ఆ పొలంలోకి రామంటున్న కూలీలు కూలీలు రాకపోవడంతో రైతుల్లో ఆందోళన విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని స్థానిక రైతుల ఆరోపన సామాజిక సారథి, కౌడిపల్లి: పంట పొలంలో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయని వాటిని సరిచేయాలని పలుమార్లు సంబంధిత విద్యుత్ సిబ్బందికి చెప్పినా పట్టించుకున్న పాపానపోలేదని స్థానిక రైతులు వాపోతున్నారు. కౌడిపల్లి సమీపంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ వెనకాల ధర్మసాగర్ కట్ట వద్దనున్న 33/11 కెవి విద్యుత్ స్తంభాలు పంట పొలంలో వంగి ఉన్నాయని రైతులు […]
చివరగా తీసిన వీడియో పరిశీలను పంపిన అధికారులు చెన్నై: తమిళనాడు నీలగిరి జిల్లా కూనూర్ అటవీ ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. ఈ నెల8న జరిగిన ఘటనలో తొలి సీడీఎస్ బిపిన్ రావత్ సహా మరో 13మంది మృతి చెందిన ఈ ఘటనకు సంబంధించిన వైరల్ గా మారిన వీడియో ఇప్పుడు కీలకంగా మారింది. కోయంబత్తూర్ కు చెందిన జో అనే వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ డిసెంబర్ 8న స్నేహితుడు నాజర్ అతని కుటుంబసభ్యులతో […]
గంగానదిలో కలిపి కుమార్తెలు క్రితిక, తరిణి హరిద్వార్: హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దంపతుల చితాభస్మాన్ని వారి కుమార్తెలు క్రితిక, తరిణి గంగానదిలో నిమజ్జనం చేశారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ పుణ్యక్షేత్రం వద్ద శ్రద్ధకర్మలు నిర్వహించి చితాభస్మాన్ని నదిలో కలిపారు. కుమార్తెలు ఇద్దరు కూడా తమ తల్లిదండ్రుల చితాభస్మాలు ఉంచిన పాత్రలను పూలతో నింపి విడివిడిగా నీళ్లలో జారవిడిచారు. జనరల్ బిపిన్ రావత్ దంపతులు తమిళనాడులోని కూనూరు వద్ద […]
సామాజిక సారథి, నార్కెట్ పల్లి: ముందు వెళుతున్న లారీని డీసీఎం ఢీకొట్టడంతో, క్యాబిన్లో ఇరుక్కుని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కట్ పల్లిలో సోమవారం రాత్రి జరిగింది. నెల్లూరు జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందిన చుండి హర్షవర్ధన్ రెడ్డి(30) సూర్యాపేట నుంచి హైదరాబాద్ కు డీసీఎంలో ప్రయాణిస్తున్నాడు. నార్కెట్ పల్లి గ్రామ శివారులోని నల్లగొండ ఫ్లై ఓవర్ దగ్గరకు రాగానే అతివేగం, డ్రైవర్ అజాగ్రత్తతో ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. […]
వేటపాలెం : ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో బైక్ను తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు. స్థానికుల, పోలీసుల కథనం ప్రకారం కర్నూలు నుంచి చీరాలకు వేటపాలెం మండలం అక్కాయి పాలెం జాతీయరహదారి ప్తె వస్తున్న కారు ముందుగా వెళ్తున్న బైక్ను తప్పించుకోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. ప్రమాదం లో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి..ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు […]
సారథిన్యూస్, గోదావరిఖని: సెల్ఫీ సరదా ఓ విద్యార్థి ప్రాణం తీసింది. గోదావరిఖనికి చెందిన యశ్వంత్(22) ఓ కళాశాలలో పాల్టెక్నిక్ డిప్లమో చదువుతున్నాడు. సోమవారం సరదాగా పెద్దపల్లి జిల్లాలోని సబ్బితం జలపాతం వద్దకు వెళ్లాడు. అక్కడ సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.