Further strengthen the marketing department మార్కెటింగ్శాఖ మరింత బలోపేతం వ్యవసాయశాఖ పొలం.. హలం శాఖగా మారాలి రైతు వేదికలను వాడుకలోకి తీసుకురావాలి పంటసాగు విధానంలో మార్పు రావాలి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ప్రాధాన్యం, బాధ్యత ఎంతో పెరిగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గుర్తుచేశారు. వ్యవసాయశాఖ కాగితం కలం శాఖగా కాకుండా పొలం.. హలం శాఖగా […]
తక్షణమే రూ.రెండువేల కోట్ల నిధులు విడుదల చేయాలి ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష సారథి న్యూస్, హైదరాబాద్: వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, దుర్భిక్షానికి నెలువైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరి నాటికి వందశాతం పూర్తిచేయాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఫ్లోరైడ్, వర్షాభావ పరిస్థితులు ఉన్న నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించే డిండి ప్రాజెక్టు […]
సారథి న్యూస్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పరిధిలోని శ్రీరామ్ నగర్ లో డయాగ్నోస్టిక్ మినీ హబ్ సెంటర్ ను మంత్రి కె.తారక రామారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ మొత్తం 57 రకాల రక్తపరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. పట్టణ పేదలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కరోనా కాలంలో వైద్యులు, ఇతర సిబ్బంది అందించిన సేవలను ప్రభుత్వం ఎప్పటికీ మరచిపోదని గుర్తుచేశారు. డయాగ్నోస్టిక్ సెంటర్ ను భవిష్యత్లో జిల్లా కేంద్రాలకు విస్తరించేందుకు […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును గురువారం ప్రగతి భవన్ లో నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు మర్యాదపూర్వకంగా కలిశారు. కాబోయే సీఎం అని శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్నే మార్చేసింది ఇదే స్ఫూర్తితో తుపాకులగూడెం, దుమ్ముగూడెం పనులు కాళేశ్వరం పర్యటనలో సీఎం కె.చంద్రశేఖర్రావు ముక్తేశ్వరస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు సారథి న్యూస్, భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయంలో ఆశించిన రీతిలో పూర్తయి నీటి పంపింగ్ కూడా నిరాటంకంగా సాగుతోందని సీఎం కె.చంద్రశేఖర్రావు సంతోషం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తికావడంలో కృషిచేసిన నీటిపారుదల శాఖాధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు, ఇతర శాఖల ఉద్యోగులను ఆయన అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన […]
సారథి న్యూస్, మానవపాడు: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి గొప్ప వ్యక్తి గురుకులాలకు సెక్రటరీగా ఉండడం ఈ ప్రాంత విద్యార్థుల అదృష్టమని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని ఆయన అన్నారు. అలంపూర్ లో నిర్వహించిన స్వేరోస్ సంబరాల్లో గురువారం ఉదయం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మొదట […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.26 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనం(సీడీఎస్) వచ్చే అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిర్మాణ పనులను బుధవారం సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్లు గువ్వల బాలరాజ్, బాల్క సుమన్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాలే యాదయ్య, గోపీనాథ్, గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబాపసియుద్దీన్ తదితరులు సందర్శించారు. దళితుల అభ్యున్నతి […]
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: కరోనా నేపథ్యంలో మూతబడిన స్కూళ్లను తగిన జాగ్రత్తలు పాటిస్తూ పునఃప్రారంభించాలని టీఎస్ యూటీఎఫ్ మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలాధ్యక్షుడు గిరిబాబు కోరారు. సోమవారం ఆయన ఎంపీడీవో గణేష్ రెడ్డి చేతుల మీదుగా టీఎస్ యూటీఎఫ్ క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలస్యం చేయకుండా ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ ద్వారా విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తిరుపతి, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ ఫణింద్రచారి, ఉపాధ్యాయులు రామబ్రహ్మకుమార్, విఠోబా, స్వామి, ప్రవీణ్ […]