Breaking News

CENTRAL

బాబు ఉక్కిరిబిక్కిరి

చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి

అమరావతి: కేంద్రప్రభుత్వం తాజా నిర్ణయంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్​ రాజధాని వ్యవహారంలో తమకు ఎటువంటి సంబంధం లేదని కేంద్రప్రభుత్వం హైకోర్టుకు తేల్చిచెప్పింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని భావించిన టీడీపీకి ప్రస్తుత బీజేపీ నిర్ణయంతో ఆశలు అడుగంటాయి. రాజధాని ఏర్పాటు కేంద్రం పరిధిలోని అంశమని పీవీ కృష్ణయ్య అనే వ్యక్తి ఇటీవల హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన […]

Read More
మూడు భాషల విధానం మాకొద్దు

మూడుభాషల విధానం మాకొద్దు

చెన్నై: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన విద్యావిధానాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని తమిళనాడు సీఎం కే పళనిస్వామి తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టాలనుకుంటున్న జాతీయ విద్యావిధానంలో విద్యార్థులకు తమ రాష్ట్ర ప్రాంతీయభాషతో పాటు హిందీ, ఇంగ్లీష్​ లాంగ్వేజ్​లను పెట్టాలన్న నిబంధన ఉందని, అది తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన తెలిపారు. తమిళనాడులో విద్యార్థులకు తమిళం, ఇంగ్లీష్​ మాత్రమే బోధిస్తున్నామని ఇదే విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం చెప్పినట్టుగా హిందీని మూడో లాంగ్వేజ్​గా […]

Read More
దేశంలో రెండు కోట్ల కరోనా పరీక్షలు

కరోనా పరీక్షలు @ 2 కోట్లు

ఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు దాదాపు 2 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర వైద్యశాఖ అధికారులు తెలిపారు. టెస్టింగ్​, ట్రేసింగ్​, ట్రీటింగ్​ ద్వారానే కరోనాను అరికట్టవచ్చన్నారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ సరిగ్గా టెస్టులు చేయడం లేదు. కరోనా రోగుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 18,03,695 కు చేరుకుంది. గత 24 గంటల్లో 52,972 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో దేశవ్యాప్తంగా 38,135 మంది […]

Read More
కోలుకున్నవారి సంఖ్య పెరుగుతున్నది

ఒకేరోజు 50 వేలమంది డిశ్చార్జ్​

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇది నిజంగా ఉపశమనం కలిగించే వార్తే. కేంద్ర వైద్యశాఖ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. గత 24 గంటల్లో 51,255 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఒకే రోజు ఇంతమంది కోలుకోవడం మనదేశంలో ఇదే ప్రథమం. కాగా ఇప్పటివరకు మొత్తం 11,45,629 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 54,735 కొత్తకేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 17,50,723కు చేరుకున్నది. ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన […]

Read More
5+3+3+4

5+3+3+4

జాతీయ విద్యావిధానానికి కొత్త హంగులు వృత్తి, ఉపాధి లభించేలా నూతన వ్యవస్థ కేంద్రం మానవ వనరుల శాఖ.. ఇక విద్యామంత్రిత్వ శాఖగా మార్పు ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ ​కీలక నిర్ణయాలు న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్రం మానవ వనరుల శాఖ పేరును విద్యా మంత్రిత్వశాఖగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు నూతన జాతీయ విద్యా విధానానికి కేబినెట్ […]

Read More
ఆగస్టులోనైనా బొమ్మ పడేనా.. ?

ఆగస్టులోనైనా బొమ్మ పడేనా..?

కరోనా మహమ్మారి‌, తదనంతర లాక్‌ డౌన్‌ పరిస్థితులు సినిమా రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. షూటింగ్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో పాటు. థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని నిబంధనలతో చిత్రీకరణలకు ఇటీవల అనుమతి లభించినప్పటికీ. థియేటర్లు మాత్రం ఇంకా తెరుచుకోలేదు. అయితే వాటికి కూడా అనుమతిచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఆగస్టులో సినిమా థియేటర్లను తెరవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ. హోంశాఖకు సిఫార్సు చేసింది. సీఐఐ మీడియా కమిటీ సమావేశంలో ఐ అండ్‌ బీ కార్యదర్శి అమిత్‌ ఖారే […]

Read More
అన్‌లాక్‌-2: కేంద్రం కీలక గైడ్​లైన్స్​

అన్‌లాక్‌-2: కేంద్రం కీలక గైడ్​లైన్స్​

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ కంటైన్‌మెంట్‌ జోన్లలో కేంద్రం లాక్‌డౌన్‌ పొడిగించింది. ఈ మేరకు సోమవారం రాత్రి అన్‌లాక్‌ -2 విధివిధానాలను ప్రకటించింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో జులై 31వరరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర శిక్షణా సంస్థలకు జులై 15 నుంచి కార్యకలాపాలకు అవకాశం కల్పించింది. అలాగే, హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకే అంతర్జాతీయ ప్రయాణికులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. మెట్రో రైళ్లు, థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌పై నిషేధం కొనసాగనుంది. […]

Read More

తెలంగాణలో కేంద్రబృందం పర్యటన

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రలో పర్యటించనుంది. ఈ నెల 26 నుంచి 29 వరకు కేంద్ర బృందం తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటించి కరోనా ఉధృతిని అంచనా వేయనున్నది. ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ నేతృత్వంలో కేంద్ర బృందం మూడు రాష్ట్రాల్లో తిరిగి కరోనాకు ఆయా రాష్ట్రాల్లో చేస్తున్న కరోనా టెస్టులు, వైద్యం తదితర అంశాలను పరిశీలించనున్నది.

Read More