Top News
.. ఆస్పత్రి ఆవరణలో నిద్రిస్తున్న బాలికపట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. .. రోగుల బంధువులు ప్రతికటించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత సామాజిక సారథి, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. తన తల్లి ప్రసవం కోసం వస్తే వెంట వచ్చిన బాలిక నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి అగంతకుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకోగా శనివారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలకపల్లి […]
సామాజికసారథి, బిజినేపల్లి: సమ్మర్ వచ్చిందంటే చాలు ఆ నలుగురు వాలిపోతున్నారు. విహార యాత్రల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు. బిజినేపల్లి మండలంలో ఓ నలుగురు విలేకర్ల తీరు చర్చనీయాంశంగా మారింది. వృత్తికే మచ్చ తెస్తున్నారని తోటి రిపోర్టర్లు.. తమను పట్టిపీడిస్తున్నారని అధికారులు గుర్రమంటున్నారు. సమ్మర్ వెకేషన్ వచ్చిందంటే సాధారణంగా విహారయాత్రలకు ప్లాన్ చేయడం తెలిసిందే. బిజినేపల్లి మండలంలో కొందరు టూర్ల పేరుతో వసూళ్లకు పాల్పడటం విమర్శలకు దారితీస్తోంది. అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి రాబట్టారు. ఇవ్వకపోతే బెదిరింపులకు కూడా […]
సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో: ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగియడంతో అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారిస్తుండగా భారత రాష్ట్ర సమితి ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు అతని సోషల్ మీడియా విభాగం భారతీయ జనతా పార్టీ పైన సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం ప్రారంభించడంతో దీనిపై భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ కు ఫిర్యాదు […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల సమరానికి తెలంగాణ రాష్ట్రంలో నేటితో ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. నాలుగో విడతలో భాగంగా సోమవారం తెలంగాణ రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలలో పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి నేటి సాయంత్రంతో ప్రచార గడువు ముగుస్తుండటంతో అభ్యర్థులు పోల్ మేనేజ్ మెంట్ పైన దృష్టిపెట్టనున్నారు. దీనికి ఆదివారం ఒక్కరోజు కీలక కావడంతో ఏయే నియోజకవర్గాల్లో ఏ వ్యూహాలను అనుసరించాలి, ఎక్కడెక్కడ తమకు అనుకూలంగా లేని పరిస్థితులను మార్చుకోవాలన్న దానిపై దృష్టిసారించారు. […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: గ్యారెంటీలు కాదు.. గారడీ మాటలు, 420 హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డిని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన బిజినేపల్లితో పాటు తిమ్మాజిపేటలో రోడ్ షో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రసంగించారు. కేసీఆర్ అమలుచేసిన పథకాలే తప్ప.. […]
సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శానాయిపల్లి తండా పరిసర అటవీ ప్రాంతంలో గత కొద్దిరోజులుగా పులి.. రైతులు, గ్రామస్తులను భయపెడుతోంది. రాత్రివేళ ఈ అటవీమృగం గాండ్రింపులతో హడలిపోతున్నారు. తాజాగా బిజినేపల్లి మండలంలోని శానాయిపల్లితండాకు చెందిన వాల్యానాయక్ అనే రైతుకు చెందిన పశువులపై పులి దాడిచేసి ఆవు దూడను చంపేసింది. కాగా, కొద్దిరోజులుగా రాత్రిపూట పులి గాండ్రింపులు వినిపిస్తున్నాయని చెబుతున్నారు. సమీప రైతుల పొలాల్లో ఇటీవల పులి జాడలను కూడా గుర్తించినట్లు చెబుతున్నారు. బోరుబావుల […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: 1రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అనడానికి ప్రత్యక్ష సాక్షంగా నిలువబోతున్నారు ఓ మాజీ ఎమ్మెల్యే. వరుస విజయాలతో ఇన్నాళ్లూ అధికారం అనుభవించిన సదరు మాజీ ఎమ్మెల్యే గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఘనవిజయం సాధించారు. అయితే గెలిచిన ఎమ్మెల్యే, జిల్లాకు చెందిన మంత్రి మీ ఓటమి కోసం పనిచేస్తున్నారని ఆరోపణలు చేస్తూ ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థికి తాను సాయం చేస్తానంటూ […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవిపై కేడర్ లో అసహనం వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గ్రామాల్లో తిరగనీయకుండా కార్యకర్తలపై దాడిచేసి వాళ్లను తిరిగి మళ్లీ ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం పట్ల పలు నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. ఇలా చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగే కంటే కీడు ఎక్కువగా జరుగుతుందని, పార్టీ […]