సారథి న్యూస్, నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ ఈ.శ్రీధర్ను బదిలీచేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని సూచించారు. ఆయన స్థానంలో వనపర్తి జిల్లా కలెక్టర్ ఎస్ కే యాస్మిన్బాషాకు నాగర్ కర్నూల్ అదనపు బాధ్యతలు అప్పగించారు. సోమవారం ఉదయం చార్జ్ ను అప్పగించి కలెక్టర్ బాధ్యతల నుంచి ఈ.శ్రీధర్ రిలీవ్ అయ్యారు. నాగర్ […]
సారథిన్యూస్, ఖమ్మం: కరోనా వచ్చిందంటూ తనపై సాక్షాత్తూ ఖమ్మం డీఎమ్హెచ్వో డాక్టర్ మాలతి దుష్ప్రచారం చేశారని జిల్లాకు చెందిన డాక్టర్ శంకర్నాయక్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. డీఎమ్హెచ్వోపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ కావాలని తనకు పాజిటివ్ వచ్చందంటూ రిపోర్టులు మార్చి కొందరు తప్పుడు సమాచారాన్ని వైరల్ చేశారని మండిపడ్డారు. తన కరోనా నెగెటివ్ వచ్చన రిపోర్టులను శంకర్నాయక్ కలెక్టర్ కు చూపించారు. డీఎంఅండ్హెచ్వో పనితీరు సక్రమంగా లేదని ఆమె […]
సారథి న్యూస్, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ కలెక్టర్ ఈ.శ్రీధర్పై ఆదివారం బదిలీవేటు పడింది. వనపర్తి జిల్లా కలెక్టర్ యాష్మిన్బాషాకు నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను సరిగ్గా నిర్వహించలేదనే కారణంతో బదిలీ వేటుపడినట్లు తెలుస్తోంది. అలాగే గృహనిర్మాణశాఖ అదనపు బాధ్యతల నుంచి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ను ప్రభుత్వం తప్పించింది. ఆమె స్థానంలో సునీల్శర్మకు అదనపు బాధ్యతలు అప్పగించింది.
సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్ మున్సిపాలిటీలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాల గురించి కమిషనర్ పట్టించుకోవడంలేదని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. 14వ వార్డులో పర్మిషన్లేకుండా నిర్మిస్తున్న ప్రహారీని గురువారం సీపీఐ బృందం పరిశీలించింది. రోడ్డుకు సెట్ బ్యాక్ ఇస్తూ ఇండ్లను కట్టుకోవాల్సి ఉంటుందన్నారు. కలెక్టర్ స్పందించి అక్రమ కట్టడాలను నిలిపివేయాలని కోరారు. పరిశీలించిన వారిలో మాజీ వైస్ ఎంపీపీ గడిపె మల్లేశ్, సీపీఐ నాయకులు జాగీర్ సత్యనారాయణ, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వెల్పుల […]
సారథిన్యూస్, మహబూబాబాద్: కలెక్టరేట్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ వీపీ గౌతం ఆదేశించారు. జిల్లా కేంద్రం సమీపంలోని కురవిలో నిర్మితమవుతున్న నూతన కలెక్టరేట్ భవనాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం పట్టణంలో పర్యటించారు. వాహనాలు రోడ్లపై నిలుపకుండా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఎంపికచేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో కొత్తగా ఐదు గోదాములు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ […]
సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో, ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయాల భర్తీకి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 548 ప్రధాన, 92 చిన్న అంగన్వాడీ కేంద్రాలున్నట్లు తెలిపారు. ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో 51 టీచర్లు, 132 ఆయాలు, చిన్న అంగన్వాడీ కేంద్రాల్లో 45 టీచర్లు, ఆయా పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. వెంటనే ఖాళీల […]
సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన మోడల్ డెయిరీఫామ్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కృష్ణఆదిత్య అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ములుగు మండలంలోని పేదలను గుర్తించి వారికి గేదెలను పంపిణీచేయాలని సూచించారు. ఇందుకోసం ఎస్సీ కార్పొరేషన్, జిల్లా పశుసంవర్థక అధికారి, జిల్లా ప్రణాళికాధికారితో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. సమీక్షలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి కే […]
సారథిన్యూస్, వనపర్తి: రైతు వేదిక నిర్మాణాలను వేగవంతం చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లా నాగవరం శివారులో నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణపనులను ఆమె పరిశీలించారు. ఆమె వెంట ఆర్డీవో కే చంద్రారెడ్డి, తహసీల్దార్ రాజేందర్ గౌడ్ పాల్గొన్నారు.