Breaking News

MAHABUBNAGAR

జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్​రూమ్​ఇళ్లు

జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్​రూమ్ ​ఇళ్లు

సారథి న్యూస్, మహబూబ్​నగర్: ఉమ్మడి మహబూబ్​నగర్ ​జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ డబుల్​బెడ్​రూమ్​ఇళ్లు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్​బండి విజయ్​కుమార్ ​రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల మహాసభలను మార్చిలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఓ జర్నలిస్టును చంపుతానని బెదిరించడం, అసభ్యకరంగా మాట్లాడడం జర్నలిస్టు సమాజాన్ని అవమానపర్చడమేనని అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు. సదరు ఎమ్మెల్యేను […]

Read More
పిల్లలమర్రికి పునర్జీవం

పిల్లలమర్రికి పునర్జీవం

సారథి న్యూస్, మహబూబ్​నగర్: పాలమూరు జిల్లాకు తలమానికమైన పిల్లలమర్రి పునర్జీవం సాధించింది. పట్టణ శివారులోని సుమారు మూడెకరాల విస్తీర్ణంలో వ్యాపించింది. 700 ఏళ్ల వయస్సు ఉన్న ఈ మర్రివృక్షం ప్రఖ్యాత పర్యాటక క్షేత్రంగా వెలుగొందింది. మర్రి వృక్షాల కొమ్మలు, వేర్లకు చెదలు, శిలింద్ర వ్యాధులు సోకడంతో క్రమక్రమంగా క్షీణించింది. ఇది గమనించిన పూర్వ కలెక్టర్ ​రోనాల్డ్​రాస్ ​ప్రత్యేక చొరవ తీసుకుని బొటానికల్​ గార్డెన్​ శాస్త్రవేత్తలు, సంబంధిత డాక్టర్లను పిలిపించి సంరక్షణ చర్యలు చేపట్టారు. దీంతో పిల్లలమర్రి 140 […]

Read More
కురుమూర్తి జాతరకు రావొద్దు

కురుమూర్తి జాతరకు రావొద్దు

సారథి న్యూస్, మహబూబ్​నగర్: వచ్చే కురుమూర్తి జాతరకు ప్రజలెవరూ ఆలయానికి రావద్దని, ఇళ్ల వద్దనే పూజలు నిర్వహించుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం జడ్పీ మీటింగ్​హాల్​లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కురుమూర్తి జాతర ఉత్సవాలకు మన జిల్లా నుంచే కాకుండా వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈసారి కరోనా నేపథ్యంలో ప్రజలకు ఇళ్లవద్దనే సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించుకోవాలని సూచించారు. ఆలయాధికారులు కరోనా నిబంధనలు […]

Read More
ఏసీబీకి చిక్కిన పాలమూరు మున్సిపల్​ కమిషనర్

ఏసీబీ వలలో పాలమూరు మున్సిపల్​ కమిషనర్

సారథి న్యూస్​, మహబూబ్​నగర్​: ఓ వైపు ఏసీబీ అధికారులు ఆట కట్టిస్తున్నా అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కీసర తహసీల్దార్ నాగరాజు, మెదక్​ జేసీ ఉదంతం మరువకముందే మహబూబ్ నగర్ జిల్లాలో మరోపెద్ద అవినీతి తిమింగలం చిక్కింది. పోలీసుల కథనం మేరకు.. మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డె సురేందర్ రూ.1.65 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. హైదరాబాద్ లో క్లోరినేషన్ మెటీరియల్ ను అలీ అహ్మద్ అనే వ్యాపారి సరఫరా […]

Read More

ఆశా కార్యకర్తల కృషి అద్భుతం

సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: కరోనా నివారణకు ఆశా కార్యకర్తలు అద్భుతంగా పనిచేస్తున్నారని నాగర్​కర్నూల్​ జిల్లా అడిషనల్​ కలెక్టర్​ మనుచౌదరి ప్రశంసించారు. గురువారం కలెక్టరేట్​లో రెడ్​క్రాస్​ సొసైటీ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలను సబ్బులు, శానిటైజర్లు, ఫ్రూట్​జ్యూస్​ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మనుచౌదరి మాట్లాడుతూ.. కరోనా నివారణకు వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ వైద్యసేవలు అందిస్తున్నారని అభినందించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ రమేశ్​రెడ్డి, ట్రెజరర్ రాధాకృష్ణ, యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ డి.కుమార్, బ్లడ్ […]

Read More

రైతు వేదికలపై అశ్రద్ధ వద్దు

సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రైతువేదికల నిర్మాణాలపై అశ్రద్ధ వహించొద్దని నాగర్​కర్నూల్​ జిల్లా ఇన్​చార్జ్​ కలెక్టర్​ ఎస్​కే యాస్మిన్​ బాషా ఆదేశించారు. గడువులోగా రైతువేదికలు నిర్మాణాలు పూర్తిచేయాలని కోరారు. ఆస్తుల ఆన్​లైన్​ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. బుధవారం ఆమె అదనపు కలెక్టర్ మనుచౌదరితో కలిసి బిజినేపల్లి మండలం మహాదేవునిపేట, బిజినపల్లి, పాలెంలో పర్యటించారు. ఆస్తుల ఆన్​లైన్​ వివరాలు, రైతు వేదికనిర్మాణాలు తదితరల పనులను పరిశీలించారు. మహాదేవుని పేట గ్రామంలో గ్రామ పంచాయతీ […]

Read More

మంత్రి నిరంజన్​రెడ్డికి ఘన సన్మానం

సారథిన్యూస్​, గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఆదివారం జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య మంత్రులు సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్​ను సన్మానించారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. గద్వాల జిల్లా అభివృద్ధికి సహకరించాలని ఆమె మంత్రులను కోరారు. కార్యక్రమంలో పలువురు టీఆర్​ఎస్​ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Read More

ప్రగతిపథంలో పల్లెలు

సారథి న్యూస్​, మల్దకల్: గ్రామాల అభివృద్దిపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య పేర్కొన్నారు. మంగళవారం ఆమె మల్దకల్​ మండల ప్రజాపరిషత్​ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఫైళ్లను పరిశీలించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి అడిగి తెలుసుకున్నారు.

Read More