సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో శుక్రవారం 7 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 21 మందికి పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. గవ్వలపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ రాగా, రుద్రారం గ్రామంలో ఒక కుటుంబానికి చెందిన భార్యాభర్తలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మండలంలో రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ప్రజలు అనవసరంగా బయట తిరగొద్దని […]
సారథిన్యూస్, చొప్పదండి: కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు మౌనప్రదర్శన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ అంబటి రజితకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కరోనాతో ఇబ్బంది పడుతున్నారని .. వెంటనే కోవిడ్19ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణలో అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో […]
చెన్నై: ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం ఓ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ నెల 5న బాలుకు కరోనా సోకడంతో చెన్నైలోని ఏజీఎం ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాలు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం 1,921 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 88,396కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ ను విడుదల చేసింది. తాజాగా కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 674కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,210 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి […]
న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్నది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 24,61,190 కు చేరుకున్నది. గత 24 గంటల్లోనే 64,553 కొత్తకేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు 48,040 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 17,51,555 మంది కరోనానుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 6,61,595 మంది వివిధ దవాఖానల్లో చికిత్సపొందుతున్నారు.
బీజింగ్: చైనాలో మరోసారి కరోనా కలకలం రేపింది. గ్వాంగ్డాండ్ ప్రావిన్స్లోని షెన్జెన్ నగరానికి దిగుమతి అయిన నిలువచేసిన చికెన్ వింగ్స్లో కరోనా వైరస్ ఆనవాళ్లు కనిపించడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ మాంసంతో కరోనా మరోసారి వ్యాప్తిస్తుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బ్రెజిల్లోని శాంటా కటారినా రాష్ట్రంలోని అరోరా ఎలిమెంట్లోని ఓ ప్లాంట్ నుంచి చికెన్ వింగ్స్.. షెన్జెన్కు దిగుమతి అయినట్టు సమాచారం. దీంతో దిగుమతి చేసుకున్న ఆహారపదార్థాల కొనుగోలు విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అక్కడి […]
తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన ప్రముఖ సినీ హీరోయిన్ నిక్కీ గార్లాని కరోనా బారిన పడ్డారు. స్వయంగా ఆమె ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించింది. తనకు కరోనా సోకిందని.. హోమ్ ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పింది. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించింది. నిక్కి తెలుగులో సునీల్ హీరోగా నటించిన కృష్ణాష్టమి చిత్రంలో నటించింది. పలు తమిళ చిత్రాల్లోనూ ఆమె నటించింది. ప్రస్తుతం లారెన్స్ నటిస్తున్న రంగస్థలం తమిళ్ రీమేక్లో […]
సారథి న్యూస్, అచ్చంపేట: కరోనా విపత్తులోనూ రూ.1,173కోట్లను రైతుబీమా కోసం చెల్లించామని వ్యవసాయశాఖ మంత్రి ఎస్.నిరంజన్రెడ్డి అన్నారు. రైతుబంధు పథకం ద్వారా 57లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.ఐదువేల చొప్పున అందించామన్నారు. గురువారం అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి నియామకం, అభినందన సభ నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా మంత్రి ఎస్.నిరంజన్రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్.నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. పంటల నమోదును రాష్ట్రంలో శాస్త్రీయంగా అమలు […]