ఢిల్లీ: ఇటీవలే కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయిన కేంద్రహోం మంత్రి అమిత్ షా మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శనివారం అర్ధరాత్రి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఎయిమ్స్కు తరలించారు. ఆగస్టు 2న అమిత్ షాకు కరోనా పాటిజివ్ గా నిర్ధారణ అయ్యింది. గురుగ్రామ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందిన ఆయన 14న డిశ్చార్జి అయ్యారు. అయితే ఆగస్టు 18న అయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఎయిమ్స్లో […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం(24 గంటల్లో) కొత్తగా 2,216 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,57,096కు చేరింది. మహమ్మారి బారినపడి ఒకేరోజు 11 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 961కు చేరింది. కరోనా నుంచి కోలుకుని 2,603 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 1,24,528కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,607 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు […]
సారథి న్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని గోదావరిఖని చౌరస్తాలో జనసేన పార్టీ నాయకుడు మంథని శ్రవణ్ ఆధ్వర్యంలో శనివారం ఆటోడ్రైవర్లకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ.. కరోనా విపత్తువేళ ప్రతిఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఈర్ల ఐలయ్య, జనసేన నాయకులు రావుల మధు, రావుల సాయి కృష్ణ, చందు, తౌఫిక్, మంథని మధు తదితరులు పాల్గొన్నారు.
కొంతకాలంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ పుట్టిన దేశమైన చైనా సేఫ్జోన్లో ఉండగా.. మిగిలిన దేశాలన్నీ ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరయ్యాయి. చైనాలోని వూహాన్ ల్యాబ్లోనే ఈ వైరస్ను పట్టించారని తొలినుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే చైనాకు చెందిన ఓ వైరాలజిస్ట్ చేస్తున్న ఆరోపణలు ప్రస్తుతం ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. కరోనా వైరస్ జంతువుల మాంసం నుంచి రాలేదు. ఇది మనుషులే తయారు చేశారు. దీనిపై నావద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు […]
లక్నో: కరోనా పుణ్యమా! అని ప్రజలందరిలోనూ శానిటైజర్, మాస్కుల వినియోగం భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని ఓ దొంగల ముఠా దీనినే ఆసరాగా చేసుకుని బంగారు నగల దుకాణాన్ని లూటీ చేసింది. సాధారణ కస్టమర్ల మాదిరిగానే నగల షాపులోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు అక్కడ నగలు అమ్మే వ్యక్తి ముందు శానిటైజర్ కోసం చేయి చాచాడు. అతడు కూడా వచ్చినవారు కస్టమర్లు కావచ్చు అనుకుని వారి చేతికి శానిటైజర్ ద్రావణాన్ని చల్లాడు. అంతే.. ఇంతలోనే ఒక దొంగ […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం(24 గంటల్లో) 9,999 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,47,686కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 77 మంది మృతిచెందారు. మొత్తంగా ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,779కు చేరింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో 44,52,128 వ్యాధి నిర్ధారణ టెస్టులు చేశారు. గత 24 గంటల్లో 71,137 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఒకేరోజు 11,069 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం 2,426 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,52,602కు చేరింది. తాజాగా 13 మృతిచెందారు. ఇప్పటి వరకు కరోనాతో 940 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలాఉండగా, ఒకేరోజు 2,324 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 338 పాజిటివ్కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి వివిధ ఆస్పత్రుల్లో 32,195 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,19,467 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
24 గంటల్లో 96,551 మందికి పాజిటివ్ 45 లక్షలు దాటిన కరోనా కేసులు న్యూఢిల్లీ: భారత్లో కరోనా వ్యాప్తి నానాటికీ ఆందోళనకరంగా మారుతోంది. ఈ నెలలో మొదటి పదిరోజుల్లోనే (నిన్నటిదాకా) 8 లక్షల కేసులు వచ్చాయంటే దేశంలో మహమ్మారి ఎంతలా విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లోనూ కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 96,551గా నమోదైంది. తాజా కేసులతో దేశంలో ఈ […]