సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలల్లో 2024-2025 విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదివేందుకు అర్హత కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీ డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. 4వ తరగతి పూర్తయిన విద్యార్థులు డిసెంబర్ 18 నుంచి.. 2024 జనవరి 6వ వరకు రూ.100 చెల్లించి ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని కోరారు. తేదీ: 11.2.2024న మధ్యాహ్నం 1గంటలకు ప్రవేశపరీక్ష ఉంటుందని తెలిపారు. అందులో పాసైన వారికి […]
సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ, గిరిజన గురుకులం, మహాత్మాజ్యోతి బాపూలే గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి చదివేందుకు గత మే 8వ తేదీన నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ర్యాంకు కార్డులను అందుబాటులో ఉంచారు. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సంబంధిత స్కూలులో జాయిన్ కావాలని గురుకుల విద్యాలయాల సంస్థ అధికారులు ప్రకటించారు. సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లను అందుబాటులో పొందుపరిచారు. వెబ్సైట్ లోకి […]
సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకులాలను నడిపించేందుకు ప్రభుత్వం సరైన బడ్జెట్ ఇవ్వలేదు.. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వద్ద భిక్ష అడగాల్సి వచ్చేదని గురుకులాల పూర్వ కార్యదర్శి, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ గుర్తుచేసుకున్నారు. నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని చెప్పుకొచ్చారు. అయినా కూడా ప్రభుత్వం ఇచ్చిన ఒక్కోరూపాయిని జాగ్రత్తగా ఖర్చుపెడుతూ పేదవర్గాల బిడ్డలకు నాణ్యమైన చదువులు అందించగలిగామని వివరించారు. టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యమంత్రి, ప్రభుత్వం గురుకులాలకు ఏదో చేశామని, అహో, […]
కండ కావరాన్ని ఆత్మగౌరవంతో ఓడించాలె ఎన్నో అడ్డంకులు వచ్చినా జ్ఞానమార్గాన్ని వీడొద్దు గురుకులాల సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అలరించిన ఆరో స్వేరో స్వర సునామీ వేడుక సారథి, హైదరాబాద్: పాటలకు చావులేదని, పాటలు జీవితాలను, సమూహాలను మారుస్తాయని, సమాజంలో మార్పులు తీసుకొస్తాయని, చరిత్ర గతినే మారుస్తాయని స్వేరోస్ఆర్గనైజేషన్ఫౌండర్, గురుకులాల సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అభివర్ణించారు. పాటలు ప్రపంచానే మారుస్తాయని, స్వాతంత్ర్యాన్ని తీసుకొస్తాయని గుర్తుచేశారు. పాటలే అధికారాన్ని కూడా తీసుకొస్తాయని పునరుద్ఘాటించారు. ఇందుకు ‘వందేమాతరం’, ‘బండెనుక […]
సారథి న్యూస్, బిజినేపల్లి: స్థానికంగా సరైన వసతులు లేవనే కారణంతో వనపర్తి, షాద్నగర్ లో కొనసాగుతున్న బిజినేపల్లి సాంఘిక సంక్షేమశాఖ గురుకుల బాలుర పాఠశాల, నాగర్ కర్నూల్ మహిళా గురుకుల డిగ్రీ కాలేజీని ఇదివరకు ఉన్న ప్రదేశాల్లోనే కొనసాగించాలని సీఎం కె.చంద్రశేఖర్రావు గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను కోరారు. ఈ మేరకు సోమవారం సీఎంవో సెక్రటరీ కె.భూపాల్రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. విద్యార్థులకు సరిపడా గదులు, వసతి సౌకర్యం లేదని గతేడాది బిజినేపల్లి స్కూలును వనపర్తికి, నాగర్కర్నూల్ […]
సారథి న్యూస్, మానవపాడు: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి గొప్ప వ్యక్తి గురుకులాలకు సెక్రటరీగా ఉండడం ఈ ప్రాంత విద్యార్థుల అదృష్టమని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని ఆయన అన్నారు. అలంపూర్ లో నిర్వహించిన స్వేరోస్ సంబరాల్లో గురువారం ఉదయం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మొదట […]
సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: ఈనెల 13, 14 తేదీల్లో అలంపూర్ పట్టణంలో నిర్వహిస్తున్న స్వేరో సంబరాలను విజయవంతం చేయాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ సోలపోగుల స్వాములు కోరారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని బూడిదపాడ్ గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. సంబరాల్లో భాగంగా పరుగు పందెం, లాంగ్జంప్, షార్ట్పుట్, కవితలు, పాటలు, వ్యాసరచన, చిత్రలేఖనం.. తదితర పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంబరాలకు బూడిదపాడ్, కలుగొట్ల […]
సారథి న్యూస్, అచ్చంపేట: తెలంగాణ 7వ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ కోసం జిల్లాస్థాయి సెలక్షన్లు బుధవారం అచ్చంపేట సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలను ఎస్సై ప్రదీప్ కుమార్ ప్రారంభించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఉత్తమ క్రీడా నైపుణ్యాలు ప్రదర్శించి రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి దాదాపు 300 మంది బాల, బాలికలు పాల్గొన్నారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు జనవరి […]