Breaking News

Month: November 2020

మరికొద్ది గంటల్లో జీహెచ్ఎంసీ పోలింగ్​

మరికొద్ది గంటల్లో జీహెచ్ఎంసీ పోలింగ్​

సారథి న్యూస్​, హైదరాబాద్‌: గ్రేటర్​ ఎన్నికల్లో మరో కీలకమైన ఘట్టం మరికొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. షెడ్యూల్​లో భాగంగా డిసెంబర్​1న పోలింగ్ ​జరగనుంది. 4న ఫలితాలను వెల్లడించనున్నారు. అయితే నేతల వాగ్దానాలు, హామీలు, వాడీవేడి విమర్శల మధ్య ప్రచారం పర్వం ఆదివారం సాయంత్రం నాటికే ముగిసింది. సిటీలోని మొత్తం 15‌‌0 డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ 84, సైబరాబాద్ 38, రాచకొండ పరిధిలో 28, హైదరాబాద్ సిటీలో 4,979 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉదయం […]

Read More
 ఏడుపాయలలో వైభవంగా లక్ష దీపోత్సవం

ఏడుపాయలలో వైభవంగా లక్ష దీపోత్సవం

సారథి న్యూస్, ఏడుపాయల(మెదక్): భక్తుల కొంగుబంగారంగా విలసిల్లిన ఏడుపాయల వన దుర్గాభవాని మాత సన్నిధిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం సాయంత్రం లక్షదీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే దుర్గ భవాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం పల్లకీసేవలో పాల్గొన్నారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి తెప్పోత్సవం నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని లక్ష దీపోత్సవం కార్యక్రమంలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని దీపాలను వెలిగించి […]

Read More
ఆలయాల్లో కార్తీక పౌర్ణమి పూజలు

ఆలయాల్లో కార్తీక పౌర్ణమి సందడి

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: జిల్లావ్యాప్తంగా సోమవారం కార్తీకమాస పౌర్ణమి సందర్భంగా భక్తులు పలు ఆలయాల్లో విశేషపూజలు జరిపించారు. వత్రాలు, నోములు ఆచరించారు. దీపారాధన, దీపదానం, ఆకాశ దిపోత్సవం, అర్చనలు, అభిషేకాలు వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రంలోని రామాలయంలోశ్రీ రామసహిత వెంకట సత్యనారాయణస్వామి వ్రతాలు చేశారు. జిల్లా కేంద్రంలోని సీతారామస్వామి ఆలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ప్రాత:కాలంలోనే పరమశివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు, ఆలయంలో దీపారాధనను శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన […]

Read More
పుష్కరస్నానం.. పుణ్యఫలం

పుష్కరస్నానం.. పుణ్యఫలం

సారథి న్యూస్, మానవపాడు: తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉమ్మడి మండలంలోని పుల్లూరు పుష్కర ఘాట్ భక్తుల తాకిడితో పులకరించింది. పుష్కరాలు ఆదివారానికి పదిరోజులు కావడంతో భక్తుల తాకిడి ఎక్కువైంది. ఓ వైపు తుఫాన్.. మరోవైపు కరోనా ప్రభావం ఉన్నప్పటికీ భక్తులు అన్ని జాగ్రత్తులు తీసుకుంటూ పుణ్యస్నానాలు ఆచరించారు. పుల్లూరులో ఉన్న శివాలయం, కాలభైరవుడు సూర్యనారాయణ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి దర్శనం చేసుకున్నారు.పుల్లూరు సర్పంచ్ నారాయణమ్మ తన కుటుంబసభ్యులతో ఆదివారం పుష్కర […]

Read More
నయా హైదరాబాద్ ను నిర్మిద్దాం

నయా హైదరాబాద్ ను నిర్మిద్దాం

సారథి న్యూస్, హైదరాబాద్: బీజేపీకి ఒక్కసారి అవకాశమిస్తే హైదరాబాద్ ను ఐటీ హబ్ గా అభివృద్ధి చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా ప్రకటించారు. సిటీలో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేస్తామన్నారు. ‘నిజాం సంస్కృతిని వదిలి.. నయా హైదరాబాద్ ను నిర్మిద్దాం.. కుటుంబ పాలన నుంచి ప్రజాస్వామ్యం వైపు వెళ్దాం.. అవినీతి నుంచి పారదర్శక పాలన తీసుకొద్దాం.. సంతుష్టీకరణ నుంచి సమష్టి అభివృద్ధి వైపు పయనిద్దాం..’ అని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజు ఆదివారం […]

Read More
చివరి రోజు.. హోరాహోరీ

చివరి రోజు.. హోరాహోరీ

సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్(జీహెచ్​ఎంసీ) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చివరిరోజు హోరాహోరీగా ప్రచారం సాగింది. ప్రధాన రాజకీయ పార్టీల నేతలంతా సుడిగాలి పర్యటన చేశారు. అందులో భాగంగానే రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జుమ్మేరాత్ బజార్, సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని పాటిగడ్డ చౌరస్తా, అలాగే సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని శాంతినగర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగించారు. టీఆర్ఎస్​ప్రభుత్వం ఈ ఆరేళ్లలో […]

Read More
పరుగుల వరద.. ఆసీస్​దే సీరిస్​

పరుగుల వరద.. ఆసీస్​దే సీరిస్​

సిడ్నీ: ఆసీస్ తో జరుగుతున్న మూడు వన్డేల సీరిస్​లో భాగంగా రెండో వన్డేలోనూ పరుగుల వరద పారింది. కంగారులను నిలువరించలేని టీమిండియా సిరీస్​ను చేజార్చుకుంది. ఆసీస్​51 పరుగుల తేడా ఘనవిజయం సాధించింది. మ్యాచ్​మిగిలి ఉండగానే 2‌‌‌‌‌‌–0 తేడాతో సిరీస్​ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్​ఎంచుకున్న ఆసీస్​నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 389 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్​బ్యాట్స్​మెన్లలో వార్నర్‌(83; 77 బంతుల్లో 4×7, 6×3), ఇరోన్​ఫించ్‌(60; 69 బంతుల్లో 4×6, […]

Read More
రూ.1300 కోట్లు అడిగితే 13 పైసల్​ఇవ్వలేదు

రూ.1300 కోట్లు అడిగితే 13 పైసల్​ ఇవ్వలేదు

తలమాసినోడితో ఏదీ కాదు ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైలును విస్తరిస్తాం వరద సాయం ఇచ్చేకాడ కిరికిరి ఏంది? యుద్ధ ప్రాతిపదికన మూసీ ప్రక్షాళన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారసభలో సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్, హైదరాబాద్: ప్రతి బడ్జెట్‌లో హైదరాబాద్‌కు రూ.10వేల కోట్లు కేటాయిస్తామని సీఎం కె.చంద్రశేఖర్​రావు అన్నారు. వరదల నుంచి హైదరాబాద్‌ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. చేతులు ఊపినంత మాత్రాన సమస్య పోదన్నారు. ప్రధానమంత్రిని వరదసాయం కింద రూ.1300 కోట్లు అడిగితే 13 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. బెంగళూరు, […]

Read More