Breaking News

సరూర్​నగర్​ చెరువులో వ్యక్తి గల్లంతు

సరూర్​నగర్​ చెరువులో వ్యక్తి గల్లంతు

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఇటీవల కురిసిన భారీవర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది.గత శుక్రవారం నేరేడ్​మెడ్​లోని నాలాలో కొట్టుకుపోయి సుమేధ(12) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే సరూర్​నగర్​లో మరో దారుణం చోటుచేసుకుంది. డ్యూటీ ముగించుకుని బైక్​పై ఇంటికొస్తున్న ఓ వ్యక్తి సరూర్​నగర్​ చెరువులో కొట్టుకుపోయాడు. అతడి కోసం ఎన్డీఆర్​ఎఫ్​ బలగాలు గాలిస్తున్నాయి. అల్మాస్‌గూడకు చెందిన నవీన్‌కుమార్‌(45) నవీన్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. డ్యూటీ ముగించుకుని సరూర్‌నగర్ నుంచి తపోవన్ కాలనీ వైపు స్కూటీపై వెళ్తుండగా రోడ్డు పై బైక్ వరద నీటిలో బైక్​ కూరుకుపోయింది. ఈ క్రమంలో బైక్ ను నెడుతుండగా.. ప్రమాదవశాత్తు నీటి ఉధృతికి ఆ యువకుడు కొట్టుకుపోయాడు. ఈ ఘటన జరిగి 12 గంటలు గడుస్తున్నా నవీన్​ ఆచూకీ తెలియలేదు. డీఆర్ఎఫ్, ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు రంగంలోకి దిగి నవీన్ జాడ కోసం వెతుకుతున్నాయి.