సారథి న్యూస్, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీవర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది.గత శుక్రవారం నేరేడ్మెడ్లోని నాలాలో కొట్టుకుపోయి సుమేధ(12) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే సరూర్నగర్లో మరో దారుణం చోటుచేసుకుంది. డ్యూటీ ముగించుకుని బైక్పై ఇంటికొస్తున్న ఓ వ్యక్తి సరూర్నగర్ చెరువులో కొట్టుకుపోయాడు. అతడి కోసం ఎన్డీఆర్ఎఫ్ బలగాలు గాలిస్తున్నాయి. అల్మాస్గూడకు చెందిన నవీన్కుమార్(45) నవీన్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. డ్యూటీ ముగించుకుని సరూర్నగర్ నుంచి తపోవన్ కాలనీ వైపు స్కూటీపై వెళ్తుండగా […]
సారథిన్యూస్ రామగుండం: ‘ప్రపంచం మొత్తం గాలించి చూసినా కేసీఆర్ లాంటి రాజకీయనేత మనకు కనిపించరు. ఆయన పనితీరు నెవ్వర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్! అన్నట్టుగా కొనసాగుతున్నది. తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా’ అంటూ రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందన పల్లి వద్ద జిల్లా గొర్రెల, మేకల మార్కెట్ కు భూమి పూజ చేశారు. అనంతరం గోదావరిఖనిలోని సమ్మక్క సారక్క గద్దెల సమీపంలో […]
సారథి న్యూస్, హైదరాబాద్: కుండపోత వర్షాలకు తెలంగాణ తడిసి ముద్దవుతోంది. భారీవర్షాలు, వరదలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. వాగులు వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. అయితే మరో రెండు మూడు రోజులపాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీఎం కె.చంద్రశేఖర్ రావుతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కుమార్ భేటీ అయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్, […]
సారథి న్యూస్, ఆసిఫాబాద్: తెలంగాణలోకి మావోయిస్టుల వచ్చారని, తమ కార్యకలాపాలు సాగించారని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ అడవుల్లో డీజీపీ మహేందర్రెడ్డి పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే తాజాగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కదంబా అడవుల్లో కాల్పుల మోత మోగింది. పోలీసులు, మావోయిస్టులు నేరుగా తలపడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు పోలీసులు తెలిపారు. ఆసిఫాబాద్ సమీపంలోని చీలేటిగూడకు రెండు రోజుల క్రితం మంచిర్యాల , కుమ్రంభీం జిల్లాల డివిజన్ కమిటీ కార్యదర్శి మైలారపు […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం(24 గంటల్లో) కొత్తగా 2,137 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,71,306కు చేరింది. 2,192 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్అయ్యారు. ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 1,39,700కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 8 మంది మృత్యువాతపడ్డారు. మొత్తంగా వ్యాధి కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 1,033కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,573 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, శనివారం ఒక్కరోజే 53,811 […]
సారథి న్యూస్, రామడుగు: అందమైన అమ్మాయిల ఫొటోలు, ఆకర్షణీయమైన ప్రొఫైల్ పిక్స్తో కొందరు ఫేస్బక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తుంటారు. మరికొందరేమో పోలీస్ అధికారులు, సెలబ్రిటీల పేరుతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకుంటారు. అటువంటి వారికి మనం ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపినా.. మనకు వచ్చిన రిక్వెస్టులను యాక్సెప్ట్ చేసినా చిక్కుల పడడం ఖాయమని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఈ విషయంపై శనివారం కరీంనగర్ జిల్లా రామడుగు ఎస్సై అనూష మాట్లాడుతూ.. పోలీస్ అధికారి పేరుతో ఫేస్బుక్లో చాలా తప్పడు ఐడీలు […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులుగా పలు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, రంగారెడ్డి, వికారాబాద్జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో మరో మూడురోజల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీవర్షానికి హైదరాబాద్మహానగరం తడిసిముద్దయింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, కూకట్పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంపల్లి, ఎస్సార్ నగర్, అమీర్పేట, బేగంపేట, ఎంజే మార్కెట్, నాంపల్లి, ఆబిడ్స్, […]
కేంద్రం వ్యవసాయ బిల్లుతో రైతు లోకానికి తీవ్ర అన్యాయం రైతులను కొట్టి కార్పొరేట్లకు పంచేలా ఉంది పార్లమెంట్లో గట్టిగా నిలదీయాలని సూచించిన సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆక్షేపించారు. రైతులను దెబ్బతీసి కార్పొరేట్ వ్యాపారులకు లాభం కలిగించేలా ఉందని, ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావును ఆదేశించారు. రాజ్యసభలో […]