హైదరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం ఏసీబీ అదుపులో ఉన్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ భూ వివాదంలో నాగరాజు రూ. కోటి పదిలక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అయితే నాగరాజు ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైలు గదిలో ఆయన ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు జైలు అధికారులు తెలిపారు.
సారథి న్యూస్, రామాయంపేట: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంటలో చోటుచేసుకున్నది. కల్వకుంటకు చెందిన బుర్రని బాలమల్లు (45) రెండెకరాలు కౌలుకు తీసుకొని వరిసాగు చేశాడు. ఇందుకోసం కొంత అప్పుచేశాడు. అయితే ఇటీవల కరిసిన భారీ వర్షాలకు పంట మునిగిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెంది శనివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాలమల్లుకు భార్య ఇందిర తీవ్రంగా విలపిస్తున్నది. ఈ ఘటనపై కేసు […]
సారథి న్యూస్, రామడుగు: ‘చావు సమస్యకు పరిష్కారం కాదు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. డిప్రెషన్కు గురైనప్పుడు దగ్గరి వాళ్లతో మాట్లాడాలి. మనం జీవితంలో సాధించిన విజయాలను స్మరించుకోవాలి. అంతేకానీ చనిపోతే ఏ ప్రయోజనం ఉండదు. కొత్తజీవితాన్ని ప్రారంభించాలి. కొత్తగా ఆలోచించాలి. కొత్త దారిలో పయనించాలి. అప్పడే విజయం మన పాదలచెంతకు చేరుతుంది’ అని ప్రముఖ సైకాలజిస్ట్, తెలంగాణ సైకాలజిస్ట్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎజ్రా మల్లేశం సూచించారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా […]
సుశాంత్ రాజ్పుత్ కేసు దేశంలోనే పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొదటి నుంచి సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆమెను ఇప్పటికే ఎన్సీబీ అరెస్ట్ చేసింది. అయితే రియాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నట్టు సీబీఐ, ఎన్సీబీ విచారణలో తేలింది. దీంతో ఈ కేసులో పలు సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. బాలీవుడ్కు చెందిన అనేకమంది ప్రముఖులు డ్రగ్స్ తీసుకుంటున్నట్టు పోలీసులకు ఆధారాలు దొరికాయి. ఈ విషయంపై […]
‘మనసు మమత’, ‘మౌనరాగం’ తదితర సీరియల్స్లో నటించిన టీవీ నటి శ్రావణి మంగళవారం రాత్రి తన ఫ్లాట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. టిక్టాక్లో పరిచయమైన ఓ వ్యక్తి వేధింపులతోనే శ్రావణి బలవన్మరణానికి పాల్పడట్టు సమాచారం. శ్రావణి.. హైదరాబాద్ ఎస్ఆర్నగర్ పరిధిలోని మధురానగర్లో ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఆమె బాత్రూంలోకి వెళ్లింది.. ఎంతకూ తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యుల చూడగా.. బాత్రూంలో ఉరివేసుకుని విగతజీవిగా పడిఉంది. వారు వెంటనే యశోద దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యుల ధ్రువీకరించారు. శ్రావణికి కొంతకాలం […]
సారథి న్యూస్, రామగుండం: బాలిక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్లో శనివారం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
సారథిన్యూస్, హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లా.. ఖమ్మం రూరల్ మండలం… మంగళగూడెం గ్రామానికి చెందిన గోపీకృష్ణ (26)కు 2018లో భద్రాచలం సమీపంలోని చోడవరం గ్రామానికి చెందిన నందిని(26)తో వివాహమైంది. వీరిద్దరూ కొడైకెనాల్లోని ఓ ఐటీకంపెనీలో పనిచేస్తున్నారు. సంవత్సరం నుంచి అన్నయ్ థెరిస్సా యూనివర్సిటీ దగ్గర్లోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి దంపతులు తమ ఇంట్లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీళ్లకు కిరాణా సరుకులు తెచ్చిచ్చే […]
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సూసైడ్ ఘటనను మరువకముందే.. మరో యువ నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరాఠీ యువ నటుడు అశుతోష్ భక్రే (32) గురువారం నాంధేడ్లోని తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అతని మృతికి గల కారణాలు తెలియరాలేదు. 2016లో ఆయన టీవీ నటి మయూరీ దేశ్ముఖ్ను వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా పలు మరాఠా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. వీరిద్దరినీ చిత్రపరిశ్రమ మేడ్ ఫర్ ఈచ్ అదర్గా అభివర్ణించేవారు. ఈ ఘటనపై […]