వెల్లడించిన ఎలక్షన్కమిషన్ ఓటరు జాబితా విడుదల న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓటర్ల జాబితా 2022ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా దాఖలైన దరఖాస్తులను పరిష్కరించిన కేంద్ర ఎన్నికల సంఘం అనంతరం ఓటర్ల ఫైనల్లిస్టును ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,03,56,894 మంది ఉన్నారని తెలిపింది. ఇందులో పురుష ఓటర్లు 1,52,56,474 మంది, మహిళా ఓటర్లు 1,50,98,685 మంది, ఇతర ఓటర్లు 1,735 మంది ఉన్నారని […]
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్.. అసంఘటిత రంగం మీద మోడీ సర్కారు చేసిన మూడో దాడి అని కాంగ్రెస్ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కొద్దిరోజులుగా ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ, బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతున్నారు. ఈ వీడియో సిరీస్ లో భాగంగా బుధవారం రాహుల్ స్పందిస్తూ.. ప్రధాని మోదీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కోవిడ్ పై పోరులో భాగంగా 21 రోజులు యుద్ధం […]
న్యూఢిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తున్నది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 75,760 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,023 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 60,472కు చేరుకున్నది. భారత్లో ప్రస్తుతం 7,25,991 యాక్టివ్ కేసులు ఉండగా.. మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 33,10,235కు చేరుకుంది. వీరిలో 25,23,772 మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ […]
న్యూఢిల్లీ: సినిమాలు, టీవీ సీరియల్స్ షూటింగ్లకు కేంద్రప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అన్లాక్ 3.0 మార్గదర్శకాల్లో భాగంగా షూటింగ్లకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఉదయం కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మార్గదర్శకాలను విడుదల చేశారు. బహిరంగ ప్రదేశాల్లో యూనిట్ సిబ్బంది తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని నిబంధనల్లో సూచించారు. నటీనటిలంతా ఆరోగ్యసేతు యాప్ను ఉపయోగించాలని.. షూటింగ్ సమయంలో విజిటర్లను అనుమతించవద్దని సూచించారు. మేకప్ సిబ్బంది కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలని సూచించారు. వీటితోపాటు చిత్రీకరణ […]
ఢిల్లీ: ఏపీ రాజధాని అంశంపై కేంద్రం మరోసారి స్పష్టత నిచ్చింది. రాజధాని విషయంలో తాము జోక్యం చేసుకొనే ప్రసక్తే లేదని.. అది కేంద్రం పరిధిలోకి రాదని తేల్చిచెప్పింది. రాజధాని ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్నది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దుపై ఏపీ హైకోర్టులో కేంద్రం మరోసారి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టం రద్దు నిర్ణయాల నేపథ్యంలో దోనే సాంబశివరావు అనే […]
ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స తీసుకుంటున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆస్పత్రిలో చేరినట్టు కుటుంబసభ్యలు తెలిపారు. ఎయిమ్స్ డైరెక్టర్ రన్దీప్ గులేరియా పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవలే ఆయన కరోనా నుంచి బయట పడిన విషయం తెలిసిందే. ఈ నెల 14న అమిత్షాకు కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో యధాప్రకారం తన కార్యకలాపాలను కొనసాగించారు. అయితే ఆయనకు మరోసారి స్వల్ప జ్వరం, […]
ఢిల్లీ: మనదేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 55,079 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 27,02,742లకు చేరుకున్నది. ఇప్పటికీ 19,77,779 మంది కరోనానుంచి కోలుకున్నారు. కరోనాతో మృతిచెందిన వారిసంఖ్యకూడా గణనీయంగానే ఉన్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 51,797 మంది కరోనాతో మృతిచెందారు. 6,73,166 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రవైద్యశాఖ అధికారులు కోరారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని.. కరోనా సోకినా భయాందోళనకు […]
సారథిన్యూస్, హైదరాబాద్: కృష్ణా నదిపై చేపట్టనున్న ప్రాజెక్టులపై కొంతకాలంగా ఏపీ, తెలంగాణ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఆపాలని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేస్తున్నది. ఈ విషయంపై సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేసింది టీ సర్కారు. అయితే శ్రీశైలం ఎడమగట్టు వద్ద తెలంగాణ జలవిద్యుత్ ఉత్పత్తి చేయడంపై ఏపీ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కాగా ఈ వివాదంపై తాజాగా కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకున్నది. అపెక్స్ కౌన్సిల్ […]