Breaking News

POLICE

తరగతులు ఆన్​లైన్​లో.. పిల్లలు కూలీపనుల్లో

సారథిన్యూస్​, గద్వాల: రాష్ట్ర విద్యాశాఖ విద్యార్థులకు ఆన్​లైన్​లో పాఠాలు బోధిస్తున్నామని చెబుతుండగా.. కొందరు విద్యార్థులు మాత్రం కూలీ పనులకు వెళ్తున్నారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఆన్​లైన్​ పాఠాలు ప్రారంభించింది. అయినప్పటికి విద్యార్థులకు సరైన గైడెన్స్​ ఇచ్చేవారు లేక వారు యథావిధిగా పొలంపనులకు వెళ్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో విద్యార్థులు ఓ వాహనంలో ఇలా కూలిపనులకు వెళ్తున్నారు.

Read More

రహదారి రక్తసిక్తం.. ఐదుగురు దుర్మరణం

సారథి న్యూస్​, వరంగల్​: వరంగల్​ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్​ రూరల్​ జిల్లా దామెర మండలం పసరగొండ వద్ద లారీ.. కారును ఓవర్​టేక్​ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా కారులో ఉన్న మేకల రాకేశ్​, మేడి చందు, రోహిత్​, సాబిర్​, పవన్​ మృతిచెందారు. మృతులంతా పోచం మైదాన్​కు చెందినవారని సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Read More

పేకాటస్థావరంపై దాడి

సారథిన్యూస్​, గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్​లో పోలీసులు మంగళవారం పేకాటస్థావరంపై దాడి చేసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి సుమారు రూ. 60 వేలు స్వాధీనం చేసుకున్నారు. శాంతినగర్​లోని జమ్మలమడుగు కాలనీలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తనిఖీచేయగా 9 మంది పేకాట ఆడుతూ రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డారు. నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Read More

మావోయిస్ట్​ అగ్రనేత గణపతి.. లొంగుబాటు

సారథి న్యూస్​, హైదరాబాద్​: మావోయిస్ట్​ కీలకనేత గణపతి అలియాస్​ ముప్పాల లక్ష్మణరావు లొంగిపోనున్నట్టు సమాచారం. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలతో ఆయన చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 74 ఏళ్ల గణపతి కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడతున్నారు. నడవడానికి వ్యక్తిగత పనులు చేసుకునేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అజ్ఞాతంలో ఉండడం అసాధ్యమని భావించి ఆయన లొంగిపోనున్నట్టు తెలుస్తోంది. ఆస్తమా, మోకాళ్లనొప్పి, డయాబెటిస్​తో గణపతి బాధపడుతున్నారు. ఆయనను అనుక్షణం ఇద్దరు సహాయకులుగా ఉంటున్నారట. […]

Read More

చిన్నారిపై గ్యాంగ్​రేప్​

త్రిపుర: ఓ వైపు కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో బాలికలు, చిన్నారులపై లైంగికదాడులు కొనసాగుతున్నాయి. తాజాగా త్రిపుర రాష్ట్రంలోని తబారియా జిల్లాలో ఎనిమిదేండ్ల చిన్నారుపై ఏడుగురు లైంగికదాడికి పాల్పడ్డారు. నిందితులంతా మైనర్లే కావడం గమనార్హం. తబారియా జిల్లాకు చెందిన ఓ బాలిక స్థానికంగా మూడో తరగతి చదువుతున్నది. ఆమె ఇంటిపక్కల ఉండే ఎనిమిది మంది బాలురు.. చిన్నారిని ఆడకొనేందుకు పిలిచారు. తెలిసినవాళ్లే కావడంతో చిన్నారి వాళ్లతో వెళ్లింది. దీంతో బాలికను ఓ ఇంట్లోకి తీసుకెళ్లి ఏడుగురు లైంగకదాడికి […]

Read More

శ్రీనగర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు హతం

శ్రీనగర్​: జమ్ముకశ్మీర్​లో ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి. స్థానికుల అండదండలతో చెలరేగిపోతున్నాయి. తాజాగా శ్రీనగర్​లోని పంతాచౌక్​ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న సీఆర్​పీఎఫ్​ దళాలపై ఉగ్రమూక ఒక్కసారిగా దాడులకు తెగబడింది. వెంటనే అలర్టయిన జవాన్లు ఎదురుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. మరోవైపు సీఆర్​పీఎఫ్​కు చెందిన ఓ అసిస్టెంట్​ సబ్​ఇన్​స్పెక్టర్​ కూడా ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ ఘటనతో శ్రీనగర్​ అట్టుడుకింది. ఇరు వర్గాలు దాదాపు గంటపాటు ఫైరింగ్​ చేసుకున్నట్టు సమాచారం.

Read More

దొంగలముఠా దొరికిందిలా..

సారథి న్యూస్​, గద్వాల: నిత్యం దొంగతనాలు చేస్తూ.. పోలీసులను పరుగులు పెట్టిస్తున్న ఓ ముఠా ఎట్టకేలకు చిక్కింది. జోగుళాంబ గద్వాల జిల్లా శాంతినగర్​ పీఎస్​ పరిధిలో గత మూడేండ్లుగా ఓ ముఠా తరుచూ దొంగతనాలకు పాల్పడుతున్నది. ఇప్పటికీ ఈ ముఠా సభ్యులు 11 దొంగతనాలు చేశారు. ఈ నెల 18న రాజోలి వైన్​షాప్​లో ఈ దొంగలు చోరీ చేసి రూ. 45 వేలు, మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. సోమవారం […]

Read More

డీసీపీ సార్​.. మీరు సూపర్​

సారథిన్యూస్​, ఖమ్మం: ఓ పోలీస్​ అధికారి తీసుకున్న చొరువ నిండు ప్రాణాన్ని రక్షించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా రోగులను ఎవరూ దగ్గరికి రానీయడం లేదు. ఈ క్రమంలో పురుటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని పోలీస్​అధికారి సకాలంలో దవాఖానలో చేర్పించి ఆమె ప్రాణాలను కాపాడారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణం.. ఎస్సీ కాలనీకి చెందిన ఒక గర్భిణికి కరోన పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కాగా శుక్రవారం రాత్రి సదరు మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. చుట్టుపక్కల ప్రజలు […]

Read More