సిడ్నీ: ఆసీస్ తో జరుగుతున్న మూడు వన్డేల సీరిస్లో భాగంగా రెండో వన్డేలోనూ పరుగుల వరద పారింది. కంగారులను నిలువరించలేని టీమిండియా సిరీస్ను చేజార్చుకుంది. ఆసీస్51 పరుగుల తేడా ఘనవిజయం సాధించింది. మ్యాచ్మిగిలి ఉండగానే 2–0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ఎంచుకున్న ఆసీస్నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 389 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్బ్యాట్స్మెన్లలో వార్నర్(83; 77 బంతుల్లో 4×7, 6×3), ఇరోన్ఫించ్(60; 69 బంతుల్లో 4×6, 6×1), స్టీవ్ స్మిత్(104; 64 బంతుల్లో 4×14, 6×2), లబూషేన్(70; 61 బంతుల్లో 4×5), మ్యాక్స్వెల్( 63; 29 బంతుల్లో 4×4, 6×4) మెరుపులు మెరిపించడంతో ఆసీస్ రికార్డు స్థాయి స్కోరును చేయగలిగింది. వార్నర్-ఫించ్ తొలి వికెట్ నష్టానికి 142 పరుగుల చక్కటి భాగస్వామ్యం అందించారు.
ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 338 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా ఆటగాళ్లు చివరి దాకా పోరాడినా భారీ లక్ష్యం కావడంతో ఓటమి తప్పలేదు. ఓపెనర్లు శిఖర్ ధావన్(30; 23 బంతుల్లో 4×5), మయాంక్ అగర్వాల్(28; 26 బంతుల్లో 4×4) మంచి శుభారంభం అందించారు. ఆ తరువాత వచ్చిన విరాట్ కోహ్లి(89 ; 87 బంతుల్లో 4×7, 6×2), శ్రేయస్ అయ్యర్(38; 36 బంతుల్లో 4×5) జట్టు స్కోరును పరుగెత్తించారు. ఆ తర్వాత కోహ్లి– కేఎల్ రాహుల్ ధాటిగా బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నారు. ఇంతలో కోహ్లి ఔట్కాగా, హార్దిక్ పాండ్యాతో కలిసి కేఎల్ రాహుల్ ( 76; 66 బంతుల్లో 4×4, 6×5) సొగసైన షాట్లు ఆడుతూ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన జడేజా(24), హార్దిక్ పాండ్యా(28), షమీ, సైనీ, బుమ్రా ఎంతోసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 338 పరుగులు మాత్రమే చేయగలిగి ఓటమి పాలైంది.