సామాజిక సారథి, వరంగల్: మార్కెట్ లో పత్తి ధరలు మూడు రోజులుగా పెరిగిపోతుండటంతో రైతులు అనందం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్ లో పత్తి ధర క్వింటాలుకు ఈనెల 28న రూ.8,715 ధర నోమోదై, మార్కెట్ చరిత్రలో అత్యధిక రికార్డు నమోదు చేసింది. కాగా, బుధవారం పత్తి క్వింటాల్ కు రూ. 8,800లకు చేరుకుని, పాత రికార్డును బ్రేక్ చేసింది. మరోవైపు ఖమ్మం మార్కెట్ లో పత్తి ధర 9వేలు పలకింది. వరంగల్ ఎనుమాముల […]
ఇచ్చిన హామీ మేరకు రైతులకు నగదు సీఎం కేసీఆర్చిత్రపటానికి మంత్రి గంగుల క్షీరాభిషేకం సామాజిక సారథి, కరీంనగర్: రైతులకు ఇచ్చిన మాట తప్పని సీఎం కేసీఆర్ తప్పలేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రైతుల కోసం ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. రైతుబంధు నిధులను ప్రభుత్వం విడుదల చేసిన సందర్భంగా బుధవారం కరీంనగర్ లోని గోపాలపూర్లో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వ రాబడులు తగ్గి ఇబ్బంది ఏర్పడినా.. ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదని […]
చోరీ నెపంతో బంధించి.. కాళ్లపై కొడుతూ యూపీలోని అమేథిలో అమానవీయ ఘటన స్పందించిన కేంద్రమంత్రి స్మృతిఇరానీ యోగి ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్ లక్నో: ఉత్తరప్రదేశ్లోని అమేథిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చోరీ నెపంతో ఓ దళిత బాలికను కొందరు చిత్రహింసలకు గురిచేశారు. ఆ అభాగ్యురాలిపై ఇష్టమొచ్చినట్లు దాడిచేశారు. మొత్తుకున్న వదిలిపెట్టలేదు. దొంగతనం ఎందుకు చేశావంటూ ఇంట్లో నేలపై పడుకోబెట్టి కాళ్లను ఓ కర్రపై అదిమిపట్టి మరోకర్రతో కొడుతూ అత్యంత కఠినంగా వ్యవహరించారు. నొప్పితో ఆ బాలిక విలవిల్లాడుతూ […]
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: గిరి వికాసం పథకం కింద చిన్న, సన్నకారు ఎస్టీ రైతులకు ఉచితంగా బోరు బావి తవ్వించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎస్టీ చిన్న, సన్నకారు రైతులు ఒకరికన్నా ఎక్కువమంది కలసి కనీసం 5 ఎకరాల భూమిని ఒకేచోట కలిగి ఒక యూనిట్ గా ఏర్పడి దరఖాస్తు చేసుకుంటే గిరివికాసం పథకంకింద ఉచితంగా బోర్ […]
బయోలాజికల్ సంస్థకు మంత్రి కేటీఆర్ అభినందనలు సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణ నుంచి మరో కోవిడ్ టీకా మార్కెట్లోకి రావడంపై మంత్రి కె.తారక రామారావు హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాను విడుదల చేయగా, తాజాగా తెంగాణకు చెందిన ‘బయలాజికల్ ఈ’ కంపెనీ’ కార్బివాక్స్’ అనే కోవిడ్ టీకాను త్వరలోనే విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ‘బయలాజికల్ ఈ’ కంపెనీ సీఈవో మహిమ దాట్ల, ఆమె బృందానికి మంత్రి అభినందనలు తెలిపారు. ఈ […]
న్యూఇయర్ వేడుకలపై పోలీస్ ఆంక్షలు స్థానికులకు ఇబ్బంది కలిగించినా చర్యలు తాగి రోడ్లపై హంగామా చేస్తే కటకటాలే హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరిక సామాజికసారథి, హైదరాబాద్: డిసెంబర్ 31 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైన్ షాపులు, పబ్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇస్తే.. మరోవైపు హైదరాబాద్ పోలీసులు మాత్రం న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ పోలీస్ కొత్త బాస్ సీవీ ఆనంద్ ఒక ప్రకటన […]
రాత్రి 8గంటల కల్లా డ్యూటీ విరిమించేలా సజ్జనార్ఆదేశాలు సామాజిక సారథి, హైదరాబాద్: మహిళా కండక్టర్లు రాత్రి 8 గంటలకల్లా తమ డిపోలకు చేరేలా డ్యూటీలు వేయాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని పేర్కొన్నారు. ఆర్టీసీలో సుదీర్ఘ సమ్మె ముగిసిన తర్వాత 2019 డిసెంబర్1వ తేదీన అన్నిస్థాయిల ఉద్యోగులతో సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో డ్యూటీ సమయాలు ఇబ్బందికరంగా ఉన్నాయని పలువురు మహిళా కండక్టర్లు ఫిర్యాదు చేశారు. రాత్రి […]
ఖార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు రాంచి: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగినవేళ జార్ఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. పెట్రోల్, డీజిల్ ధరలు వంద దాటిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. పెట్రోల్ పై రూ.ఐదు, డీజిల్ పై రూ.10 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. కేంద్రం తగ్గించిన ధరలకు అనుగుణంగా అనేక రాష్ట్రాలు కూడా పెట్రోల్ […]