కనీసం గుజరాత్ నేతల మాటలనైనా వినండి కేంద్రానికి మంత్రి కేటీఆర్వినతి సామాజికసారథి, హైదరాబాద్: చేనేతపై జీఎస్టీ పెంపును మంత్రి కె.తారక రామారావు మరోసారి తనదైనశైలిలో స్పందించారు. ఇది వస్త్ర పరిశ్రమకు మరణశాసనమే అవుతుందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు. చేనేతపై జీఎస్టీ విషయంలో తమ విన్నపాన్ని పట్టించుకోకపోయినా కనీసం గుజరాత్ వాణి అయినా వినాలని పీయూష్ గోయల్ను కోరారు. కేంద్ర టెక్స్టైల్ శాఖ సహాయ మంత్రి దర్శనాజర్దోష్తో పాటు గుజరాత్ […]
రాష్ట్రాన్ని కలవరపెడుతున్న ఆత్మహత్యలు సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి లేఖ సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలతో మరణమృదంగం మోగుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పేర్కొన్నారు. వరి, మిర్చి రైతుల ఆత్మహత్యలు కలచివేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. తామర పురుగు తెగులుతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారని వివరించారు. పంటను నష్టపోవడంతో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారని తెలిపారు. రైతుల ప్రాణాలంటే కేసీఆర్ ప్రభుత్వానికి గడ్డిపోచతో సమానంగా […]
నమత్ర సోదరి శిల్పా శిరోద్కర్కు కొవిడ్ బాహుబలి నోరా ఫతేహికి కూడా పాజిటివ్ సామాజికసారథి, హైదరాబాద్: కరోనా మరోసారి విజృభిస్తుంది. బాలీవుడ్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరసకు కరోనా బారిన పడుతున్నారు. నిన్నటికి నిన్న బోనీ కపూర్ ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో బాలీవుడ్ భామకు కరోనా పాజిటివ్ అని తేలింది. మొన్నటివరకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆనందించే లోపు కేసులు […]
గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం ప్రజాకవికి కేంద్రసాహిత్య పురస్కారం సామాజికసారథి, హైదరాబాద్: ప్రముఖ ప్రజాకవి, తెలంగాణ వాగ్గేయకారుడు, జానపద గాయకుడు, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నకు అత్యున్నత పురస్కారం వరించింది. వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటించారు. ‘వల్లంకి తాళం’ కవితా గేయరచనకు ఈ అవార్డు ఇచ్చారు. 2021 సంవత్సరానికి గానూ కవిత్వవిభాగంలో వెంకన్నకు కేంద్రసాహిత్య అవార్డు లభించింది. ఈ అవార్డు కింద ఆయనకు ప్రశంసాపత్రంతో పాటు రూ.లక్ష నగదు అందజేస్తారు. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతిఏటా […]
న్యూ ఇయర్వేడుకలపై ఆంక్షలు కరోనా నేపథ్యంలో కఠిన నిబంధనలు డీజీపీ మహేందర్ రెడ్డి కీలక ఆదేశాలు సామాజికసారథి, హైదరాబాద్: న్యూ ఇయర్ నేపథ్యంలో ఆంక్షలు అమల్లో ఉంటాయని డీజీపీ మహేందర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీచేశారు. కొవిడ్ నియంత్రణలో భాగంగా ర్యాలీలు, సభలు జనవరి 2వ తేదీ వరకు నిషేధిస్తూ రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్న ఆయన.. కొవిడ్ ప్రొటోకాల్స్ పాటించేలా ఈ ఆదేశాలు అమలు చేయాలని […]
వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి డెల్టా కంటే 6 రెట్లు వేగంగా వచ్చే రెండు వారాలు అత్యంత కీలకం మాస్క్ మన జేబులో ఉండాల్సిందే హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సామాజికసారథి, హైదరాబాద్: ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని అనుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. […]
సామాజికసారథి, నాగర్కర్నూల్: పెద్దముద్దునూర్ గ్రామంలో నిర్మించి వదిలేసిన డబుల్ బెడ్ రూమ్ఇళ్లు, బస్టాండ్ను తక్షణమే ప్రారంభించాలని బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ఏడాదిలో నిర్మించినప్పుడు.. పేద ప్రజలకు ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎందుకు పూర్తిచేయలేరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం ఆయన బీఎస్పీ నాయకులతో కలిసి గ్రామంలో పర్యటించారు. గ్రామంలో ఎమ్మెల్యే వర్గం, ఎమ్మెల్సీ వర్గం అని అమాయక జనాలను ఇబ్బంది పెడుతున్నారని ఆక్షేపించారు. సర్పంచ్, […]
మధు స్థానంలో కొత్త నేత ఎన్నిక విజయవాడ: ఆంధప్రదేశ్లో నిర్వహించిన సీపీఎం మహాసభల్లో ఏపీకి కొత్త కార్యదర్శిని ఎన్నుకున్నారు.. కొత్త కార్యదర్శిగా వి.శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. సీపీఎం ఏపీ రాష్ట్ర మహాసభలు ముగిశాయి. కార్యదర్శి పదవి కోసం శ్రీనివాసరావు, ఎంఏ గఫూర్ పేర్లను పరిశీలించిన కార్యదర్శివర్గం.. చివరకు శ్రీనివాసరావుకు పగ్గాలు అప్పజెప్పింది. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా 13 మందిని ఎంపికచేశారు. రాష్ట్ర కార్యదర్శివర్గంలో ఇద్దరికి ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు. 35 మందితో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఇప్పటివరకు […]