బిగ్బాస్ హౌస్లో గంగవ్వను టార్గెట్ చేశారా? ఓట్లతో గంగవ్వను ఢీకొట్టలేమని భావించిన ఇతర కంటెంటెస్టులు ఆమెను ఎలాగైనా బయటకు పంపించాలని కుట్రలు చేస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. ప్రస్తుతం గంగవ్వకు పడుతున్న ఓట్లు చూస్తే ఆమె టైటిల్ గెలుచుకోవడం ఖాయం. ఈ విషయాన్ని పసిగట్టిన హౌస్లోని ఇతర సభ్యులు గంగవ్వను ఒంటరిని చేసి ఆమెతో ఎవరూ మాట్లాడకపోతే గంగవ్వు బోర్కొట్టి వెళ్లిపోతుందిన భావిస్తున్నారట. గంగవ్వను ఒంటరి చేస్తే.. సంపూర్ణేష్ బాబు వెళ్లిపోయినట్టు గంగవ్వ కూడా వెళ్లిపోతుందని […]
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వ్యవసాయ రంగాల సంస్కరణ బిల్లుకు పార్లమెంట్లో చుక్కెదురైంది. ఈ బిల్లును ఇప్పటికే విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే తాజాగా ఎన్డీఏ భాగస్వామ్యపక్షమైన శిరోమణి అకాళిదళ్కూడా ఈ బిల్లను వ్యతిరేకింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలంటూ తమ పార్టీ ఎంపీలకు విప్ జారీచేసింది. కాగా వ్యవసాయాన్నికొర్పొరేటీకరణ చేసేందుకు మోదీ సర్కార్ మూడు ఆర్డనెన్స్లన ఇటీవల తీసుకొచ్చింది. నిత్యావసర సరుకులపై ఓ ఆర్డినెన్స్, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే ఉద్దేశంతో మరో ఆర్డినెన్స్, వ్యవసాయ […]
సారథి న్యూస్, అచ్చంపేట: భారీవర్షాలకు నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట సమీపంలోని డిండి వాగు ఉధృతిలో చిక్కుకుపోయిన భార్యాభార్తలు సురక్షితంగా బయటపడ్డారు. అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన సభావత్ వెంకట్రాములు, విజయ దంపతులు వ్యవసాయ పొలం పనులకు వెళ్లారు. వాగు ఉధృతి పెరగడంతో బుధవారం సాయంత్రం నీటిలో కొట్టుకుపోయి.. చెట్లను పట్టుకుని ఒడ్డుకు చేరారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్గువ్వల బాలరాజు సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్కుమార్తో మాట్లాడి హెలిక్యాప్టర్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలని […]
శ్రీశైలం: జూరాల రిజర్వాయర్ నుంచి వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. డ్యాం నిండుకుండలా మారడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గురువారం 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ఫ్లో 2,22,221 క్యూసెక్కులు ఉంది. ఔట్ఫ్లో 3,50,422 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 885 అడుగుల మేర ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి పెరుగుతోంది. వెయ్యి మందిని బలితీసుకుంది. ఈ క్రమంలో గురువారం రాష్ట్రంలో (24 గంటల్లో) 2,159 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి బారినపడి తాజాగా 9 మంది మృతిచెందారు. ఇలా ఇప్పటివరకు రాష్ట్రంలో 1,005 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,65,003కు చేరింది. తాజాగా వ్యాధి నుంచి 2,108 మంది కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,33,555కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,443 యాక్టివ్కేసులు […]
అనుమతులు లేకుండా సినిమా షూటింగ్ చేస్తుండటంతో తెలుగు సినీహీరో అల్లూ అర్జున్పై ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పీఎస్లో కేసు నమోదైంది. కరోనా నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం సందర్శనను రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే అల్లూ అర్జున్, పుష్ప చిత్ర యూనిట్ కుంటాల జలపాతాన్ని సందర్శించడమే కాక అక్కడికి సమీపంలోని తిప్పేశ్వర్ అటవీప్రాంతంలో షూటింగ్ చేశారు. దీంతో సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్, పుష్ప సినిమా […]