ఏపీ, తెలంగాణలో ధరలు పెంచిన డీలర్లు సామాజిక సారథి, హైదరాబాద్ : ఇప్పటికే నిత్యావసరల ధరలు, కూరగాయల ధరలు, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరల పెంపుతో అల్లాడిపోతున్న సామాన్యులకు మరో షాక్ తగిలింది. ఏపీ, తెలంగాణలో సిమెంట్ బస్తాల ధరలు పెరిగాయి. 50 కిలోల బస్తాపై ధరను రూ.20 –30 మేర పెంచుతున్నట్లు డీలర్లు పేర్కొన్నారు. డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో వీటి ధర పెంచినట్లు చెప్పారు. ధరల పెంపుతో సిమెంట్ బస్తా ధర రూ.300–350 మధ్యలో […]
మధు స్థానంలో కొత్త నేత ఎన్నిక విజయవాడ: ఆంధప్రదేశ్లో నిర్వహించిన సీపీఎం మహాసభల్లో ఏపీకి కొత్త కార్యదర్శిని ఎన్నుకున్నారు.. కొత్త కార్యదర్శిగా వి.శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. సీపీఎం ఏపీ రాష్ట్ర మహాసభలు ముగిశాయి. కార్యదర్శి పదవి కోసం శ్రీనివాసరావు, ఎంఏ గఫూర్ పేర్లను పరిశీలించిన కార్యదర్శివర్గం.. చివరకు శ్రీనివాసరావుకు పగ్గాలు అప్పజెప్పింది. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా 13 మందిని ఎంపికచేశారు. రాష్ట్ర కార్యదర్శివర్గంలో ఇద్దరికి ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు. 35 మందితో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఇప్పటివరకు […]
సినిమా టిక్కెట్లపై కమిటీ నిర్ణయం మేరకు ముందుకు సినీఎగ్జిబిటర్లతో భేటీలో మంత్రి పేర్ని నాని భేటీ అమరావతి: ఏపీలో సినిమా టికెట్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. సినిమా టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీని నియమిస్తూ మంగళవారం కీలక ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఈ కమిటీకి హోంశాఖ ముఖ్యకార్యదర్శి విశ్వజిత్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. దీనిలో సభ్యులుగా రెవెన్యూ, ఆర్థిక, పురపాలక ముఖ్య కార్యదర్శులు, […]
కార్తీక దీపోత్సవానికి వచ్చి గుండెపోటుతో హఠాన్మరణం సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం స్వామి సేవలో జీవితం అంకితం చేశారు: సుప్రీం సీజేసీ జస్టిస్ఎన్వీ రమణ తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. కార్తిక దీపోత్సవంలో పాల్గొనడానికి విశాఖపట్నం వెళ్లిన ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. సోమవారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రాగా, దవాఖానకు తరలించే లోపే ఆయన తుదిశ్వాస విడిచారు. డాలర్ శేషాద్రి 1978 నుంచి శ్రీవారి సేవలో పాల్గొంటున్నారు. […]
లంకలో అంతా రాక్షసులే ఉంటారని నిరూపించిన ఏపీ సీఎం జగన్ నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి ధ్వజం సారథి ప్రతినిధి, నాగర్కర్నూల్: లంకలో అంతా రాక్షసులే ఉంటారని ఏపీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి నిరూపించారని నాగర్కర్నూల్ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ పాలిట గాడ్సేగా మారాడని విమర్శించారు. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులతో పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు ఎడారిలా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతాంగం ఉసురు తగిలితే జగన్ ఇంటికి పోవడం ఖాయమన్నారు. శనివారం ఆయన […]
అమరావతి: ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. రెవెన్యూ డివిజన్ల వారీగా నాలుగు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ను విడుదల చేసింది. గతంలో చేసిన ప్రకటనను రీ షెడ్యూల్ చేసింది. గత షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5,9,13,17వ తేదీల్లో ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. తాజాగా మార్పులు చేస్తూ ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పోలింగ్నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇక మొదటి దశ ఎన్నికలకు సంబంధించి జనవరి 29 నుంచి, […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రూ.1.8 కోట్ల వ్యయంతో నిర్మించిన సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సోమవారం ప్రారంభించారు. రెండు అంతస్తుల్లో నిర్మించిన భవనంలో వసతులు బాగున్నాయని కితాబిచ్చారు. సత్వర సేవలు అందించి జిల్లాలోనే నంబర్వన్ట్రెజరీగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో 76 సబ్ ట్రెజరీ భవనాలకు ఒకేసారి నిర్మాణ అనుమతులు వస్తే నరసన్నపేటలో భవనం మొదటిసారిగా ప్రారంభానికి నోచుకోవడం గొప్ప విషయమని అన్నారు. అంతకుముందు ఆయన పూజలు చేశారు. […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కు మరో ప్రతిష్టాత్మక వాహనాల తయారీ యూనిట్ రానుంది. ప్రముఖ స్పోర్ట్స్ వెహికల్ బ్రాండ్ లంబోర్గిని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ను రాష్ట్రంలో ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చింది. గోల్ఫ్, ఇతర క్రీడల్లో వినియోగించే ప్రీమియం బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి పుణెకు చెందిన కైనటిక్ గ్రీన్ సంస్థ ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో సుమారు రూ.1,750 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్, బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లు, చార్జింగ్ స్వాపింగ్, […]