీఎల్​ లో ఉద్యోగాలను అమ్ముకుంటున్రు

ఆర్ఎఫ్​సీఎల్​ లో ఉద్యోగాలను అమ్ముకుంటున్రు

సారథి, రామగుండం: ఆర్ఎఫ్​సీఎల్​ కంపెనీలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా డబ్బులకు కక్కుర్తిపడి ఒక్కో ఉద్యోగానికి రూ.ఆరు నుంచి రూ.పదిలక్షలు వసూలు చేస్తూ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ ఆరోపించారు. ఈ మేరకు ఎన్టీపీసీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్ఎఫ్ సీఎల్ సీఈవోను వెంటనే బర్తరఫ్ చేసి సీబీఐ విజిలెన్స్ ద్వారా విచారణ జరిపించాలని రియాజ్ డిమాండ్ చేశారు. సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు ఆకుల రామ్ కిషన్, తోట వేణు, వెల్తురు మల్లయ్య, […]

Read More